ఇప్పటి వరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలను సరిగా పట్టించుకోలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ.. ఇప్పు డు వారికి భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. ఇటీవల తమ గోడు వినిపించుకోవడం లేదని, నియోజకవర్గంలో కనీసం తమను పట్టించుకో వడం లేదని.. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి.. మద్దిశెట్టి వేణుగోపాల్ వంటి వారు బాహాటంగానే ఆరోపణలు చేసి న విషయం తెలిసిందే. వీరిలో కోటంరెడ్డి ఏకంగా తిరుగుబావుటా ఎగుర వేశారు. అంటే.. ఈ నాలుగేళ్లలో తన పార్టీ ఎమ్మెల్యేలనే వైసీపీ పట్టించుకోలేదన్నమాట.
కానీ.. ఇప్పుడు వైసీపీ అధిష్టానం తన ఎమ్మెల్యేలను లైన్లో పెడుతోంది. వారికిఏం కావాలో కనుక్కోండి! అని కీలక మంత్రుల కు సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గం అభివృద్ధా..? నిధులా? ఏది కావాలన్నా చేద్దాం అని సీఎం జగన్ తేల్చి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం.. ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందునే! ఈ కోటాలో ఉన్న 7 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
పట్టభద్రులు ఎమ్మెల్సీలో వైసీపీకి చుక్కెదురు కావడంతో.. ఎమ్మెల్యేల కోటాలో అయినా.. గుండుగుత్తగా 7 స్థానాలు దక్కించుకుని అంతో ఇంతో గౌరవం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో మంత్రులు తమ తమ పరిధిలోని ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నారు. సమస్యలు చెప్పండి.. మీకేం కావాలో అడగండి.. పార్టీ మాత్రం విజయం దక్కించుకోవాల్సిందే! అని తేల్చి చెబుతున్నారు.
ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరించారు. మార్చి 23వ తేదీన పోలింగ్, అదే రోజు కౌంటింగ్ కూడా జరగనుంది. మార్చి 25వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. నారా లోకేశ్, చల్లా భగీరథరెడ్డి, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, పెనుమత్స సూర్యనారాయణరాజు, గంగుల ప్రభాకర్రెడ్డి పదవీ కాలం మార్చి 29న ముగియనుంది. దీంతో ఆ స్థానాల భర్తీకి ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…