Political News

రాహుల్‌కు రెండేళ్ల జైలు..

కాంగ్రెస్ ముఖ్య‌ నేత, పార్ల‌మెంటు స‌భ్యులు రాహుల్‌ గాంధీకి గుజ‌రాత్‌లోని సూరత్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మోదీ ఇంటి పేరుపై చేసిన‌ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి పరువు నష్టం కేసులో ఈ రోజు విచార‌ణ జ‌రిపిన న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చి, రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఐపీసీ సెక్ష‌న్లు 499, 500 ప్ర‌కారం రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తున్న‌ట్టు చీఫ్ జ్యుడీషియ‌ల్ మేజిస్ట్రేట్ హెచ్‌. హెచ్ వ‌ర్మ చెప్పారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు రెండేళ్ల జైలు శిక్ష‌ను ఖ‌రారు చేస్తున్న‌ట్టు తీర్పు వెలువ‌రించారు.

అయితే.. ఈ తీర్పుపై రాహుల్ గాంధీ హైకోర్టును ఆశ్ర‌యించేందుకు వీలుగా శిక్ష‌ను 30 రోజుల పాటు స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. తీర్పు వెలువ‌రించిన స‌మ‌యంలో రాహుల్ గాంధీ స్వ‌యంగా కోర్టులోనే ఉన్నారు. ఆయ‌న త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది బాబు మంగూకియా వాద‌న‌లు వినిపించారు. ఇదిలావుంటే.. తీర్పు వెలువ‌డిన కొద్ది సేప‌టికే రాహుల్ త‌ర‌ఫు న్యాయ‌వాది అదే కోర్టులో బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా.. న్యాయ‌మూర్తి బెయిల్ మంజూరు చేశారు.

ఏం జ‌రిగింది?
కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల స‌మ‌యంలో కర్ణాటకలోని కోలార్‌లో కాంగ్రెస్ ప‌క్షాన‌ ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న మోదీ ఇంటిపేరుపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆ వ్యాఖ్యలపై అప్పుడే తీవ్ర దుమారం చెలరేగింది. తమ కమ్యూనిటీని అవమానించేలా రాహుల్ మాట్లాడారని గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్‌ మోదీ రాహుల్‌పై కోర్టులో పరువునష్టం దావా వేశారు. తాజాగా ఈ కేసులో సూర‌త్ కోర్టు తీర్పు వెలువ‌రించింది.

కేంద్రం రియాక్ష‌న్ ఇదీ..
ఇక‌, ఈ విష‌యంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘ‌ట‌న‌లు కాంగ్రెస్ పార్టీకి బాగుంటాయేమో కానీ… దేశానికి ఏమాత్రం స‌రికాద‌ని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కార‌ణంగా పార్టీ ప‌రువు పోతోంద‌ని కొంద‌రు స‌భ్యులు త‌న‌కు చెప్పిన‌ట్టు మంత్రి తెలిపారు.

This post was last modified on March 23, 2023 1:42 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

7 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

8 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

9 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

10 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

10 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

11 hours ago