ఔను! ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. ఏపీ అధికార పార్టీ వైసీపీకి మోస్ట్ డిపెండబుల్ లీడర్ విజయసాయిరెడ్డేనా? అంటే..ఔననే మాటే పరిశీలకులు. విశ్లేషకుల నుంచి వినిపిస్తుండడం గమనార్హం. తాజాగా జరిగిన రెండు పరిణామాలను గమనిస్తే.. సాయిరెడ్డి ఎంత కీలకమో.. అర్ధమవుతుందని అంటున్నారు పరిశీలకులు. ఒకటి.. ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన విజయవంతం కావడం. రెండు. ఉత్తరాంధ్రలో వైసీపీ ఘోరంగా విఫలం కావడం.
ఈ రెండు అంశాల్లోనూ సాయిర్డెడ్డి ప్రత్యక్షంగాను.. పరోక్షంగాను ఉన్నారు. ఢిల్లీలో సాయిరెడ్డి చక్రం తిప్పు తున్నట్టు ఇతర వైసీపీ నాయకులు ఎవరూ కూడా చక్రం తిప్పడం లేదు. పైగా.. సాయిరెడ్డి దూకుడు ముందు ఎవరూ నిలవరనే పేరు కూడా ఉంది. నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ పేరు పెట్టి పిలిచే నాయకుల్లో సాయిరెడ్డి ఉన్నారు. కానీ ఈ తరహా పరిస్థితి ఇతర నేతలకు లేదు. అందుకే.. రాష్ట్రానికి సంబంధించిన ఏ పని ఢిల్లీలో జరగాలన్నా.. సాయిరెడ్డి ఎంట్రీ ఇవ్వాల్సిందే.
తాజాగా సీఎం జగన్ పర్యటన విషయంలోనూ అదే జరిగింది. ఇక, ఉత్తరాంధ్రలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి ఏ ఎన్నిక వచ్చినప్పటికీ సాయిరెడ్డి విజృంభిస్తారనే పేరుంది. కానీ.. ఈ సారి మాత్రం సుబ్బారెడ్డి చూశారు. మరి ఆయన వ్యూహాలు ఫలించలేదు. దీంతో వస్తుందని ఆశలు పెట్టుకున్న స్థానం కోల్పోవాల్సి వచ్చింది.
ఇదిలావుంటే.. కొన్నాళ్లుగా వైసీపీలో సజ్జల రామకృష్నారెడ్డి హవా పెరిగింది. ఆయన దూకుడు పెంచారు. సాయిరెడ్డి ఎక్కడ నెంబర్ 2 అవుతారని అనుకున్నారో..ఏమో.. కానీ, ఆయనను తప్పించే క్రతువులో సజ్జల ముఖ్యపాత్ర పోషించారనే వాదన ఉంది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి వైసీపీ సోషల్ మీడియా విభాగం వరకు కూడా.. సాయిరెడ్డిని తప్పించేశారు.
కానీ, సజ్జలకు కేవలం అంతర్గత వ్యవహారాలపై పట్టుందే తప్ప.. రాజకీయంగా మాత్రం ఆయనకు ప్రజాక్షేత్రంలో ఎలా వ్యవహరించాలనే విషయంపై మాత్రం పట్టులేదు. ఇదే.. ఇప్పుడు కొంపముంచుతోందని అంటున్నారు పరిశీలకులు. ఏదేమైనా.. సాయిరెడ్డి వైసీపీకి అత్యంత కీలకమైన నాయకుడు అనడంలో ఎలాంటి సందేహాలు లేవని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on March 19, 2023 9:47 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…