దిల్లీ లిక్కర్ కేసులో నిండా మునిగిపోయారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేస్తుందని రెండు రోజులుగా ప్రచారమైనా అలాంటిదేమీ జరగకపోవడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే.. కవితను అరెస్ట్ చేయకపోవచ్చని… ఆమె విచారణ కోసం దిల్లీ వచ్చిన తొలి రోజు నుంచే కేటీఆర్, హరీశ్ రావులు కేంద్రంతో సంప్రదింపులకు చేసిన ప్రయత్నాలు ఫలించాయని.. కవిత అరెస్ట్ ఉండదన్న హామీ లభించిందని వినిపిస్తోంది.
తాజాగా కాంగ్రెస్ నేతలూ అదే విషయం చెప్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటేనని.. ఈ కేసులో కవితను బీజేపీ కాపాడుతోందని మాజీ ఎంపీ మధు యాష్కీ ఆరోపించారు. దేశంలో సంచలనంగా మారిన లిక్కర్ స్కాంలో ఆప్ నేత మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేశారు కానీ కవితను అరెస్ట్ చేయలేదని.. రెండు పార్టీలూ ఒక్కటే కాబట్టి అరెస్ట్ చేయలేదని ఆయన ఆరోపించారు.
అదానీ వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో విచారణ స్పీడు పెంచిందని.. దిల్లీలో రోజూ జరుగుతున్న హైడ్రామాతో ప్రజల దృష్టి అదానీ వ్యవహారం నుంచి మళ్లిపోతోందని అన్నారు మధు యాష్కీ.
ఇప్పటి వరకు ఇసుక అక్రమ రవాణాతో వేల కోట్లు ఆర్జించిన కల్వకుంట్ల కుటంబం ఇప్పుడు మద్యం మాఫియాలో ఎంటరైందని.. కేసీఆర్, ఆయన కొడుకు, మొత్తం పార్టీకి ఇప్పుడు కవిత వ్యవహారమే ప్రధాన సమస్యగా కనిపిస్తోందని.. ప్రజల సమస్యలను మర్చిపోయారని ఆయన విమర్శించారు.
కవిత కోసం తెలంగాణ కేబినెట్ అంతా దిల్లీలోనే కూర్చుందని.. తెలంగాణలో పాలన గాలికొదిలేశారని మధు యాష్కీ అన్నారు. అంతేకాదు.. దిల్లీ లిక్కర్ పాలసీపై విచారణ జరుపుతున్నట్లుగానే తెలంగాణ లిక్కర్ పాలసీపైనా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
This post was last modified on March 22, 2023 8:38 am
వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అంశంపై…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా…
2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్…
ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…
టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పలు జాగ్రత్తలు చెప్పారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన ఆయన..…
ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ…