ఢిల్లీ మద్యం కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఇప్పటికి రెండు సార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఒకసారి హైదరాబాద్లో నేరుగా ఆమె ఇంట్లోనే విచారణ జరిపిన అధికారులు రెండో సారి ఢిల్లీలో విచారించారు. అయితే.. మూడోసారి కూడా విచారించాల్సి ఉందని పేర్కొంటూ.. నోటీసులు ఇచ్చారు. కానీ, కవిత మూడో సారి విచారణకు డుమ్మా కొట్టారు. తనకు ఒంట్లో బాగోలేదని, రాలేనని తన లాయర్ ద్వారా కావాల్సిన సమాచారం పంపిస్తున్నానని పేర్కొంటూ.. ఆమె తరఫున లాయర్ భరత్ను పంపించారు.
ఈడీ మాత్రం భరత్ వచ్చినా.. ప్రయోజనం లేదని పేర్కొంటూ.. ఇంకోసారి విచారణకురావాల్సిందేనని తేల్చి చెప్పింది. సోమవారం ఆమెను(ఈనెల 20న) విచారణకు రావాలని తేల్చి చెప్పింది. అయితే.. తన విచారణపై కవిత ఇప్పటికే సుప్రీం కోర్టులో కేసు వేశారు. మహిళనని కూడా చూడకుండా వేధిస్తున్నారని.. సాయంత్రం 5 తర్వాత విచారించకూడదని తెలిసినా.. 8 గంటలవరకు విచారించారని, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని.. ఈడీపై ఆరోపించారు. ఈ కేసు విచారణ ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారించనుంది. అయితే.. ఇంతలోనే ఈ నెల 20న విచారణకు రావాలని ఈడీ మరోసారి నోటీసులు పంపించింది.
ఈ పరిణామాల క్రమంలో కవిత ఇప్పుడు చేయనున్నారు? అనేది ఆసక్తిగా మారింది. ఈసారి కూడా ఈడీ విచారణకు హాజరు కాకపోతే.. అరెస్టు చేసే అవకాశం మెండుగా ఉంటుందని గత అనుభవాల నేపథ్యంలో కవిత శిబిరం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కవిత ఢిల్లీకి వెళ్లారు. ఆమెతో పాటు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. అయితే, ఢిల్లీకి వెళ్లినంత మాత్రాన కవిత విచారణకు హాజరవుతారా? లేక గతంలో మాదిరిగా తన న్యాయవాదిని పంపిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ ఈసారి తప్పించుకున్నా.. మరో రెండు రోజుల్లోనే విచారణకు రమ్మని ఆదేశించే అవకాశం ఈడీకి ఉంది. లేకపోతే.. సుప్రీంకోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని అరెస్టు చేసినా చేయొచ్చని న్యాయనిపుణులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 19, 2023 9:44 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…