Political News

తెలంగాణా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్

తెలంగాణా ప్రభుత్వానికి సుప్రింకోర్టు పెద్ద షాకిచ్చింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పదిబిల్లుల పై సంతకాలు చేయకుండా గవర్నర్ తన వద్దే ఫైళ్ళన్నింటినీ ఉంచేసుకున్నారనే ఆరోపణతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుప్రింకోర్టులో ఒక కేసు వేశారు. పదిబిల్లులపై సంతకాలు పెట్టి వెంటనే ఆమోదం తెలిపేట్లుగా గవర్నర్ ను ఆమోదించాలని చీఫ్ సెక్రటరీ తన పిటిషన్లో సుప్రీంకోర్టును రిక్వెస్ట్ చేశారు. అయితే కేసును విచారించిన సుప్రింకోర్టు అలా ఆదేశాలు ఇవ్వటం కుదరదని స్పష్టంగా తేల్చేసింది.

గావర్నర్ కార్యాలయం అన్నది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్ధ కాబట్టి దానికి సుప్రింకోర్టు నోటీసులు, ఆదేశాలు ఇవ్వలేందని స్పష్టంగా చెప్పేసింది. కావాలంటే కేంద్రప్రభుత్వానికి నోటీసులు ఇస్తామని చెప్పింది. అయితే దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే బిల్లులు పెండింగ్ లో ఉన్నది గవర్నర్ కార్యాలయంలో అయితే నోటీసులు కేంద్రప్రభుత్వానికి ఇవ్వటం వల్ల ఎలాంటి లాభం ఉండదు. ఇస్తే గిస్తే రాష్ట్రపతి భవన్ కు ఇవ్వాలి. ఎందుకంటే గవర్నర్లను నియమించేది రాష్ట్రపతే కాబట్టి ఆదేశాలు ఇవ్వగలిగింది కూడా రాష్ట్రపతి మాత్రమే.

అయితే రాజభవన్కే నోటీసులు ఇవ్వలేని సుప్రింకోర్టు రాష్ట్రపతి భవన్ కు ఎలాగిస్తుంది ? కాబట్టి ఈ వివాదానికి ఎప్పుడు ముగింపు కార్డు పడుతుందో ఎవరికీ అర్ధంకావటంలేదు. అయితే కేసు విచారణలో అసలు బిల్లులు రాజ్ భవన్లో ఎందుకు పెండింగ్ లో ఉన్నాయని మాత్రం సుప్రింకోర్టు వాకాబు చేసింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే గవర్నర్-కేసీయార్ మధ్య మొదలైన వివాదంతోనే ప్రోటోకాల్ సమస్యలు పెరిగిపోయాయి.

ఆ ప్రోటోకాల్ సమస్యలే చివరకు ఇద్దరి మధ్య ఇగో ప్రాబ్లెంగా మారి పరిస్ధితి ఇంతవరకు దిగజారిపోయింది. ఒకసారి తన ఇగోను కేసీయార్ పక్కనపెట్టి రాజ్ భవన్ కు వెళ్ళి గవర్నర్ తో భేటీ అయితే కానీ ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. అలాగే గవర్నర్ విషయంలో ప్రభుత్వం కచ్చితంగా ప్రోటోకాల్ పాటించాల్సిందే అని కేసీయార్ గుర్తుంచుకోవాలి. లేకపోతే ఈ సమస్యలు భవిష్యత్తులో మరింతగా ముదిరిపోవటం ఖాయమనే అనిపిస్తోంది. సమస్యంటు ముదిరిపోతే నష్టం కేసీయార్ కే కానీ గవర్నర్ కు కాదన్న విషయం అందరికీ తెలిసిందే.

This post was last modified on March 21, 2023 12:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

1 hour ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

5 hours ago