Political News

పంజాబ్ అష్ట‌దిగ్బంధం.. ఎందుకు? ఏమిటి?

ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఉన్న పంజాబ్ రాష్ట్రం గురించి విన‌డ‌మే త‌ప్ప‌.. అక్క‌డి రాజ‌కీయ వాతావ‌ర‌ణం గురించి పెద్ద‌గా ఎవ‌రికీ తెలియదు. ముఖ్యంగా ద‌క్షిణాది రాష్ట్రాల‌కు పంజాబ్ పేరు మాత్ర‌మే ప‌రిచ‌యం. అంత‌కుమించి మాత్రం ఆ రాష్ట్రం గురించి తెలియ‌దు. అయితే.. ఇప్పుడు ఇదే పంజాబ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌త రెండు రోజులుగా ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాలు.. అన్ని రాష్ట్రాల్లోనూ ప్ర‌ధాన వార్త‌లుగా నిలిచాయి. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అనేది ప్ర‌తి ఒక్క‌రూ చ‌ర్చించుకుంటున్నారు.

పంజాబ్‌ను గ‌త 48 గంట‌ల నుంచి పోలీసులు అష్ట‌దిగ్బంధం చేశారు. రాష్ట్ర పోలీసులు.. కేంద్ర పారామిలిట‌రీ బృందాల బూటు చ‌ప్పుళ్ల‌తో రాష్ట్రంలోని అన్ని న‌గ‌రాలు.. ప‌ట్ట‌ణాలు క‌ర్పొరేష‌న్లు.. అట్టుడుగుతున్నాయి. పాఠ‌శాల‌లు మూసేశారు.(శ‌నివారం కూడా). బ్యాంకులు మూసేశారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల ముందు వంద‌ల మంది పోలీసులు భ‌ద్ర‌త క‌ల్పించారు. దాదాపు జ‌న జీవ‌నం స్తంభించి పోయింది. అత్యంత అవ‌స‌రం ఉంటే త‌ప్ప‌.. ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని ఆప్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది. మ‌రి ఇంత సీరియ‌స్‌గా అక్క‌డ ఏం జ‌రుగుతోంది. అనేది ఆస‌క్తిగా మారింది.

ఖ‌లిస్థాన్‌.. అనే వేర్పాటు వాద సంస్థ‌కు నేతృత్వం వ‌హిస్తున్న‌ వారిలో అమృత్ పాల్ అనే యువ‌కుడు(30 ఏళ్లు) కీల‌కంగా మారాడు. ‘వారీస్ పంజాబ్ దే'(మా పంజాబ్‌ను మాకు ఇచ్చేయండి) అనే పేరుతో ఒక‌ సంస్థ‌ను ఏర్పాటు చేసి.. ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాడు. మత బోధకుడిగా చెప్పుకునే ఆ సంస్థ అధినేత అమృత్పాల్ సింగ్ ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు. దొంగతనం, కిడ్నాప్, హింసకు పాల్పడటం వంటి కేసులు అమృత్పాల్ సింగ్పై నమోదయ్యాయి.

ఆ ఏడాది ఫిబ్రవరిలో ‘వారీస్ పంజాబ్ దే’ అధినేత అమృత్పాల్ మద్దతుదారులు వీరంగం సృష్టించారు. అజ్నాలా పోలీస్ స్టేషన్ వద్ద విధ్వంసం సృష్టించి.. తమ మద్దతుదారుడిని విడుదల చేయించుకున్నారు. అమృత్పాల్ పిలుపుతో.. వేలాది మంది అనుచరులు తల్వార్లు, తుపాకులతో అజ్నాలా పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. అమృత్పాల్ సింగ్ సన్నిహితుడు లవ్ప్రీత్ తుఫాన్ అరెస్టుకు నిరసనగా వారంతా ఆందోళన చేపట్టారు.

అయితే.. ఇటీవ‌ల అమృత్‌పాల్.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. “ఇందిరా గాంధీకి ప‌ట్టిన గ‌తే.. అమిత్‌షాకు కూడా ప‌డుతుంది!” అన్నాడు. నిజానికి ఈ వ్యాఖ్యలు చేసి 15 రోజులు అయిపోయింది. అయితే.. అప్ప‌ట్లో రాష్ట్రంలో జీ-20 స‌ద‌స్సు జ‌రుగుతోంది. దీంతో విదేశీ ప్ర‌తినిధులు వ‌చ్చారు. ఈ ప‌రిణామాల‌పై ఉప్పందినా.. కేంద్రం మౌనంగా ఉంది. ఎందుకంటే ఏమాత్రం అల‌జ‌డి రేగినా.. విదేశీ ప్ర‌తినిధులు హ‌డ‌లి పోతార‌ని భావించింది. ఇక‌, ఈ స‌ద‌స్సు అయిపోగానే విశ్వ‌రూపం చూపించింది.

అమృత్పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడిని పరారీలో ఉన్న నిందితుడిగా పోలీసులు ప్రకటించారు. అమృత్‌పాల్ స్వస్థలమైన అమృత్‌సర్లోని జల్లుపుర్‌ ఖేరాలో అతడి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు.. రాష్ట్రంలో సోమవారం మధ్యాహ్నం వరకు ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదీ.. సంగ‌తి!!

This post was last modified on March 20, 2023 10:38 am

Share
Show comments
Published by
satya

Recent Posts

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

18 mins ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

4 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

4 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

4 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

5 hours ago

నేష‌న‌ల్ లెవ‌ల్‌కు రేవంత్‌.. కాంగ్రెస్‌కు హ్యాపీ

పీసీసీ అధ్య‌క్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉంద‌ని తెలిసింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల…

5 hours ago