Political News

ఈసారీ డుమ్మా కొడితే.. ఈడీ అరెస్టే!

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌విత ఇప్ప‌టికి రెండు సార్లు ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఒక‌సారి హైద‌రాబాద్‌లో నేరుగా ఆమె ఇంట్లోనే విచార‌ణ జ‌రిపిన అధికారులు రెండో సారి ఢిల్లీలో విచారించారు. అయితే.. మూడోసారి కూడా విచారించాల్సి ఉంద‌ని పేర్కొంటూ.. నోటీసులు ఇచ్చారు. కానీ, క‌విత మూడో సారి విచార‌ణ‌కు డుమ్మా కొట్టారు. త‌న‌కు ఒంట్లో బాగోలేద‌ని, రాలేన‌ని త‌న లాయ‌ర్ ద్వారా కావాల్సిన స‌మాచారం పంపిస్తున్నాన‌ని పేర్కొంటూ.. ఆమె త‌ర‌ఫున లాయ‌ర్ భ‌ర‌త్‌ను పంపించారు.

ఈడీ మాత్రం భర‌త్ వ‌చ్చినా.. ప్ర‌యోజ‌నం లేద‌ని పేర్కొంటూ.. ఇంకోసారి విచార‌ణ‌కురావాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. సోమ‌వారం ఆమెను(ఈనెల 20న‌) విచార‌ణ‌కు రావాల‌ని తేల్చి చెప్పింది. అయితే.. త‌న విచార‌ణ‌పై క‌విత ఇప్ప‌టికే సుప్రీం కోర్టులో కేసు వేశారు. మ‌హిళ‌న‌ని కూడా చూడ‌కుండా వేధిస్తున్నార‌ని.. సాయంత్రం 5 త‌ర్వాత విచారించ‌కూడద‌ని తెలిసినా.. 8 గంట‌ల‌వర‌కు విచారించార‌ని, థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగిస్తున్నార‌ని.. ఈడీపై ఆరోపించారు. ఈ కేసు విచార‌ణ ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారించ‌నుంది. అయితే.. ఇంత‌లోనే ఈ నెల 20న విచార‌ణ‌కు రావాల‌ని ఈడీ మ‌రోసారి నోటీసులు పంపించింది.

ఈ ప‌రిణామాల క్ర‌మంలో క‌విత ఇప్పుడు చేయ‌నున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఈసారి కూడా ఈడీ విచార‌ణ‌కు హాజ‌రు కాక‌పోతే.. అరెస్టు చేసే అవ‌కాశం మెండుగా ఉంటుంద‌ని గ‌త అనుభ‌వాల నేప‌థ్యంలో క‌విత శిబిరం భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో క‌విత ఢిల్లీకి వెళ్లారు. ఆమెతో పాటు మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌ కూడా ఉన్నారు. అయితే, ఢిల్లీకి వెళ్లినంత మాత్రాన క‌విత‌ విచారణకు హాజరవుతారా? లేక గతంలో మాదిరిగా తన న్యాయవాదిని పంపిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. ఒక‌వేళ ఈసారి త‌ప్పించుకున్నా.. మ‌రో రెండు రోజుల్లోనే విచార‌ణ‌కు ర‌మ్మ‌ని ఆదేశించే అవ‌కాశం ఈడీకి ఉంది. లేక‌పోతే.. సుప్రీంకోర్టు నుంచి ప్ర‌త్యేక అనుమ‌తి తీసుకుని అరెస్టు చేసినా చేయొచ్చ‌ని న్యాయ‌నిపుణులు అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

బీఆర్ఎస్ `బ్లెడ్` పాలిటిక్స్‌.. ఇంత అవ‌స‌ర‌మా?

తెలంగాణ‌లో రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ముందుకు రావ‌డం లేద‌ని, ప్రాజెక్టుల‌కు నీటిని విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆరోపిస్తూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం…

17 minutes ago

నరరూప రాక్షసుడు రాజ్ కుమార్ మృతి

షాబాద్ లో ఆరుగురిని పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ దారుణంగా హత్య చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన…

47 minutes ago

NBK 111… ఎప్పుడు వస్తే బాగుంటుంది

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

2 hours ago

వరుణ్ తేజ్ పూర్తిగా రూటు మార్చేశాడు

వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…

2 hours ago

నాగబంధం.. ఈ కొత్త సౌండ్ ఎవరిది?

స్టార్లు లేకపోయినా సరే ఏకంగా వంద కోట్ల బడ్జెట్లో భారీగా తెరకెక్కి, కళ్లు చెదిరే విజువల్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన…

4 hours ago

చెన్నై లవ్ స్టోరీ హీరోయిన్… అమ్మ కన్నీటి కథ

‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…

5 hours ago