Political News

అమ‌రావ‌తిలో జ‌గ‌న్ స‌ర్కారు మ‌రో చిచ్చు.. ర‌గులుతున్న ఆర్-5

ఆది నుంచి ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న వైసీపీ ప్ర‌భుత్వం, సీఎం జ‌గ‌న్.. ఎప్ప‌టిక‌ప్పుడు.. ఇక్క‌డ ఏదో ఒక వివాదాన్ని సృష్టించ‌డం.. రైతుల క‌డుపు మంట‌ను రెచ్చ‌గొట్ట‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఆర్‌-5 వివాదాన్ని మ‌రోసారి స‌ర్కారు రెచ్చగొట్టింది. రాష్ట్రంలో ఎక్క‌డెక్క‌డో ఉన్న పేద‌ల‌కు.. ఇక్క‌డ భూములు కేటాయించ‌డ‌మే ఆర్‌-5 ఉద్దేశం.
అయితే.. దీనిని ఆది నుంచి కూడా రైతులు వ్య‌తిరేకిస్తున్నారు. తాము బూములు ఇచ్చింది కేవ‌లం రాజ‌ధాని కోస‌మేన‌ని తేల్చి చెబుతున్నారు. అయినా.. స‌ర్కారు వినిపించుకోవ‌డం లేదు. ఇక‌, ఇప్పుడు ఆర్5 జోన్ విషయంలో ప్రభుత్వం ముందడుగు వేసింది.

పేదల ఇళ్ల నిర్మాణం కోసమంటూ ప్రత్యేకంగా ఆర్ 5 జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ చేసింది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలం మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో 900 ఎకరాల భూములను ఆర్ 5 జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. 2022 అక్టోబర్ లో సీఆర్డీఏ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

అయితే.. జ‌గ‌న్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని రాజధాని రైతులు వ్యతిరేకించారు. కనీసం రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవటంపై అప్పట్లో కోర్టుకు వెళ్లారు. దీంతో గ్రామసభలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రాజధాని గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రాజధాని రైతులంతా మూకుమ్మడిగా వ్యతిరేకించారు. అమరావతి బృహత్ ప్రణాళికను విచ్ఛిన్నం చేసేలా ప్రభుత్వ నిర్ణయం ఉందన్నారు.

అయినా కూడా.. ఇంత‌గా రైతులు వ్య‌తిరేకించినా.. వారి అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం ఆర్ 5 జోన్ గెజిట్ విడుదల చేశారు. పేద వర్గాల ఇళ్ల కోసం భూములు కేటాయిస్తున్నట్లు వివరించింది. ఎక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపడతారో, ఎంత విస్తీర్ణంలో చేపట్టాలనేది గెజిట్లో పొందుపర్చారు. సీఆర్డీఏ విడుదల చేసిన గెజిట్ పై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఏదేమైనా.. వైసీపీ స‌ర్కారు రాజ‌ధాని విష‌యంలో అనుస‌రిస్తున్న తీరు తీవ్ర వివాదానికి.. విమ‌ర్శ‌ల‌కు తావిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 22, 2023 10:53 am

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

2 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

3 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

3 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

4 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

4 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

4 hours ago