Political News

వైసీపీకి భారీ షాక్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి దిమ్మ‌తిరిగిపోయింది. తాజాగా జ‌రిగిన ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఒక్క సీటు ను కూడా కోల్పోయేది లేద‌ని పేర్కొంటూ వ‌చ్చిన వైసీపీకి భారీ షాక్ త‌గిలింది. ఈ ఎన్నిక‌లో టీడీపీ ఘ‌న విజ‌యం సాధించింది. సాధార‌ణంగా అభ్య‌ర్థి గెలుపునకు 22 ఓట్లు స‌రిపోతుండ‌గా.. టీడీపీకి ఇప్ప‌టి వ‌ర‌కు 23 ఓట్లు రావ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మయంలో వైసీపీ అభ్య‌ర్థుల‌కు కేవ‌లం 22 ఇద్ద‌రికి 21 చొప్పున రావ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి ఎలాంటి అంచ‌నాలు లేకుండానేటీడీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటీ చేసింది. ఈ సాహ‌సం ఎందుకు చేస్తున్నార‌నే ప్ర‌శ్న‌లు కూడా వ‌చ్చాయి. బీసీ సామాజిక వ‌ర్గం చేనేత వ‌ర్గానికి చెందిన పంచుమ‌ర్తి అనురాధ‌.. ను చంద్ర‌బాబు బ‌రిలో నిలిపారు. అయితే.. అప్ప‌టికి టీడీపీకి ఉన్న‌ది కేవ‌లం 19 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే. దీంతో బాబు ప్ర‌య‌త్నం వృథా అని అనుకున్నారు.

కానీ, అనూహ్యంగా చంద్ర‌బాబు వ్యూహం ఫ‌లించింది. వైసీపీకిగ‌ట్టి ఎదురు దెబ్బ‌త‌గిలింద‌నే చెప్పాలి. తాజాగా జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీఅభ్య‌ర్థి పంచుమ‌ర్తి అనురాధ‌కు 23 ఓట్లు ల‌భించాయి. దీంతో ఆమె గెలుపును ఎవ‌రూ ఆప‌లేక‌పోయార‌నే చెప్పాలి. దీంతో వైసీపీ శిబిరంలో ఎలాంటి సంద‌డీ లేకుండా పోయింది. ఎవ‌రికి వారు మౌనంగా ఉన్నారు. ఎక్క‌డ ఏం జ‌రిగిందో అని నాయ‌కులు త‌ల‌ప‌ట్టుకుంటున్నారు.

This post was last modified on March 23, 2023 8:36 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

31 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

48 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

3 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago