Political News

కవిత హడావుడి.. ఫోన్లన్నీ తీసుకొచ్చి మీడియా ముందు ప్రదర్శన

కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరయ్యే ముందు తాను గతంలో వాడిన ఫోన్లను మీడియాకు చూపించారు. ఈడీ ఆరోపించినట్టు తాను ఫోన్లు ధ్వంసం చేయలేదంటూ మీడియా ముందు ఆ ఫోన్లను ప్రదర్శించారు. ఈడీ కార్యాలయంలో విచారణకు వెళ్లే ముందు కార్యాలయం బయట కారులోంచి బయటకు నిల్చున్న ఆమె రెండు పాలిథీన్ కవర్లలో తన పాత ఫోన్లన్నీ ఉంచి వాటిని చూపించారు. వీటిని తాను ధ్వంసం చేసినట్లు ఈడీ ఆరోపిస్తోంది… కానీ, అవన్నీ తనతోనే ఉన్నాయంటూ వాటిని ఈడీకి అప్పగిస్తున్నాని చెప్పారు. ఈ మేరకు ఆమె వాటిని అప్పగిస్తూ ఈడీకి లేఖ కూడా రాశారు.

లిక్కర్ కుంభకోణం లావాదేవీలు మాట్లాడిన ఫోన్లను కవిత ధ్వంసం చేశారంటూ ఈడీ గతంలో పలు రిమాండ్ రిపోర్టుల్లో ఆరోపణలు చేసింది. కవిత తప్పు చేయకపోతే ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారంటూ ప్రతిపక్షాలు కూడా ప్రశ్నించాయి. దీంతో కవిత ఇవాళ తాను ఫోన్లు ధ్వంసం చేయలేదు అనడానికి సాక్ష్యంగా ఆ ఫోన్లను మీడియాకు చూపించి వాటిని ఈడీకి విచారణ నిమిత్తం అప్పగించారు. ఈ సందర్భంగా ఈడీకి రాసిన లేఖలో కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

‘ఫోన్లు ధ్వంసం చేశాను అంటూ నాపై దారుణమైన ఆరోపణలు చేశారు. మీరు దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లను మీకు సమర్పిస్తున్నాను. ఒక మహిళ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా? అసలు నన్ను విచారించకుండానే నేను ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఈ ఆరోపణలు ఎలా చేసింది? నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే కదా.

తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు. తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం చేశారు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడి వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరం’’ అని తన లేఖలో ఆరోపించారు కవిత.

కాగా నిన్నటి విచారణ ముగింపు సమయంలో కవితకు వైద్య పరీక్షలు చేశారు. కవిత తరఫు న్యాయవాదులు కూడా అక్కడకు చేరుకున్నారు. నిన్ననే ఆమెను అరెస్ట్ చేస్తారని భావించినప్పటికీ నిన్న అరెస్ట్ చేయలేదు. ఈ రోజు మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఆమె అరెస్ట్ ఉండొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈడీ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నది తెలియాల్సి ఉంది.

This post was last modified on March 21, 2023 12:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

1 hour ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

5 hours ago