Political News

జ‌గ‌న్ దొంగ‌.. దొంగ హామీలు ఇచ్చాడు: చింత‌మ‌నేని ఫైర్‌

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ ఫైర్ బ్రాండ్‌, ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఓ రేంజ్‌లో ఫైర‌య్యారు. “జ‌గ‌న్ దొంగ‌” అంటూ ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. సాధార‌ణంగా వైసీపీపై విరుచుకుప‌డే టీడీపీ నేత‌ల్లో చింత‌మ‌నేని ఒక‌రు. అయితే.. ఎప్పుడూ కూడా ఆయ‌న ఈ రేంజ్‌లో విరుచుకుప‌డిన, విమ‌ర్శ‌లు చేసిన సంద‌ర్భాలు లేవు. అయితే.. తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ పుంజుకున్న నేప‌థ్యంలో కార్య‌క‌ర్త‌ల్లో హుషారు నింపేందుకు ఆయ‌న ఇలా వ్యాఖ్యానించార‌నే చ‌ర్చ సాగుతోంది.

ఇంత‌కీ చింత‌మ‌నేని ఏమ‌న్నారంటే.. “జగన్ దొంగ. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల‌కు ముద్దులు పెట్టి.. వారికి దొంగ‌ హామీలు ఇచ్చారు. క‌న్నీళ్లు తుడుస్తాన‌ని చెప్పి.. ఇప్పుడు క‌న్నీళ్లు పెట్టిస్తున్నాడు. ఇదే క‌న్నీళ్లు వైసీపీకి పెట్టించేందుకు ప్ర‌జ‌లు కూడా రెడీగా ఉన్నారు. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా.. ప్ర‌జ‌లు వైసీపీకి బుద్ధి చెప్పేందుకు , చంద్ర‌బాబును సీఎంను చేసేందుకురెడీగా ఉన్నారు” అని చింత‌మ‌నేని వ్యాఖ్యానించారు.

వైసీపీకి మ‌దం పెరిగిపోయిందునే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్తుగా పట్టభద్రులు ఓడించారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ఒక్క రూపాయితో ఐదు లక్షల విలువైన ఇల్లు కట్టిస్తానని చెప్పి జగన్ పేదలను మోసం చేశారన్నారు. టిడ్కో ఇళ్లు పూర్తయినా నాలుగేళ్లు నుంచి లబ్ధిదారులకు ఇవ్వకుండా సైకోలా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలపై దాడి చేస్తే సైకోలా జగన్ నవ్వుతున్నారన్నారు.

‘సైకో పోవాలి సైకిల్ రావాలి’ అని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చింత‌మ‌నేని వ్యాఖ్యానించారు. దీనికి నిదర్శనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించ‌డ‌మేన‌ని చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. కాగా, చింత‌మ‌నేని వ్యాఖ్య‌లపై టీడీపీ నేత‌లు ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు.

This post was last modified on March 23, 2023 7:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

1 hour ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

1 hour ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

4 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago