Political News

రాహుల్‌కు రెండేళ్ల జైలు..

కాంగ్రెస్ ముఖ్య‌ నేత, పార్ల‌మెంటు స‌భ్యులు రాహుల్‌ గాంధీకి గుజ‌రాత్‌లోని సూరత్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మోదీ ఇంటి పేరుపై చేసిన‌ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి పరువు నష్టం కేసులో ఈ రోజు విచార‌ణ జ‌రిపిన న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చి, రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఐపీసీ సెక్ష‌న్లు 499, 500 ప్ర‌కారం రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తున్న‌ట్టు చీఫ్ జ్యుడీషియ‌ల్ మేజిస్ట్రేట్ హెచ్‌. హెచ్ వ‌ర్మ చెప్పారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు రెండేళ్ల జైలు శిక్ష‌ను ఖ‌రారు చేస్తున్న‌ట్టు తీర్పు వెలువ‌రించారు.

అయితే.. ఈ తీర్పుపై రాహుల్ గాంధీ హైకోర్టును ఆశ్ర‌యించేందుకు వీలుగా శిక్ష‌ను 30 రోజుల పాటు స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. తీర్పు వెలువ‌రించిన స‌మ‌యంలో రాహుల్ గాంధీ స్వ‌యంగా కోర్టులోనే ఉన్నారు. ఆయ‌న త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది బాబు మంగూకియా వాద‌న‌లు వినిపించారు. ఇదిలావుంటే.. తీర్పు వెలువ‌డిన కొద్ది సేప‌టికే రాహుల్ త‌ర‌ఫు న్యాయ‌వాది అదే కోర్టులో బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా.. న్యాయ‌మూర్తి బెయిల్ మంజూరు చేశారు.

ఏం జ‌రిగింది?
కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల స‌మ‌యంలో కర్ణాటకలోని కోలార్‌లో కాంగ్రెస్ ప‌క్షాన‌ ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న మోదీ ఇంటిపేరుపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆ వ్యాఖ్యలపై అప్పుడే తీవ్ర దుమారం చెలరేగింది. తమ కమ్యూనిటీని అవమానించేలా రాహుల్ మాట్లాడారని గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్‌ మోదీ రాహుల్‌పై కోర్టులో పరువునష్టం దావా వేశారు. తాజాగా ఈ కేసులో సూర‌త్ కోర్టు తీర్పు వెలువ‌రించింది.

కేంద్రం రియాక్ష‌న్ ఇదీ..
ఇక‌, ఈ విష‌యంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘ‌ట‌న‌లు కాంగ్రెస్ పార్టీకి బాగుంటాయేమో కానీ… దేశానికి ఏమాత్రం స‌రికాద‌ని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కార‌ణంగా పార్టీ ప‌రువు పోతోంద‌ని కొంద‌రు స‌భ్యులు త‌న‌కు చెప్పిన‌ట్టు మంత్రి తెలిపారు.

This post was last modified on March 23, 2023 1:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

1 hour ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

1 hour ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

4 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago