Rahul Gandhi
కాంగ్రెస్ ముఖ్య నేత, పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీకి గుజరాత్లోని సూరత్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మోదీ ఇంటి పేరుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి పరువు నష్టం కేసులో ఈ రోజు విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చి, రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్లు 499, 500 ప్రకారం రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తున్నట్టు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్. హెచ్ వర్మ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనకు రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తున్నట్టు తీర్పు వెలువరించారు.
అయితే.. ఈ తీర్పుపై రాహుల్ గాంధీ హైకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా శిక్షను 30 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తీర్పు వెలువరించిన సమయంలో రాహుల్ గాంధీ స్వయంగా కోర్టులోనే ఉన్నారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది బాబు మంగూకియా వాదనలు వినిపించారు. ఇదిలావుంటే.. తీర్పు వెలువడిన కొద్ది సేపటికే రాహుల్ తరఫు న్యాయవాది అదే కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.
ఏం జరిగింది?
కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కర్ణాటకలోని కోలార్లో కాంగ్రెస్ పక్షాన ఎన్నికల ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై అప్పుడే తీవ్ర దుమారం చెలరేగింది. తమ కమ్యూనిటీని అవమానించేలా రాహుల్ మాట్లాడారని గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ రాహుల్పై కోర్టులో పరువునష్టం దావా వేశారు. తాజాగా ఈ కేసులో సూరత్ కోర్టు తీర్పు వెలువరించింది.
కేంద్రం రియాక్షన్ ఇదీ..
ఇక, ఈ విషయంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు కాంగ్రెస్ పార్టీకి బాగుంటాయేమో కానీ… దేశానికి ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కారణంగా పార్టీ పరువు పోతోందని కొందరు సభ్యులు తనకు చెప్పినట్టు మంత్రి తెలిపారు.
This post was last modified on March 23, 2023 1:42 pm
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బయటకు వస్తే జనసందోహం కనిపిస్తోందని.. రాష్ట్రంలో తమకు ఇప్పటికీ బలమైన ప్రజాదరణ ఉందని వైసీపీ…
అక్కినేని నాగార్జున కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక మైలురాయిగా రూపొందుతున్న వందో సినిమాకు ముందు నుంచి ప్రచారం జరిగినట్టే కింగ్…
టాక్సిక్ హీరోయిన్ల విషయంలో కామెంట్స్ రానిది ఎవరికయ్యా అంటే ఒక్క నయనతారకి మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే కథలో ఆవిడ…
ఒక ఛార్ట్ బస్టర్ సాంగ్ ఇచ్చే కిక్ ఏ స్థాయిలో ఉంటుందంటే ఒక్కోసారి ఊహించిన ఓపెనింగ్ కన్నా దాని వల్లే…
బంగారంతో పోటీ పడుతున్నట్టుగా భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఇది ఎక్కడో కాదు. తెలంగాణలోనే !. రాష్ట్ర పారిశ్రామిక,…
హైదరాబాద్ పాత బస్తీలో ఇప్పుడు ఎక్కడ చూసినా మజ్లిస్ పార్టీ ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ సస్పెండ్ గురించే చర్చ జరుగుతుంది.…