Political News

వైసీపీకి సాయిరెడ్డే లోటు తెలిసొచ్చిందా…!

ఔను! ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. ఏపీ అధికార పార్టీ వైసీపీకి మోస్ట్ డిపెండ‌బుల్ లీడ‌ర్ విజ‌య‌సాయిరెడ్డేనా? అంటే..ఔన‌నే మాటే ప‌రిశీల‌కులు. విశ్లేష‌కుల నుంచి వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా జ‌రిగిన రెండు ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. సాయిరెడ్డి ఎంత కీల‌క‌మో.. అర్ధ‌మ‌వుతుందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌టి.. ఢిల్లీలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం కావ‌డం. రెండు. ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీ ఘోరంగా విఫ‌లం కావ‌డం.

ఈ రెండు అంశాల్లోనూ సాయిర్డెడ్డి ప్ర‌త్య‌క్షంగాను.. ప‌రోక్షంగాను ఉన్నారు. ఢిల్లీలో సాయిరెడ్డి చ‌క్రం తిప్పు తున్న‌ట్టు ఇత‌ర వైసీపీ నాయ‌కులు ఎవ‌రూ కూడా చ‌క్రం తిప్ప‌డం లేదు. పైగా.. సాయిరెడ్డి దూకుడు ముందు ఎవ‌రూ నిల‌వ‌ర‌నే పేరు కూడా ఉంది. నేరుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పేరు పెట్టి పిలిచే నాయ‌కుల్లో సాయిరెడ్డి ఉన్నారు. కానీ ఈ త‌ర‌హా ప‌రిస్థితి ఇత‌ర నేత‌ల‌కు లేదు. అందుకే.. రాష్ట్రానికి సంబంధించిన ఏ ప‌ని ఢిల్లీలో జ‌ర‌గాల‌న్నా.. సాయిరెడ్డి ఎంట్రీ ఇవ్వాల్సిందే.

తాజాగా సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఇక‌, ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం పాలైంది. ఉత్త‌రాంధ్ర గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల్లో వైవీ సుబ్బారెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. వాస్త‌వానికి ఏ ఎన్నిక వ‌చ్చినప్ప‌టికీ సాయిరెడ్డి విజృంభిస్తార‌నే పేరుంది. కానీ.. ఈ సారి మాత్రం సుబ్బారెడ్డి చూశారు. మ‌రి ఆయ‌న వ్యూహాలు ఫ‌లించ‌లేదు. దీంతో వ‌స్తుందని ఆశ‌లు పెట్టుకున్న స్థానం కోల్పోవాల్సి వ‌చ్చింది.

ఇదిలావుంటే.. కొన్నాళ్లుగా వైసీపీలో స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి హ‌వా పెరిగింది. ఆయ‌న దూకుడు పెంచారు. సాయిరెడ్డి ఎక్క‌డ నెంబ‌ర్ 2 అవుతార‌ని అనుకున్నారో..ఏమో.. కానీ, ఆయ‌న‌ను త‌ప్పించే క్ర‌తువులో స‌జ్జ‌ల ముఖ్య‌పాత్ర పోషించార‌నే వాద‌న ఉంది. ఈ క్ర‌మంలో ఉత్త‌రాంధ్ర బాధ్య‌త‌ల నుంచి వైసీపీ సోష‌ల్ మీడియా విభాగం వ‌ర‌కు కూడా.. సాయిరెడ్డిని త‌ప్పించేశారు.

కానీ, స‌జ్జ‌ల‌కు కేవలం అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల‌పై ప‌ట్టుందే త‌ప్ప‌.. రాజ‌కీయంగా మాత్రం ఆయ‌న‌కు ప్ర‌జాక్షేత్రంలో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే విష‌యంపై మాత్రం ప‌ట్టులేదు. ఇదే.. ఇప్పుడు కొంప‌ముంచుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదేమైనా.. సాయిరెడ్డి వైసీపీకి అత్యంత కీల‌క‌మైన నాయ‌కుడు అన‌డంలో ఎలాంటి సందేహాలు లేవ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి!

తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…

33 minutes ago

వైసీపీ కాపుల సభలో ఏం జరిగింది?

వైసీపీ ఆధ్వ‌ర్యంలో ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ‌లో ఆదివారం నిర్వ‌హించిన కాపుల స‌భ‌లో మాజీ మంత్రి, ఉత్త‌రాంధ్ర‌కు చెందిన బొత్స…

3 hours ago

ప్రేక్షక దేవుళ్ల ఆశీర్వాదం దొరికిందా

బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…

7 hours ago

అమెరికా వెళ్లే వారికి అలెర్ట్‌… నాలుగేళ్లే గ‌డువు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దేశంలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేష‌న్…

8 hours ago

పెద్ది కాస్త తొందరపడి ఉండాల్సింది

400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…

10 hours ago

హనుమాన్ ఇంత హడావిడి ఎందుకు చేసినట్టు

ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…

10 hours ago