Political News

పార్లమెంటు భవనాన్ని కూల్చేస్తాం.. తేల్చేసిన కేంద్రం

పురాతన భవనాలు.. చారిత్రక నేపథ్యం ఉన్న కట్టడాల్ని కాలానికి అనుగుణంగా కూల్చేయటం తప్పించి మరో మార్గం లేదా? చరిత్రకు సాక్ష్యాలుగా నిలవటానికి భిన్నంగా.. వాటిని నేలమట్టం చేసేసి.. దాని స్థానే కొంగొత్తగా భవనాల్ని కట్టుకుంటూ పోవటానికి మినహా మరో మార్గం లేదా? అన్న ప్రశ్న తలెత్తేలా వ్యవహరించింది కేంద్రంలోని మోడీ సర్కారు.

ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనం చాలా పాతదైందని.. దాన్ని కూల్చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక అఫిడవిట్ ను సుప్రీంకోర్టులో దాఖలుచేసింది. పార్లమెంటు భవనం వందేళ్ల పురాతన భవనమని.. భద్రతా పరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నట్లుగా కేంద్రం చెప్పింది.

అంతేకాదు.. ఏదైనా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటే..రక్షణ చర్యలు చేపట్టటం కష్టమని చెప్పింది. అందుకే.. ఇప్పుడున్న పార్లమెంటు భవనాన్ని కూల్చేసి.. దాని స్థానే కొత్త భవనాన్ని నిర్మిస్తామని కేంద్రం వెల్లడించింది.

ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనాన్ని 1921లో నిర్మాణం ప్రారంభించి.. 1937లో ముగించారు. ఇప్పటికి దగ్గరదగ్గర వందేళ్లు గడిచిన వేళ.. ఇప్పుడు కొత్త భవనం కోసం పాత భవనాన్ని కూల్చేస్తామని తేల్చేయటం గమనార్హం.

అంతేకాదు.. గడిచిన దశాబ్దాల రాజకీయ ఘటనలు.. కీలకమైన సమావేశాలు.. చారిత్రక సన్నివేశాలకు సాక్ష్యమైన పార్లమెంటు భవనాన్ని కూల్చేస్తామని చెప్పినమోడీ సర్కారు తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది.

This post was last modified on July 29, 2020 2:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago