ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం దక్కించుకుంది. పోటీ చేసింది ఒకే ఒక్క అభ్యర్థి అయినప్పటికీ.. గెలుపు గుర్రం ఎక్కడం.. అందునా 22 ఓట్లు వస్తే.. సరిపోతుందని భావించినా.. ఏకంగా 23 ఓట్లు దక్కించుకోవడం.. వంటివి.. టీడీపీ శిబిరంలో భారీ ఎత్తున జోష్ నింపిందనే చెప్పాలి. ఇదంతా.. చంద్రబాబు విజన్కు దర్పణంగా నిలిచిందని అంటున్నారు.
వాస్తవానికి ఏమాత్రం అంచనాలు లేకుండానే టీడీపీ రంగంలోకి దిగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ల నోటిఫికేషన్ మార్చి 2న వచ్చింది. అయితే.. 13వ తేదీ వరకు నామినే షన్లకు అవకాశం ఉంది. అప్పటికే వైసీపీ అధినేత సీఎం జగన్ తరఫున సలహాదారు సజ్జలరామకృష్ణారెడ్డి అభ్యర్థులను ఖరారు చేశారు. ఇక, 9వ తేదీ వరకు కూడా.. ఈ ఎన్నికపై అసలు టీడీపీ దృష్టి పెట్టనేలేదు. ఎందుకంటే అప్పటి వరకు టీడీపీకి ఉన్నది కేవలం 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే.
టెక్నికల్గా 23 మంది ఉన్నా.. మిగిలిన నలుగురు కూడా పార్టీకి దూరంగా ఉన్నా.. వైసీపీకి అనుబంధంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే.. చంద్రబాబు అసలు దీనిపై దృష్టి పెట్టలేదు. ఇలాంటి సమయంలో కేవలం ఒకే ఒక్క రోజు ముందు.. ఆయన ఆలోచనలకు అనుగుణంగా..ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ఎందుకు పెట్టకూడదని భావించారు. ఈ క్రమంలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన పంచుమర్తి అనురాధను ఆయన రంగంలోకి దింపారు.
కేవలం ఒక్కరోజు ముందు మాత్రమే నామినేషన్ వేశారు. అదేసమయంలో వైసీపీ వ్యూహాల ముందు కూడా టీడీపీ నిలుస్తుందా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. మరోసారి బీసీలకు అన్యాయం చేస్తున్నార ని కూడా కొంత వాదన అయితే వినిపించింది. కానీ, ఈ వాదనలు.. చంద్రబాబు విజన్ ముందు నిలవలేక పోయాయి. వైసీపీలో అసంతృప్తులను ఆయన గుర్తించారు. వారితో టచ్లోకి వెళ్లారు. ఘన విజయం దక్కించుకున్నారు. మరోసారి బాబు విజన్కు తిరుగులేదని అంటున్నారు.
This post was last modified on March 23, 2023 8:31 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…