ఢిల్లీ మద్యం కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఇప్పటికి రెండు సార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఒకసారి హైదరాబాద్లో నేరుగా ఆమె ఇంట్లోనే విచారణ జరిపిన అధికారులు రెండో సారి ఢిల్లీలో విచారించారు. అయితే.. మూడోసారి కూడా విచారించాల్సి ఉందని పేర్కొంటూ.. నోటీసులు ఇచ్చారు. కానీ, కవిత మూడో సారి విచారణకు డుమ్మా కొట్టారు. తనకు ఒంట్లో బాగోలేదని, రాలేనని తన లాయర్ ద్వారా కావాల్సిన సమాచారం పంపిస్తున్నానని పేర్కొంటూ.. ఆమె తరఫున లాయర్ భరత్ను పంపించారు.
ఈడీ మాత్రం భరత్ వచ్చినా.. ప్రయోజనం లేదని పేర్కొంటూ.. ఇంకోసారి విచారణకురావాల్సిందేనని తేల్చి చెప్పింది. సోమవారం ఆమెను(ఈనెల 20న) విచారణకు రావాలని తేల్చి చెప్పింది. అయితే.. తన విచారణపై కవిత ఇప్పటికే సుప్రీం కోర్టులో కేసు వేశారు. మహిళనని కూడా చూడకుండా వేధిస్తున్నారని.. సాయంత్రం 5 తర్వాత విచారించకూడదని తెలిసినా.. 8 గంటలవరకు విచారించారని, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని.. ఈడీపై ఆరోపించారు. ఈ కేసు విచారణ ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారించనుంది. అయితే.. ఇంతలోనే ఈ నెల 20న విచారణకు రావాలని ఈడీ మరోసారి నోటీసులు పంపించింది.
ఈ పరిణామాల క్రమంలో కవిత ఇప్పుడు చేయనున్నారు? అనేది ఆసక్తిగా మారింది. ఈసారి కూడా ఈడీ విచారణకు హాజరు కాకపోతే.. అరెస్టు చేసే అవకాశం మెండుగా ఉంటుందని గత అనుభవాల నేపథ్యంలో కవిత శిబిరం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కవిత ఢిల్లీకి వెళ్లారు. ఆమెతో పాటు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. అయితే, ఢిల్లీకి వెళ్లినంత మాత్రాన కవిత విచారణకు హాజరవుతారా? లేక గతంలో మాదిరిగా తన న్యాయవాదిని పంపిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ ఈసారి తప్పించుకున్నా.. మరో రెండు రోజుల్లోనే విచారణకు రమ్మని ఆదేశించే అవకాశం ఈడీకి ఉంది. లేకపోతే.. సుప్రీంకోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని అరెస్టు చేసినా చేయొచ్చని న్యాయనిపుణులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…