ఏపీ అధికార పార్టీ వైసీపీకి దిమ్మతిరిగిపోయింది. తాజాగా జరిగిన ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు ను కూడా కోల్పోయేది లేదని పేర్కొంటూ వచ్చిన వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఈ ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది. సాధారణంగా అభ్యర్థి గెలుపునకు 22 ఓట్లు సరిపోతుండగా.. టీడీపీకి ఇప్పటి వరకు 23 ఓట్లు రావడం గమనార్హం. అదేసమయంలో వైసీపీ అభ్యర్థులకు కేవలం 22 ఇద్దరికి 21 చొప్పున రావడం గమనార్హం.
వాస్తవానికి ఎలాంటి అంచనాలు లేకుండానేటీడీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ సాహసం ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నలు కూడా వచ్చాయి. బీసీ సామాజిక వర్గం చేనేత వర్గానికి చెందిన పంచుమర్తి అనురాధ.. ను చంద్రబాబు బరిలో నిలిపారు. అయితే.. అప్పటికి టీడీపీకి ఉన్నది కేవలం 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. దీంతో బాబు ప్రయత్నం వృథా అని అనుకున్నారు.
కానీ, అనూహ్యంగా చంద్రబాబు వ్యూహం ఫలించింది. వైసీపీకిగట్టి ఎదురు దెబ్బతగిలిందనే చెప్పాలి. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీఅభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు లభించాయి. దీంతో ఆమె గెలుపును ఎవరూ ఆపలేకపోయారనే చెప్పాలి. దీంతో వైసీపీ శిబిరంలో ఎలాంటి సందడీ లేకుండా పోయింది. ఎవరికి వారు మౌనంగా ఉన్నారు. ఎక్కడ ఏం జరిగిందో అని నాయకులు తలపట్టుకుంటున్నారు.
This post was last modified on March 23, 2023 8:36 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…