Political News

ఈసారీ డుమ్మా కొడితే.. ఈడీ అరెస్టే!

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌విత ఇప్ప‌టికి రెండు సార్లు ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఒక‌సారి హైద‌రాబాద్‌లో నేరుగా ఆమె ఇంట్లోనే విచార‌ణ జ‌రిపిన అధికారులు రెండో సారి ఢిల్లీలో విచారించారు. అయితే.. మూడోసారి కూడా విచారించాల్సి ఉంద‌ని పేర్కొంటూ.. నోటీసులు ఇచ్చారు. కానీ, క‌విత మూడో సారి విచార‌ణ‌కు డుమ్మా కొట్టారు. త‌న‌కు ఒంట్లో బాగోలేద‌ని, రాలేన‌ని త‌న లాయ‌ర్ ద్వారా కావాల్సిన స‌మాచారం పంపిస్తున్నాన‌ని పేర్కొంటూ.. ఆమె త‌ర‌ఫున లాయ‌ర్ భ‌ర‌త్‌ను పంపించారు.

ఈడీ మాత్రం భర‌త్ వ‌చ్చినా.. ప్ర‌యోజ‌నం లేద‌ని పేర్కొంటూ.. ఇంకోసారి విచార‌ణ‌కురావాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. సోమ‌వారం ఆమెను(ఈనెల 20న‌) విచార‌ణ‌కు రావాల‌ని తేల్చి చెప్పింది. అయితే.. త‌న విచార‌ణ‌పై క‌విత ఇప్ప‌టికే సుప్రీం కోర్టులో కేసు వేశారు. మ‌హిళ‌న‌ని కూడా చూడ‌కుండా వేధిస్తున్నార‌ని.. సాయంత్రం 5 త‌ర్వాత విచారించ‌కూడద‌ని తెలిసినా.. 8 గంట‌ల‌వర‌కు విచారించార‌ని, థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగిస్తున్నార‌ని.. ఈడీపై ఆరోపించారు. ఈ కేసు విచార‌ణ ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారించ‌నుంది. అయితే.. ఇంత‌లోనే ఈ నెల 20న విచార‌ణ‌కు రావాల‌ని ఈడీ మ‌రోసారి నోటీసులు పంపించింది.

ఈ ప‌రిణామాల క్ర‌మంలో క‌విత ఇప్పుడు చేయ‌నున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఈసారి కూడా ఈడీ విచార‌ణ‌కు హాజ‌రు కాక‌పోతే.. అరెస్టు చేసే అవ‌కాశం మెండుగా ఉంటుంద‌ని గ‌త అనుభ‌వాల నేప‌థ్యంలో క‌విత శిబిరం భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో క‌విత ఢిల్లీకి వెళ్లారు. ఆమెతో పాటు మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌ కూడా ఉన్నారు. అయితే, ఢిల్లీకి వెళ్లినంత మాత్రాన క‌విత‌ విచారణకు హాజరవుతారా? లేక గతంలో మాదిరిగా తన న్యాయవాదిని పంపిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. ఒక‌వేళ ఈసారి త‌ప్పించుకున్నా.. మ‌రో రెండు రోజుల్లోనే విచార‌ణ‌కు ర‌మ్మ‌ని ఆదేశించే అవ‌కాశం ఈడీకి ఉంది. లేక‌పోతే.. సుప్రీంకోర్టు నుంచి ప్ర‌త్యేక అనుమ‌తి తీసుకుని అరెస్టు చేసినా చేయొచ్చ‌ని న్యాయ‌నిపుణులు అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on March 19, 2023 9:44 pm

Share

Recent Posts

ఊహించని స్పీడుతో ‘షేర్’ పరుగులు

ఆయా షేర్ అంటూ పాటల నుంచే సంచలనాలు మొదలుపెట్టిన ది ప్యారడైజ్ సినిమా దానికి తగ్గట్టే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్…

27 minutes ago

లోకేశ్‌ ఇలాఖాలో ఈసారైనా ఎన్నికలు ఉంటాయా?

మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ (ఎంటీఎంసీ) ఎన్నికలపై ప్రధాన పార్టీల కార్యకర్తల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కార్పొరేషన్‌ ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు…

37 minutes ago

గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు మరో షాక్

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులకు మరో సమస్య ఎదురైంది. అమెరికా కార్మిక శాఖ కాగ్నిజెంట్ నుంచి వచ్చే…

1 hour ago

అరుణాచల్ స్వతంత్ర ప్రదేశమా…?వరల్డ్ మ్యాప్ లో వివాదం!

ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన కొత్త మ్యాప్ వివాదాస్పదంగా మారింది. భారత దేశంలో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ ని స్వతంత్ర…

4 hours ago

ఓటీటీలతో ఆటలు బహు ప్రమాదకరం

కరోనా సమయంలో ‘‘భలే మంచి ఓటీటీ బేరము’’ అని పాడుకున్నాయి టాలీవుడ్ నిర్మాణ సంస్థలు. మిగతా భాషల చిత్రాలకు కూడా…

5 hours ago

అన్ని స‌ర్వేల‌దీ అదే దారి.. వైసీపీ మౌనం అందుకేనా?

రాష్ట్రంలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డి రెండున్న‌రేళ్లు పూర్తయింది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం ఎవ‌రికి ద‌క్కుతుంది? అనే…

7 hours ago