Political News

వైసీపీ కుప్ప‌కూలుతుంది.. టీడీపీ ఉగాది పంచాంగం!

ఎవ‌రి పంచాంగం వారిదే. ఎవ‌రి భ‌విష్య‌త్తు వారిదే. శోభ‌కృత్ నామ నూత‌న ఉగాది సంవ‌త్స‌రం రోజు అన్ని పార్టీలూ ఉగాది పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో టీడీపీ నిర్వ‌హించిన ఉగాది వేడుక‌లు హైలెట్‌గా నిలిచాయి. పంచాంగ క‌ర్త మాట్లాడుతూ.. ఈ ఏడాది సైకిల్‌ దూసుకెళ్తుందన్నారు. ప్రజల్లో నారా లోకేష్‌కు మంచి గుర్తింపు వస్తుందని, చంద్ర‌బాబు.. చంద్రుడు.. ఇంద్రుడై.. చక్రం తిప్పుతారని వెల్ల‌డించారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షానికి ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని, ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయని పంచాంగ ప‌ఠ‌నంలో వెల్లడించారు. మ‌రో కీల‌క విష‌యం ఏంటంటే.. వైసీపీ ప‌టాపంచ‌లు అయి.. త‌నంత‌ట త‌నే కుప్ప‌కూలుతుంద‌ని ప‌ఠ‌న క‌ర్త వెల్ల‌డించారు. మొత్తానికి ఉగాది టీడీపీలో జోష్ నింపింది.

ప్ర‌జాస్వామ్యం కోసమే నా ఆరాటం: చంద్ర‌బాబు

ఉగాది పంచాంగం ప‌ఠ‌నం అనంత‌రం.. టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ అరాచకాలను ప్రజలు తిప్పికొట్టారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. పదవుల్లో శాశ్వతంగా ఉండటానికి ఇది రాచరికం కాదని ప‌రోక్షంగా వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజాస్వామ్యం కోసం పోరాడతామని, ప్రజా సంక్షేమమే టీడీపీ ధ్యేయమని బాబు స్పష్టం చేశారు.

గ‌త నాలుగేళ్లుగా రాష్ట్రంలో కష్టాలే ఉన్నాయని, శోభకృత్ సంవత్సరంలో శుభాలే జరుగుతాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలకు వెలుగు రావడం ఖాయమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు తిరుగుబాటు చేసి.. టీడీపీకి ఓట్లేశారన్నారు. అరాచకానికి కూడా ఓ పద్దతి.. ఓ విధానం ఉంటుందని.. కానీ గత 40 ఏళ్లల్లో ఎప్పుడూ చూడని అరాచకాలు చూశానని.. ప్రశ్నించిన పేదలపై దాడులు జరిగాయని అన్నారు. అధికార పార్టీ ఆశలు ఇక సాగవని పంచాంగంలో కూడా చెప్పారన్నారు.

ధరలు పెరిగాయి.. పన్నులు పెరిగాయి.. ప్రజలపై భారం పడిందని చంద్రబాబు అన్నారు. ధరలు పెరుగుదలపై రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. “పంచాంగం ఓ డెరెక్షన్ ఇస్తుంది.. సూచన ప్రాయంగా సంకేతాలిస్తుంది.. పంచాంగం ఎంతో శాస్త్రోక్తంగా రాస్తున్నారని.. అస్ట్రాలజీ కూడా సైన్సేనని.. ప్రజలు జాగ్రత్త పడడానికి పంచాంగం ఎంతో ఉపయోగపడుతుంది” అని చంద్ర‌బాబు చెప్పారు. తెలుగు జాతి అనేక రంగాల్లో రాణిస్తోందని, నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు వారి ప్రతిష్ట పెరిగిందన్నారు. ఉగాదికి.. టీడీపీకి దగ్గర సంబంధం ఉందని.. తెలుగు వారి కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించార‌ని చంద్రబాబు స్పష్టం చేశారు.

This post was last modified on March 23, 2023 6:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

39 minutes ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

2 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

3 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

3 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

8 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

8 hours ago