Political News

ఒక్క ఛాన్స్ ప్లీజ్‌.. ఇప్ప‌టికీ దారివ్వ‌ని చంద్ర‌బాబు..!

ఒక్క ఛాన్స్ ప్లీజ్‌.. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్‌. నేనేంటో నిరూపించుకుంటా! అని దాదాపు ఆరు సంవ‌త్స‌రాలుగా ఒక యువ నాయ‌కురాలు చంద్ర‌బాబుకు మొర పెట్టుకుంటున్న విష‌యం తెలుసా? అవును సార్‌.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి త‌న‌ను తాను నిరూపించుకుంటుంది. పార్టీనే న‌మ్ముకున్నాం. ఈసారి గెలుపు ఖాయం స్వ‌యంగా ఆ యువ నాయ‌కురాలు మాతృ మూర్తి సైతం చంద్ర‌బాబుకు విన్న‌వించి.. దాదాపు రెండేళ్లు గ‌డిచిపోయింది. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు వీరిని ప‌ట్టించుకోలేదు. స‌ర్వేలు… స‌మాచారం.. పేరుతో ఇంకా నానుస్తూనే ఉన్నారు.

ఆమే.. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ స్పీక‌ర్ కావ‌లి ప్ర‌తిభా భార‌తి కుమార్తె కావ‌లి గ్రీష్మ‌. ఎప్ప‌టి నుంచో ఈ కుటుంబం రాజాం టికెట్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు కరుణించ‌లేదు. క‌నీసం.. ఇస్తామ‌ని కానీ.. ఇచ్చేది లేద‌ని కానీ… వారికి క్లారిటీ ఇవ్వ‌లేదు. మ‌రోవైపు.. ఎన్నిక‌ల‌కు ఏడాది మాత్ర‌మే స‌మ‌యం ఉంది.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు గ్రీష్మ వైపు.. వైసీపీ నేత‌లు మొగ్గు చూపుతున్నార‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఇది నిజం కూడా! ఈ విష‌యం చంద్ర‌బాబు వ‌ర‌కు వెళ్లింద‌ని కూడా ఉండ‌వ‌ల్లి వ‌ర్గాలు అంటున్నాయి.
అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు పెద్ద‌గా స్పందించ‌లేదు. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన రాజాం నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2009లో గెలుపు గుర్రం ఎక్కిన అప్ప‌టి కాంగ్రెస్ నేత కోండ్రు మ‌ర‌ళీ మోహ‌న్ విజ‌యం ద‌క్కించుకున్నారు.

2014 ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్న‌ప్ప‌టికీ.. 2019 ఎన్నిక‌ల నాటికి ఆయ‌న పార్టీలోకి వ‌చ్చారు. ఈయ‌న‌కు మాజీ మంత్రి క‌ళా వెంక‌ట్రావు మ‌ద్ద‌తు ఉంద‌నే ప్ర‌చారం ఉంది. దీంతో కావ‌లి కుటుంబాన్ని ప‌క్క‌న పెట్టి కోండ్రుకు గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఛాన్స్ ఇచ్చారు. అయితే.. ఆయ‌న ఓడిపోయారు. పోనీ.. పార్టీలో అయినా యాక్టివ్‌గా ఉన్నారా? అంటే.. అది కూడా లేదు. కోండ్రుతో పోల్చుకుంటే.. గ్రీష్మ దూకుడుగా ఉన్నారు. మ‌హానాడులోనూ తొడ‌గొట్టి మ‌రీ వైసీపీ నేత‌ల‌కు స‌వాళ్లు రువ్వారు. అలాంటి నాయ‌కురాలి విష‌యంలో చంద్ర‌బాబు ఎందుకో ఆలోచ‌న‌లో ప‌డ్డారు.

ఇదిలావుంటే, వైసీపీ వ్యూహాత్మ‌కంగా కావ‌లి కుటుంబానికి ఎర వేస్తున్న‌ట్టు స‌మాచారం. గ్రీష్మ‌కు నామినేటెడ్ ప‌ద‌విని, ప్ర‌తిభా భార‌తికి ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చేందుకు వైసీపీ మొగ్గు చూపుతున్న‌ట్టు స‌మాచారం. ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులుకు వ్య‌తిరేకత పెరిగిన నేప‌థ్యంలో వీరిని పార్టీలోకి ఆహ్వానించి స‌ద‌రు వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు టీడీపీలో చ‌ర్చ సాగుతోంది. అయినా.. చంద్ర‌బాబు మాత్రం మౌనంగా ఉన్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on April 3, 2023 7:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

భవిష్యత్తుని శాసించబోతున్న డాల్బీ సినిమా

వెండితెరపై సినిమా చూసే అనుభూతి మారుతోంది. ఒకప్పుడు తెల్లని తెరలు కట్టి ప్రింట్లు ఎంత మసకగా ఉన్నా, లైన్లు కనిపించి…

1 hour ago

భార్య కోసం 78 ఏళ్ల వయసులో ఫుడ్ డెలివరీ… 4 కోట్ల విరాళం

​కష్టం ఎదురైనప్పుడు వయసుతో సంబంధం లేకుండా పోరాడే మనస్తత్వం కొందరికే ఉంటుంది. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రానికి చెందిన 78 ఏళ్ల…

2 hours ago

కమల్ కు చిన్మయి చురకలు

మహిళల మీద వివిధ రంగాల్లో జరుగుతున్న లైంగిక వేధింపులు, అఘాయిత్యాల మీద కొన్నేళ్ల ముందు మొదలైన ‘మీ టూ’ ఉద్యమాన్ని…

4 hours ago

ఉస్తాద్ రీమేక్ గోల ఆపుతారా?

రెండేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక..  వరుసగా రీమేక్ సినిమాలే చేస్తూ వచ్చాడు పవర్ స్టార్ పవన్…

6 hours ago

కారు ఎక్కనున్న కీలక కాంగ్రెస్ నేత?

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయకుడు, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరే స‌మ‌యం ఆస‌న్న‌మైందా?  ఇప్ప‌టికే ఆయ‌న…

7 hours ago

నారా వారి ఇంటో ఫంక్షన్ ఇంతా సింపుల్‌గానా..

ఏపీ సీఎం నారా చంద్రబాబు ఇంట్లో సంబరాలు జరిగాయి. శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగిన ఈ సంబరాలకు నందమూరి…

9 hours ago