కరోనా వేళ.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడెవరు ఎలా వ్యవహరిస్తారో ఏ మాత్రం అర్థం కాని పరిస్థితి. తాజాగా అలాంటి ఉదంతమే గుంటూరులోచోటు చేసుకుంది. గుంటూరు పక్కనే ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన ఒకవ్యక్తిని కరోనా అనుమానాలు ఉండటంతో గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.
అతనికి పరీక్షలు జరిపిన వైద్యులు.. ఫలితాలు ఇంకా రావాల్సి ఉన్న నేపథ్యంలో.. ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గురువారం అర్థరాత్రి వేళ.. ఆసుపత్రి నుంచి పారిపోయిన వైనం కలకలకం రేపుతోంది. ఆ వ్యక్తి.. అక్కడి సిబ్బంది కళ్లుగప్పి పారిపోయినట్లుగా గుర్తించారు.
దీంతో.. గుంటూరు వాసుల గుండెల్లో దడ పుట్టేస్తున్న పరిస్థితి. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తి ఆసుపత్రి నుంచి పారిపోతే.. తమకు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇతన్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆసుపత్రి నుంచి పారిపోయిన వ్యక్తి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…