Political News

కవిత ఇప్పుడు నేషనల్ ఫిగర్..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత మూడో సారి విచారణకు హాజరయ్యారు. వరుసగా రెండో రోజున ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఇంటి నుంచి బయలుదేరే ముందు , ఈడీ కార్యాలయం లోపలికి వెళ్తున్నప్పుడు ఆమె ప్లాస్టిక్ కవర్లో ఉంచిన ఫోన్లను మీడియాకు చూపించారు. రెండో చేతుల్లోని రెండు కవర్లలో ఫోన్లు ఉండగా నవ్వుతూ వాటిని ఆమె మీడియాకు చూపించారు. కవిత వెంట భర్త అనిల్ కూడా ఈడీ కార్యాలయం వరకు వెళ్లారు.

పది ఫోన్లు ధ్వంసం !
నిజానికి ఈడీ, సీబీఐ రెండు సంస్థలు కవిత, సిసోడియా సహా అందిరిపైనా పలు ఆరోపణలు చేస్తూ వచ్చాయి. అందులో ఒకటి స్కాం జరిగినప్పుడు వాడిన ఫోన్లను ఆమె ధ్వంసం చేశారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. వరుస ఛార్జ్ షీట్లు, రిమాండ్ రిపోర్టల్లో కూడా అదే అంశాన్ని ప్రస్తావించాయి. కవిత ఒక్కరే పది ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ మనీష్ సిసోడియా రిమాండ్ ఎక్స్ టెన్షన్ రిపోర్టులో పొందుపరిచింది.

ఈ ఫోన్లేమింటి..

ఈడీ చెప్పిందే నిజమైతే మంగళవారం ఈడీ ఆఫీసుకు బయలుదేరుతూ కవిత ప్రదర్శించిన సెల్ ఫోన్లు ఎక్కడివి, అవి ఎవరివి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫోన్లు ధ్వంసం చేశారా లేదా.. కవిత ప్రస్తుతం చూపిస్తున్న ఫోన్లు, ఈడీ రిమాండ్ రిపోర్టులో ఉన్న ఫోన్లు ఒకటేనా అన్న ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు. నిజంగా ఫోన్లు ధ్వంసం చేయకపోతే ఈడీ ఎందుకులా ఆరోపిస్తోంది అనేది పెద్ద ప్రశ్న. వీటికి కవిత లేదా ఈడీ మాత్రమే సమాధానం చెప్పగలరు..

నేషనల్ ఫిగర్..

కవితకు ఉన్న అతి పెద్ద క్వాలిఫికేషన్ కేసీఆర్ కూతురు కావడమే. ఆమె ఎమ్మెల్సీ మాత్రమే. తెలంగాణ జాగృతి అయినా భారత జాగృతి అయినా పెద్దగా పబ్లిసిటీ లేని సంస్థ. దాని గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు మాత్రం కవిత జాతీయ స్థాయిలో ఫేమస్ అయ్యారు. తెలుగే కాదు… ఇంగ్లీష్, హిందీ మీడియా కూడా కవిత వైపే చేస్తోంది. ఆమె కదలికలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తోంది. దీనితో కేసు ఎలాగున్నా కవితకు ఉచితంగా జాతీయ స్థాయి పబ్లిసిటీ వచ్చింది. జనం ఆమె గురించి చర్చించుకునే అవకాశం లభించింది. అదీ పాజిటివ్ పరిణామమే కదా..

This post was last modified on March 21, 2023 4:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్వాలిటీ క్యాస్టింగ్ – పూరి జగన్నాథ్ ప్లానింగ్

మాములుగా సీనియర్ దర్శకులకు వరసగా డిజాస్టర్లు పడితే కంబ్యాక్ కావడం అంత సులభంగా ఉండదు. అసలు వాళ్ళ కథలు వినడానికే…

20 minutes ago

ఇంజెక్షన్‌ల భయానికి చెక్ పెట్టిన కొత్త టెక్నాలజీ

ఇంజెక్షన్ అని వినగానే చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్లలో కూడా భయం కనిపిస్తుంది. దీనికి వైద్య పరంగా ట్రిపనోఫోబియా అని…

1 hour ago

ఏపీలో ఎన్నిక‌.. షెడ్యూల్ విడుద‌ల‌!

ఏపీలో కీల‌క‌మైన ఓ రాజ్య‌స‌భ సీటు ఎన్నిక‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా షెడ్యూల్ ప్ర‌క‌టించింది. వైసీపీ నుంచి…

1 hour ago

ప్రేమకథతో తిరిగి వస్తున్న బుట్టబొమ్మ

డీజే దువ్వాడ జగన్నాథంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నా హీరోయిన్ గా తన స్థాయిని అమాంతం పెంచేసిన సినిమాల్లో అల వైకుంఠపురములో…

1 hour ago

వరుసగా ఏఐ మేధావుల మరణాలు.. ఏం జరుగుతోంది?

చాట్ GPT - డీప్ సీక్ - మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి…

2 hours ago

పెద్ది గురించి శివన్న….హైప్ పెంచేశాడన్నా

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ట్రెండింగ్…

3 hours ago