కరోనా వేళ.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడెవరు ఎలా వ్యవహరిస్తారో ఏ మాత్రం అర్థం కాని పరిస్థితి. తాజాగా అలాంటి ఉదంతమే గుంటూరులోచోటు చేసుకుంది. గుంటూరు పక్కనే ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన ఒకవ్యక్తిని కరోనా అనుమానాలు ఉండటంతో గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.
అతనికి పరీక్షలు జరిపిన వైద్యులు.. ఫలితాలు ఇంకా రావాల్సి ఉన్న నేపథ్యంలో.. ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గురువారం అర్థరాత్రి వేళ.. ఆసుపత్రి నుంచి పారిపోయిన వైనం కలకలకం రేపుతోంది. ఆ వ్యక్తి.. అక్కడి సిబ్బంది కళ్లుగప్పి పారిపోయినట్లుగా గుర్తించారు.
దీంతో.. గుంటూరు వాసుల గుండెల్లో దడ పుట్టేస్తున్న పరిస్థితి. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తి ఆసుపత్రి నుంచి పారిపోతే.. తమకు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇతన్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆసుపత్రి నుంచి పారిపోయిన వ్యక్తి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
తిరుమలపై మరో దుష్ప్రచారం జరగడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కారణం ఎవరు? ఎక్కడ నుంచి జరిగింది?…
ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జగన్.. దానికి తగిన విధంగా పనిచే స్తున్నారా? అనేది…
తనపై వైసీపీ నాయకులు సహా.. ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…
నటీనటుల నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టుకోవడంలో ఇండియాలో మణిరత్నంను మించిన దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదు. మొదట్నుంచి ఆయన సినిమాలను గమనిస్తే…
దురంధర్ తర్వాత బాలీవుడ్ లో స్పై సినిమాలను చూసే దృక్పథం మారిపోయింది. నమ్మశక్యం కాని ఫైట్లు, ఫిజిక్స్ ని ఛాలెంజ్…
సహజంగా భర్త ఎంత సంపాయిస్తున్నాడో.. ఏం చేస్తున్నాడో.. తెలుసుకునేందుకు భార్యలు ఆసక్తి చూపుతారు. ఈ విషయం తెలుసుకునేందుకు వారు ఉత్సాహం…