Political News

ఒక్క ఛాన్స్ ప్లీజ్‌.. ఇప్ప‌టికీ దారివ్వ‌ని చంద్ర‌బాబు..!

ఒక్క ఛాన్స్ ప్లీజ్‌.. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్‌. నేనేంటో నిరూపించుకుంటా! అని దాదాపు ఆరు సంవ‌త్స‌రాలుగా ఒక యువ నాయ‌కురాలు చంద్ర‌బాబుకు మొర పెట్టుకుంటున్న విష‌యం తెలుసా? అవును సార్‌.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి త‌న‌ను తాను నిరూపించుకుంటుంది. పార్టీనే న‌మ్ముకున్నాం. ఈసారి గెలుపు ఖాయం స్వ‌యంగా ఆ యువ నాయ‌కురాలు మాతృ మూర్తి సైతం చంద్ర‌బాబుకు విన్న‌వించి.. దాదాపు రెండేళ్లు గ‌డిచిపోయింది. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు వీరిని ప‌ట్టించుకోలేదు. స‌ర్వేలు… స‌మాచారం.. పేరుతో ఇంకా నానుస్తూనే ఉన్నారు.

ఆమే.. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ స్పీక‌ర్ కావ‌లి ప్ర‌తిభా భార‌తి కుమార్తె కావ‌లి గ్రీష్మ‌. ఎప్ప‌టి నుంచో ఈ కుటుంబం రాజాం టికెట్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు కరుణించ‌లేదు. క‌నీసం.. ఇస్తామ‌ని కానీ.. ఇచ్చేది లేద‌ని కానీ… వారికి క్లారిటీ ఇవ్వ‌లేదు. మ‌రోవైపు.. ఎన్నిక‌ల‌కు ఏడాది మాత్ర‌మే స‌మ‌యం ఉంది.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు గ్రీష్మ వైపు.. వైసీపీ నేత‌లు మొగ్గు చూపుతున్నార‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఇది నిజం కూడా! ఈ విష‌యం చంద్ర‌బాబు వ‌ర‌కు వెళ్లింద‌ని కూడా ఉండ‌వ‌ల్లి వ‌ర్గాలు అంటున్నాయి.
అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు పెద్ద‌గా స్పందించ‌లేదు. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన రాజాం నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2009లో గెలుపు గుర్రం ఎక్కిన అప్ప‌టి కాంగ్రెస్ నేత కోండ్రు మ‌ర‌ళీ మోహ‌న్ విజ‌యం ద‌క్కించుకున్నారు.

2014 ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్న‌ప్ప‌టికీ.. 2019 ఎన్నిక‌ల నాటికి ఆయ‌న పార్టీలోకి వ‌చ్చారు. ఈయ‌న‌కు మాజీ మంత్రి క‌ళా వెంక‌ట్రావు మ‌ద్ద‌తు ఉంద‌నే ప్ర‌చారం ఉంది. దీంతో కావ‌లి కుటుంబాన్ని ప‌క్క‌న పెట్టి కోండ్రుకు గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఛాన్స్ ఇచ్చారు. అయితే.. ఆయ‌న ఓడిపోయారు. పోనీ.. పార్టీలో అయినా యాక్టివ్‌గా ఉన్నారా? అంటే.. అది కూడా లేదు. కోండ్రుతో పోల్చుకుంటే.. గ్రీష్మ దూకుడుగా ఉన్నారు. మ‌హానాడులోనూ తొడ‌గొట్టి మ‌రీ వైసీపీ నేత‌ల‌కు స‌వాళ్లు రువ్వారు. అలాంటి నాయ‌కురాలి విష‌యంలో చంద్ర‌బాబు ఎందుకో ఆలోచ‌న‌లో ప‌డ్డారు.

ఇదిలావుంటే, వైసీపీ వ్యూహాత్మ‌కంగా కావ‌లి కుటుంబానికి ఎర వేస్తున్న‌ట్టు స‌మాచారం. గ్రీష్మ‌కు నామినేటెడ్ ప‌ద‌విని, ప్ర‌తిభా భార‌తికి ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చేందుకు వైసీపీ మొగ్గు చూపుతున్న‌ట్టు స‌మాచారం. ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులుకు వ్య‌తిరేకత పెరిగిన నేప‌థ్యంలో వీరిని పార్టీలోకి ఆహ్వానించి స‌ద‌రు వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు టీడీపీలో చ‌ర్చ సాగుతోంది. అయినా.. చంద్ర‌బాబు మాత్రం మౌనంగా ఉన్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on April 3, 2023 7:07 am

Share

Recent Posts

చిరంజీవి గారూ… వీళ్ల‌ను ఆపాలి మీరు

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ద‌శాబ్దాల పాటు నంబ‌ర్ వ‌న్ హీరోగా నిల‌వ‌డం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…

16 minutes ago

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

1 hour ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

2 hours ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

2 hours ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

5 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

6 hours ago