Political News

ఒక్క ఛాన్స్ ప్లీజ్‌.. ఇప్ప‌టికీ దారివ్వ‌ని చంద్ర‌బాబు..!

ఒక్క ఛాన్స్ ప్లీజ్‌.. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్‌. నేనేంటో నిరూపించుకుంటా! అని దాదాపు ఆరు సంవ‌త్స‌రాలుగా ఒక యువ నాయ‌కురాలు చంద్ర‌బాబుకు మొర పెట్టుకుంటున్న విష‌యం తెలుసా? అవును సార్‌.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి త‌న‌ను తాను నిరూపించుకుంటుంది. పార్టీనే న‌మ్ముకున్నాం. ఈసారి గెలుపు ఖాయం స్వ‌యంగా ఆ యువ నాయ‌కురాలు మాతృ మూర్తి సైతం చంద్ర‌బాబుకు విన్న‌వించి.. దాదాపు రెండేళ్లు గ‌డిచిపోయింది. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు వీరిని ప‌ట్టించుకోలేదు. స‌ర్వేలు… స‌మాచారం.. పేరుతో ఇంకా నానుస్తూనే ఉన్నారు.

ఆమే.. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ స్పీక‌ర్ కావ‌లి ప్ర‌తిభా భార‌తి కుమార్తె కావ‌లి గ్రీష్మ‌. ఎప్ప‌టి నుంచో ఈ కుటుంబం రాజాం టికెట్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు కరుణించ‌లేదు. క‌నీసం.. ఇస్తామ‌ని కానీ.. ఇచ్చేది లేద‌ని కానీ… వారికి క్లారిటీ ఇవ్వ‌లేదు. మ‌రోవైపు.. ఎన్నిక‌ల‌కు ఏడాది మాత్ర‌మే స‌మ‌యం ఉంది.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు గ్రీష్మ వైపు.. వైసీపీ నేత‌లు మొగ్గు చూపుతున్నార‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఇది నిజం కూడా! ఈ విష‌యం చంద్ర‌బాబు వ‌ర‌కు వెళ్లింద‌ని కూడా ఉండ‌వ‌ల్లి వ‌ర్గాలు అంటున్నాయి.
అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు పెద్ద‌గా స్పందించ‌లేదు. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన రాజాం నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2009లో గెలుపు గుర్రం ఎక్కిన అప్ప‌టి కాంగ్రెస్ నేత కోండ్రు మ‌ర‌ళీ మోహ‌న్ విజ‌యం ద‌క్కించుకున్నారు.

2014 ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్న‌ప్ప‌టికీ.. 2019 ఎన్నిక‌ల నాటికి ఆయ‌న పార్టీలోకి వ‌చ్చారు. ఈయ‌న‌కు మాజీ మంత్రి క‌ళా వెంక‌ట్రావు మ‌ద్ద‌తు ఉంద‌నే ప్ర‌చారం ఉంది. దీంతో కావ‌లి కుటుంబాన్ని ప‌క్క‌న పెట్టి కోండ్రుకు గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఛాన్స్ ఇచ్చారు. అయితే.. ఆయ‌న ఓడిపోయారు. పోనీ.. పార్టీలో అయినా యాక్టివ్‌గా ఉన్నారా? అంటే.. అది కూడా లేదు. కోండ్రుతో పోల్చుకుంటే.. గ్రీష్మ దూకుడుగా ఉన్నారు. మ‌హానాడులోనూ తొడ‌గొట్టి మ‌రీ వైసీపీ నేత‌ల‌కు స‌వాళ్లు రువ్వారు. అలాంటి నాయ‌కురాలి విష‌యంలో చంద్ర‌బాబు ఎందుకో ఆలోచ‌న‌లో ప‌డ్డారు.

ఇదిలావుంటే, వైసీపీ వ్యూహాత్మ‌కంగా కావ‌లి కుటుంబానికి ఎర వేస్తున్న‌ట్టు స‌మాచారం. గ్రీష్మ‌కు నామినేటెడ్ ప‌ద‌విని, ప్ర‌తిభా భార‌తికి ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చేందుకు వైసీపీ మొగ్గు చూపుతున్న‌ట్టు స‌మాచారం. ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులుకు వ్య‌తిరేకత పెరిగిన నేప‌థ్యంలో వీరిని పార్టీలోకి ఆహ్వానించి స‌ద‌రు వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు టీడీపీలో చ‌ర్చ సాగుతోంది. అయినా.. చంద్ర‌బాబు మాత్రం మౌనంగా ఉన్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on April 3, 2023 7:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కవితకు మరో షాక్ ఇవ్వనున్న బీఆర్ఎస్?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. బీఆర్ఎస్‌కు ఊహించ‌ని సంక‌టం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. క‌విత.. పాత `టీఆర్ ఎస్‌`…

5 hours ago

నాగబాబు వల్ల కానిది నీహారిక చేస్తోంది

తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…

6 hours ago

ఈ గోటీల గోలేంటి రాజశేఖర

సీనియర్ నటుడు రాజశేఖర్‌కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…

7 hours ago

ఈసారి అమరావతి లక్ష్యం… గురి తప్పకూడదు!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించే బిల్లుకు పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు ఆమోదం తెలిపిన నేప‌థ్యంలో ఇక రాష్ట్ర‌ప‌తి ఆమోద‌మే…

7 hours ago

మావిగన్ క్రెడిట్… జగన్ పై తోసేసిన సజ్జల

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…

7 hours ago

గందరగోళం ఎప్పుడు తీరుతుంది పెద్ది

ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…

8 hours ago