Political News

ఈసారీ డుమ్మా కొడితే.. ఈడీ అరెస్టే!

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌విత ఇప్ప‌టికి రెండు సార్లు ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఒక‌సారి హైద‌రాబాద్‌లో నేరుగా ఆమె ఇంట్లోనే విచార‌ణ జ‌రిపిన అధికారులు రెండో సారి ఢిల్లీలో విచారించారు. అయితే.. మూడోసారి కూడా విచారించాల్సి ఉంద‌ని పేర్కొంటూ.. నోటీసులు ఇచ్చారు. కానీ, క‌విత మూడో సారి విచార‌ణ‌కు డుమ్మా కొట్టారు. త‌న‌కు ఒంట్లో బాగోలేద‌ని, రాలేన‌ని త‌న లాయ‌ర్ ద్వారా కావాల్సిన స‌మాచారం పంపిస్తున్నాన‌ని పేర్కొంటూ.. ఆమె త‌ర‌ఫున లాయ‌ర్ భ‌ర‌త్‌ను పంపించారు.

ఈడీ మాత్రం భర‌త్ వ‌చ్చినా.. ప్ర‌యోజ‌నం లేద‌ని పేర్కొంటూ.. ఇంకోసారి విచార‌ణ‌కురావాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. సోమ‌వారం ఆమెను(ఈనెల 20న‌) విచార‌ణ‌కు రావాల‌ని తేల్చి చెప్పింది. అయితే.. త‌న విచార‌ణ‌పై క‌విత ఇప్ప‌టికే సుప్రీం కోర్టులో కేసు వేశారు. మ‌హిళ‌న‌ని కూడా చూడ‌కుండా వేధిస్తున్నార‌ని.. సాయంత్రం 5 త‌ర్వాత విచారించ‌కూడద‌ని తెలిసినా.. 8 గంట‌ల‌వర‌కు విచారించార‌ని, థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగిస్తున్నార‌ని.. ఈడీపై ఆరోపించారు. ఈ కేసు విచార‌ణ ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారించ‌నుంది. అయితే.. ఇంత‌లోనే ఈ నెల 20న విచార‌ణ‌కు రావాల‌ని ఈడీ మ‌రోసారి నోటీసులు పంపించింది.

ఈ ప‌రిణామాల క్ర‌మంలో క‌విత ఇప్పుడు చేయ‌నున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఈసారి కూడా ఈడీ విచార‌ణ‌కు హాజ‌రు కాక‌పోతే.. అరెస్టు చేసే అవ‌కాశం మెండుగా ఉంటుంద‌ని గ‌త అనుభ‌వాల నేప‌థ్యంలో క‌విత శిబిరం భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో క‌విత ఢిల్లీకి వెళ్లారు. ఆమెతో పాటు మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌ కూడా ఉన్నారు. అయితే, ఢిల్లీకి వెళ్లినంత మాత్రాన క‌విత‌ విచారణకు హాజరవుతారా? లేక గతంలో మాదిరిగా తన న్యాయవాదిని పంపిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. ఒక‌వేళ ఈసారి త‌ప్పించుకున్నా.. మ‌రో రెండు రోజుల్లోనే విచార‌ణ‌కు ర‌మ్మ‌ని ఆదేశించే అవ‌కాశం ఈడీకి ఉంది. లేక‌పోతే.. సుప్రీంకోర్టు నుంచి ప్ర‌త్యేక అనుమ‌తి తీసుకుని అరెస్టు చేసినా చేయొచ్చ‌ని న్యాయ‌నిపుణులు అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on March 19, 2023 9:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దుర్గేశ్ ప్లాన్ సక్సెస్ .. ‘సూర్యలంక’కు రూ.97 కోట్లు

ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా జనసేన కీలక నేత కందుల దుర్గేశ్ సత్తా చాటుతున్నారని చెప్పాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పర్యాటక…

4 hours ago

బాబుకు జయమంగళ పాదాభివందనం

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఓ…

5 hours ago

2027 జూన్ నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు… ఏపీకి జీవనాడి. జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన ఈ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే…

6 hours ago

చివరి నిమిషం టెన్షన్లకు ఎవరు బాధ్యులు

అంతా సిద్దమనుకుని ఇంకాసేపట్లో షోలు పడతాయన్న టైంలో హఠాత్తుగా విడుదల ఆగిపోతే ఆ నిర్మాతలు పడే నరకం అంతా ఇంతా…

7 hours ago

టాస్క్ ఫోర్స్ ఎంట్రీ.. గేట్స్ సహకారానికి రూట్ క్లియర్

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నేతృత్వంలోని గేట్స్ అండ్ మిలిండా ఫౌండేషన్ ఏపీకి వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు ఇప్పటికే…

7 hours ago

గురువుని ఇంత ఫాలో అవ్వాలా శిష్యా

ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పెద్ది ఫస్ట్ లుక్ పోస్టర్స్ గురించి సోషల్ మీడియా మంచి…

7 hours ago