కరోనా వేళ.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడెవరు ఎలా వ్యవహరిస్తారో ఏ మాత్రం అర్థం కాని పరిస్థితి. తాజాగా అలాంటి ఉదంతమే గుంటూరులోచోటు చేసుకుంది. గుంటూరు పక్కనే ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన ఒకవ్యక్తిని కరోనా అనుమానాలు ఉండటంతో గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.
అతనికి పరీక్షలు జరిపిన వైద్యులు.. ఫలితాలు ఇంకా రావాల్సి ఉన్న నేపథ్యంలో.. ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గురువారం అర్థరాత్రి వేళ.. ఆసుపత్రి నుంచి పారిపోయిన వైనం కలకలకం రేపుతోంది. ఆ వ్యక్తి.. అక్కడి సిబ్బంది కళ్లుగప్పి పారిపోయినట్లుగా గుర్తించారు.
దీంతో.. గుంటూరు వాసుల గుండెల్లో దడ పుట్టేస్తున్న పరిస్థితి. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తి ఆసుపత్రి నుంచి పారిపోతే.. తమకు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇతన్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆసుపత్రి నుంచి పారిపోయిన వ్యక్తి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
అధికారంలోకి రాకముందు.. ప్రజల మధ్య ఉండే పార్టీల గురించి తెలుసు. కానీ, అధికారం వచ్చిన తర్వాత కూడా నిరంతరం ప్రజలను…
"రూపాయి విలువ పడిపోయింది" అనే వార్త చూడగానే.. "మనకేంటిలే, మనం ఇండియాలోనే ఉన్నాం కదా" అని లైట్ తీసుకుంటే పొరపాటే.…
రాయ్పూర్ వేదికగా మరోసారి విరాట్ కోహ్లీ బ్యాట్ గర్జించింది. "కోహ్లీ పని అయిపోయింది, వయసు మీద పడింది" అని విమర్శించే…
ఒకే కుటుంబం నుంచి రెండు తరాలకు చెందిన స్టార్ హీరోలతో జోడిగా నటించే ఛాన్స్ అందరికీ రాదు. అప్పుడెప్పుడో శ్రీదేవి…
విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న గూగుల్ డేటా కేంద్రం.. ఊహించని వేగంగా ముందుకు కదులుతోంది. భూ సమీకరణ విషయంలో ప్రభుత్వం…
ఐ బొమ్మ రవి…ఈ మధ్యకాలంలో ఈ పేరు చాలా పాపులర్ అయింది. పేద, మధ్య తరగతి సినీ ప్రేక్షకులు రవిని…