Political News

ఏం కావాలో చెప్పండి.. ఎమ్మెల్యేల‌కు వైసీపీ ఆఫ‌ర్లు?!

ఇప్ప‌టి వ‌ర‌కు సొంత పార్టీ ఎమ్మెల్యేల‌ను స‌రిగా ప‌ట్టించుకోలేద‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ.. ఇప్పు డు వారికి భారీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తోంది. ఇటీవ‌ల త‌మ గోడు వినిపించుకోవ‌డం లేద‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో క‌నీసం త‌మ‌ను ప‌ట్టించుకో వ‌డం లేద‌ని.. ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి.. మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ వంటి వారు బాహాటంగానే ఆరోప‌ణ‌లు చేసి న విష‌యం తెలిసిందే. వీరిలో కోటంరెడ్డి ఏకంగా తిరుగుబావుటా ఎగుర వేశారు. అంటే.. ఈ నాలుగేళ్ల‌లో త‌న పార్టీ ఎమ్మెల్యేల‌నే వైసీపీ ప‌ట్టించుకోలేద‌న్న‌మాట‌.

కానీ.. ఇప్పుడు వైసీపీ అధిష్టానం త‌న ఎమ్మెల్యేల‌ను లైన్‌లో పెడుతోంది. వారికిఏం కావాలో క‌నుక్కోండి! అని కీల‌క మంత్రుల కు సీఎం జ‌గ‌న్ ఆదేశాలు ఇచ్చినట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధా..? నిధులా? ఏది కావాల‌న్నా చేద్దాం అని సీఎం జ‌గ‌న్ తేల్చి చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి కార‌ణం.. ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందునే! ఈ కోటాలో ఉన్న 7 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

పట్టభద్రులు ఎమ్మెల్సీలో వైసీపీకి చుక్కెదురు కావడంతో.. ఎమ్మెల్యేల కోటాలో అయినా.. గుండుగుత్త‌గా 7 స్థానాలు ద‌క్కించుకుని అంతో ఇంతో గౌర‌వం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. దీంతో మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. ఈ నేప‌థ్యంలో మంత్రులు త‌మ త‌మ ప‌రిధిలోని ఎమ్మెల్యేల‌కు ఫోన్లు చేస్తున్నారు. స‌మ‌స్య‌లు చెప్పండి.. మీకేం కావాలో అడ‌గండి.. పార్టీ మాత్రం విజ‌యం ద‌క్కించుకోవాల్సిందే! అని తేల్చి చెబుతున్నారు.

ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 6న నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరించారు. మార్చి 23వ తేదీన పోలింగ్‌, అదే రోజు కౌంటింగ్‌ కూడా జరగనుంది. మార్చి 25వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. నారా లోకేశ్‌, చల్లా భగీరథరెడ్డి, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, పెనుమత్స సూర్యనారాయణరాజు, గంగుల ప్రభాకర్‌రెడ్డి పదవీ కాలం మార్చి 29న ముగియనుంది. దీంతో ఆ స్థానాల భర్తీకి ఈసీ షెడ్యూల్‌ ప్రకటించింది. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉంది. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఈ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి.

This post was last modified on March 20, 2023 10:40 am

Share
Show comments

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

1 hour ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

1 hour ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

4 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

6 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago