Political News

ఏం కావాలో చెప్పండి.. ఎమ్మెల్యేల‌కు వైసీపీ ఆఫ‌ర్లు?!

ఇప్ప‌టి వ‌ర‌కు సొంత పార్టీ ఎమ్మెల్యేల‌ను స‌రిగా ప‌ట్టించుకోలేద‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ.. ఇప్పు డు వారికి భారీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తోంది. ఇటీవ‌ల త‌మ గోడు వినిపించుకోవ‌డం లేద‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో క‌నీసం త‌మ‌ను ప‌ట్టించుకో వ‌డం లేద‌ని.. ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి.. మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ వంటి వారు బాహాటంగానే ఆరోప‌ణ‌లు చేసి న విష‌యం తెలిసిందే. వీరిలో కోటంరెడ్డి ఏకంగా తిరుగుబావుటా ఎగుర వేశారు. అంటే.. ఈ నాలుగేళ్ల‌లో త‌న పార్టీ ఎమ్మెల్యేల‌నే వైసీపీ ప‌ట్టించుకోలేద‌న్న‌మాట‌.

కానీ.. ఇప్పుడు వైసీపీ అధిష్టానం త‌న ఎమ్మెల్యేల‌ను లైన్‌లో పెడుతోంది. వారికిఏం కావాలో క‌నుక్కోండి! అని కీల‌క మంత్రుల కు సీఎం జ‌గ‌న్ ఆదేశాలు ఇచ్చినట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధా..? నిధులా? ఏది కావాల‌న్నా చేద్దాం అని సీఎం జ‌గ‌న్ తేల్చి చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి కార‌ణం.. ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందునే! ఈ కోటాలో ఉన్న 7 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

పట్టభద్రులు ఎమ్మెల్సీలో వైసీపీకి చుక్కెదురు కావడంతో.. ఎమ్మెల్యేల కోటాలో అయినా.. గుండుగుత్త‌గా 7 స్థానాలు ద‌క్కించుకుని అంతో ఇంతో గౌర‌వం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. దీంతో మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. ఈ నేప‌థ్యంలో మంత్రులు త‌మ త‌మ ప‌రిధిలోని ఎమ్మెల్యేల‌కు ఫోన్లు చేస్తున్నారు. స‌మ‌స్య‌లు చెప్పండి.. మీకేం కావాలో అడ‌గండి.. పార్టీ మాత్రం విజ‌యం ద‌క్కించుకోవాల్సిందే! అని తేల్చి చెబుతున్నారు.

ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 6న నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరించారు. మార్చి 23వ తేదీన పోలింగ్‌, అదే రోజు కౌంటింగ్‌ కూడా జరగనుంది. మార్చి 25వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. నారా లోకేశ్‌, చల్లా భగీరథరెడ్డి, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, పెనుమత్స సూర్యనారాయణరాజు, గంగుల ప్రభాకర్‌రెడ్డి పదవీ కాలం మార్చి 29న ముగియనుంది. దీంతో ఆ స్థానాల భర్తీకి ఈసీ షెడ్యూల్‌ ప్రకటించింది. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉంది. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఈ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి.

This post was last modified on March 20, 2023 10:40 am

Share

Recent Posts

చిరు అభిమానుల‌కు కొడాలి నాని వ‌ల‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌ల్లో ఒక‌రైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జ‌న‌సేన అన్నా ఎంత కోప‌మో ప్ర‌త్యేకంగా…

15 minutes ago

ఆ భవనాలు కూల్చేస్తామంటోన్న హైడ్రా రంగనాథ్

హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…

56 minutes ago

మాస్ రాజా తాప‌త్ర‌యమే కానీ… వాళ్లు చూస్తారా?

మాస్ రాజా ర‌వితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాల‌తో పాటు తెలుగు వాళ్లుండే ప్ర‌తి చోటా ఇర‌గాడేస్తోంది. తెలుగులో…

2 hours ago

నాగ చైతన్య అయితే సెట్ అయ్యేదా

బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…

3 hours ago

రాకా సెట్లో మంచు లక్ష్మి… వావ్ వావ్ వావ్

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…

6 hours ago

విశాఖలో విద్యార్థుల లవ్ వార్… హద్దు మీరిపోయారు!

విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…

6 hours ago