ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం దక్కించుకుంది. పోటీ చేసింది ఒకే ఒక్క అభ్యర్థి అయినప్పటికీ.. గెలుపు గుర్రం ఎక్కడం.. అందునా 22 ఓట్లు వస్తే.. సరిపోతుందని భావించినా.. ఏకంగా 23 ఓట్లు దక్కించుకోవడం.. వంటివి.. టీడీపీ శిబిరంలో భారీ ఎత్తున జోష్ నింపిందనే చెప్పాలి. ఇదంతా.. చంద్రబాబు విజన్కు దర్పణంగా నిలిచిందని అంటున్నారు.
వాస్తవానికి ఏమాత్రం అంచనాలు లేకుండానే టీడీపీ రంగంలోకి దిగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ల నోటిఫికేషన్ మార్చి 2న వచ్చింది. అయితే.. 13వ తేదీ వరకు నామినే షన్లకు అవకాశం ఉంది. అప్పటికే వైసీపీ అధినేత సీఎం జగన్ తరఫున సలహాదారు సజ్జలరామకృష్ణారెడ్డి అభ్యర్థులను ఖరారు చేశారు. ఇక, 9వ తేదీ వరకు కూడా.. ఈ ఎన్నికపై అసలు టీడీపీ దృష్టి పెట్టనేలేదు. ఎందుకంటే అప్పటి వరకు టీడీపీకి ఉన్నది కేవలం 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే.
టెక్నికల్గా 23 మంది ఉన్నా.. మిగిలిన నలుగురు కూడా పార్టీకి దూరంగా ఉన్నా.. వైసీపీకి అనుబంధంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే.. చంద్రబాబు అసలు దీనిపై దృష్టి పెట్టలేదు. ఇలాంటి సమయంలో కేవలం ఒకే ఒక్క రోజు ముందు.. ఆయన ఆలోచనలకు అనుగుణంగా..ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ఎందుకు పెట్టకూడదని భావించారు. ఈ క్రమంలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన పంచుమర్తి అనురాధను ఆయన రంగంలోకి దింపారు.
కేవలం ఒక్కరోజు ముందు మాత్రమే నామినేషన్ వేశారు. అదేసమయంలో వైసీపీ వ్యూహాల ముందు కూడా టీడీపీ నిలుస్తుందా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. మరోసారి బీసీలకు అన్యాయం చేస్తున్నార ని కూడా కొంత వాదన అయితే వినిపించింది. కానీ, ఈ వాదనలు.. చంద్రబాబు విజన్ ముందు నిలవలేక పోయాయి. వైసీపీలో అసంతృప్తులను ఆయన గుర్తించారు. వారితో టచ్లోకి వెళ్లారు. ఘన విజయం దక్కించుకున్నారు. మరోసారి బాబు విజన్కు తిరుగులేదని అంటున్నారు.
This post was last modified on March 23, 2023 8:31 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…