ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం దక్కించుకుంది. పోటీ చేసింది ఒకే ఒక్క అభ్యర్థి అయినప్పటికీ.. గెలుపు గుర్రం ఎక్కడం.. అందునా 22 ఓట్లు వస్తే.. సరిపోతుందని భావించినా.. ఏకంగా 23 ఓట్లు దక్కించుకోవడం.. వంటివి.. టీడీపీ శిబిరంలో భారీ ఎత్తున జోష్ నింపిందనే చెప్పాలి. ఇదంతా.. చంద్రబాబు విజన్కు దర్పణంగా నిలిచిందని అంటున్నారు.
వాస్తవానికి ఏమాత్రం అంచనాలు లేకుండానే టీడీపీ రంగంలోకి దిగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ల నోటిఫికేషన్ మార్చి 2న వచ్చింది. అయితే.. 13వ తేదీ వరకు నామినే షన్లకు అవకాశం ఉంది. అప్పటికే వైసీపీ అధినేత సీఎం జగన్ తరఫున సలహాదారు సజ్జలరామకృష్ణారెడ్డి అభ్యర్థులను ఖరారు చేశారు. ఇక, 9వ తేదీ వరకు కూడా.. ఈ ఎన్నికపై అసలు టీడీపీ దృష్టి పెట్టనేలేదు. ఎందుకంటే అప్పటి వరకు టీడీపీకి ఉన్నది కేవలం 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే.
టెక్నికల్గా 23 మంది ఉన్నా.. మిగిలిన నలుగురు కూడా పార్టీకి దూరంగా ఉన్నా.. వైసీపీకి అనుబంధంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే.. చంద్రబాబు అసలు దీనిపై దృష్టి పెట్టలేదు. ఇలాంటి సమయంలో కేవలం ఒకే ఒక్క రోజు ముందు.. ఆయన ఆలోచనలకు అనుగుణంగా..ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ఎందుకు పెట్టకూడదని భావించారు. ఈ క్రమంలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన పంచుమర్తి అనురాధను ఆయన రంగంలోకి దింపారు.
కేవలం ఒక్కరోజు ముందు మాత్రమే నామినేషన్ వేశారు. అదేసమయంలో వైసీపీ వ్యూహాల ముందు కూడా టీడీపీ నిలుస్తుందా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. మరోసారి బీసీలకు అన్యాయం చేస్తున్నార ని కూడా కొంత వాదన అయితే వినిపించింది. కానీ, ఈ వాదనలు.. చంద్రబాబు విజన్ ముందు నిలవలేక పోయాయి. వైసీపీలో అసంతృప్తులను ఆయన గుర్తించారు. వారితో టచ్లోకి వెళ్లారు. ఘన విజయం దక్కించుకున్నారు. మరోసారి బాబు విజన్కు తిరుగులేదని అంటున్నారు.
This post was last modified on March 23, 2023 8:31 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…