ఏపీ అధికార పార్టీ వైసీపీకి దిమ్మతిరిగిపోయింది. తాజాగా జరిగిన ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు ను కూడా కోల్పోయేది లేదని పేర్కొంటూ వచ్చిన వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఈ ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది. సాధారణంగా అభ్యర్థి గెలుపునకు 22 ఓట్లు సరిపోతుండగా.. టీడీపీకి ఇప్పటి వరకు 23 ఓట్లు రావడం గమనార్హం. అదేసమయంలో వైసీపీ అభ్యర్థులకు కేవలం 22 ఇద్దరికి 21 చొప్పున రావడం గమనార్హం.
వాస్తవానికి ఎలాంటి అంచనాలు లేకుండానేటీడీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ సాహసం ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నలు కూడా వచ్చాయి. బీసీ సామాజిక వర్గం చేనేత వర్గానికి చెందిన పంచుమర్తి అనురాధ.. ను చంద్రబాబు బరిలో నిలిపారు. అయితే.. అప్పటికి టీడీపీకి ఉన్నది కేవలం 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. దీంతో బాబు ప్రయత్నం వృథా అని అనుకున్నారు.
కానీ, అనూహ్యంగా చంద్రబాబు వ్యూహం ఫలించింది. వైసీపీకిగట్టి ఎదురు దెబ్బతగిలిందనే చెప్పాలి. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీఅభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు లభించాయి. దీంతో ఆమె గెలుపును ఎవరూ ఆపలేకపోయారనే చెప్పాలి. దీంతో వైసీపీ శిబిరంలో ఎలాంటి సందడీ లేకుండా పోయింది. ఎవరికి వారు మౌనంగా ఉన్నారు. ఎక్కడ ఏం జరిగిందో అని నాయకులు తలపట్టుకుంటున్నారు.
This post was last modified on March 23, 2023 8:36 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…