Political News

కవిత ఇప్పుడు నేషనల్ ఫిగర్..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత మూడో సారి విచారణకు హాజరయ్యారు. వరుసగా రెండో రోజున ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఇంటి నుంచి బయలుదేరే ముందు , ఈడీ కార్యాలయం లోపలికి వెళ్తున్నప్పుడు ఆమె ప్లాస్టిక్ కవర్లో ఉంచిన ఫోన్లను మీడియాకు చూపించారు. రెండో చేతుల్లోని రెండు కవర్లలో ఫోన్లు ఉండగా నవ్వుతూ వాటిని ఆమె మీడియాకు చూపించారు. కవిత వెంట భర్త అనిల్ కూడా ఈడీ కార్యాలయం వరకు వెళ్లారు.

పది ఫోన్లు ధ్వంసం !
నిజానికి ఈడీ, సీబీఐ రెండు సంస్థలు కవిత, సిసోడియా సహా అందిరిపైనా పలు ఆరోపణలు చేస్తూ వచ్చాయి. అందులో ఒకటి స్కాం జరిగినప్పుడు వాడిన ఫోన్లను ఆమె ధ్వంసం చేశారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. వరుస ఛార్జ్ షీట్లు, రిమాండ్ రిపోర్టల్లో కూడా అదే అంశాన్ని ప్రస్తావించాయి. కవిత ఒక్కరే పది ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ మనీష్ సిసోడియా రిమాండ్ ఎక్స్ టెన్షన్ రిపోర్టులో పొందుపరిచింది.

ఈ ఫోన్లేమింటి..

ఈడీ చెప్పిందే నిజమైతే మంగళవారం ఈడీ ఆఫీసుకు బయలుదేరుతూ కవిత ప్రదర్శించిన సెల్ ఫోన్లు ఎక్కడివి, అవి ఎవరివి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫోన్లు ధ్వంసం చేశారా లేదా.. కవిత ప్రస్తుతం చూపిస్తున్న ఫోన్లు, ఈడీ రిమాండ్ రిపోర్టులో ఉన్న ఫోన్లు ఒకటేనా అన్న ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు. నిజంగా ఫోన్లు ధ్వంసం చేయకపోతే ఈడీ ఎందుకులా ఆరోపిస్తోంది అనేది పెద్ద ప్రశ్న. వీటికి కవిత లేదా ఈడీ మాత్రమే సమాధానం చెప్పగలరు..

నేషనల్ ఫిగర్..

కవితకు ఉన్న అతి పెద్ద క్వాలిఫికేషన్ కేసీఆర్ కూతురు కావడమే. ఆమె ఎమ్మెల్సీ మాత్రమే. తెలంగాణ జాగృతి అయినా భారత జాగృతి అయినా పెద్దగా పబ్లిసిటీ లేని సంస్థ. దాని గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు మాత్రం కవిత జాతీయ స్థాయిలో ఫేమస్ అయ్యారు. తెలుగే కాదు… ఇంగ్లీష్, హిందీ మీడియా కూడా కవిత వైపే చేస్తోంది. ఆమె కదలికలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తోంది. దీనితో కేసు ఎలాగున్నా కవితకు ఉచితంగా జాతీయ స్థాయి పబ్లిసిటీ వచ్చింది. జనం ఆమె గురించి చర్చించుకునే అవకాశం లభించింది. అదీ పాజిటివ్ పరిణామమే కదా..

This post was last modified on March 21, 2023 4:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

26 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

5 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago