ఏపీ అధికార పార్టీ వైసీపీకి దిమ్మతిరిగిపోయింది. తాజాగా జరిగిన ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు ను కూడా కోల్పోయేది లేదని పేర్కొంటూ వచ్చిన వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఈ ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది. సాధారణంగా అభ్యర్థి గెలుపునకు 22 ఓట్లు సరిపోతుండగా.. టీడీపీకి ఇప్పటి వరకు 23 ఓట్లు రావడం గమనార్హం. అదేసమయంలో వైసీపీ అభ్యర్థులకు కేవలం 22 ఇద్దరికి 21 చొప్పున రావడం గమనార్హం.
వాస్తవానికి ఎలాంటి అంచనాలు లేకుండానేటీడీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ సాహసం ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నలు కూడా వచ్చాయి. బీసీ సామాజిక వర్గం చేనేత వర్గానికి చెందిన పంచుమర్తి అనురాధ.. ను చంద్రబాబు బరిలో నిలిపారు. అయితే.. అప్పటికి టీడీపీకి ఉన్నది కేవలం 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. దీంతో బాబు ప్రయత్నం వృథా అని అనుకున్నారు.
కానీ, అనూహ్యంగా చంద్రబాబు వ్యూహం ఫలించింది. వైసీపీకిగట్టి ఎదురు దెబ్బతగిలిందనే చెప్పాలి. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీఅభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు లభించాయి. దీంతో ఆమె గెలుపును ఎవరూ ఆపలేకపోయారనే చెప్పాలి. దీంతో వైసీపీ శిబిరంలో ఎలాంటి సందడీ లేకుండా పోయింది. ఎవరికి వారు మౌనంగా ఉన్నారు. ఎక్కడ ఏం జరిగిందో అని నాయకులు తలపట్టుకుంటున్నారు.
This post was last modified on March 23, 2023 8:36 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…