“ఫోటో” మీద ఏపీ ముఖ్యమంత్రికి అంత ఆసక్తి ఏమిటి? తన ఫోటోను అందరూ ఏదో విధంగా వాడాలన్న తాపత్రయం ఆయనకు అంత ఎక్కువ ఏమిటి? పార్టీ జెండా రంగు పోలి ఉండేలా బడిని.. ప్రభుత్వ కార్యాలయాలకు వేయించి.. కోర్టు చేత చీవాట్లు తిన్న ఏపీలోని వైసీపీ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి ఫోటోను ప్రముఖంగా కనిపించేందుకు ఉండే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టని వైనం తెలిసిందే.
ప్రతి ఇంటి మీద తన ఫోటోతో కూడిన స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని భారీగా చేపట్టిన ఆయన.. ఒక దశలో ఇంటింటికి సర్వే నిర్వహించే అధికారులు.. ప్రభుత్వ పథకాల లబ్థిదారుల సెల్ ఫోన్లకు ముఖ్యమంత్రి జగన్ ఫోటోను స్టిక్కర్ రూపంలో అంటించే కార్యక్రమం చేపట్టటం.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే. ఇది సరిపోదన్నట్లుగా తాజాగా అమలు చేస్తున్న మరో కొత్త విధానంపై విస్మయం వ్యక్తమవుతోంది. దేశంలో మరెక్కడా లేని రీతిలో అమలు చేస్తున్న ఈ తీరును చూసిన వారంతా నోళ్లు నొక్కుకునే పరిస్థితి.
ఇంతకూ ఈ కొత్త విధానం ఏమంటే.. ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాలకు భద్రత కల్పించే పోలీసులు అధికారులకు.. డ్యూటీ పాసులు ఇవ్వటం తెలిసిందే. ఈ డ్యూటీ పాసుల్లోనూ ముఖ్యమంత్రి జగన్ ఫోటోతో కూడిన విధంగా తయారు చేయటం.. వాటిని ప్రతి ఒక్కరూ ధరించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వటం చూస్తే.. ప్రభుత్వ ఉద్యోగులు అందునా పోలీసులు తమ స్వామిభక్తీని ప్రదర్శించుకోవాలన్నట్లుగా సీఎం ఫోటోలతో ఐడీలు సిద్ధం చేయటం ఏమిటంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా డ్యూటీ పడిన పోలీసు అధికారుల నుంచి సాధారణ పోలీసుల వరకు విధులు నిర్వహించే వారందరిక డ్యూటీ పాసులను అందజేశారు. ఈ కార్డుల్లో సీఎం జగన్ ఫోటో ఉండటంతో వారు అవాక్కు అయ్యారు. కానీ. ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో వాటిని ధరించక తప్పలేదు. ఎన్నో ఏళ్లుగా సర్వీసులో ఉన్నామని.. కానీ ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఫోటోతో ఉన్న ఐడీ కార్డుల్ని ధరించింది లేదని వాపోతున్నారు. రానున్న రోజుల్లో సీఎం జగన్ ఫోటోలతో మరెన్ని సిత్రాలు చూడాల్సి వస్తుందో అన్న మాట వినిపించటం విశేషం.
This post was last modified on March 20, 2023 1:48 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…