రాష్ట్రంలో మొత్తం 9 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో నాలుగు స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ విజయం దక్కించుకుంది. అయితే.. స్థానిక సంస్థలు అన్నీ కూడా గుండు గుత్తగా వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి.. ఇక, అదే సమయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండు స్థానాలు కూడా వైసీపీ ఖాతాలో పడ్డాయి. అయితే.. ఇది కూడా గాలికి కొట్టుకుపోయింది.
దీనికి కారణం.. ఉపాధ్యాయ సంఘాల్లో ఐక్యత లేకపోవడం.. కొందరు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించడంతో వైసీపీ విజయం దక్కించుకుందని ఒక వాదన తెర మీదికి వచ్చింది. ఇక, అత్యంత కీలకమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జరిగిన 3 నియోజకవర్గాల్లోనూ వైసీపీ బోల్తా పడింది. ఇదే ఇప్పుడు వైసీపీని ఆత్మరక్షణలో పడేసింది. ఇలా ఎందుకు జరిగింది? అని నాయకులు తల పట్టుకున్నారు.
ఎందుకంటే.. తాము అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి గ్రాడ్యుయేట్లకు 4 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చామని.. వలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి.. ఉద్యోగాలు కల్పించామని.. అలాంటప్పుడు ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందని వైసీపీ భావిస్తోంది. అంతేకాదు… గ్రాడ్యుయేట్లుగా ఉన్నవారి కుటుంబాల్లోనూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని..వారు అందుకుంటున్నారని.. అయినా.. ఇంత వ్యతిరేకత ఎందుకు అనేది వైసీపీ మాట.
కానీ.. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని గమనిస్తే.. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు కూడా వైసీపీని రక్షిం చలేక పోయాయనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. ఈ ఉద్యోగులుకూడా వేతనాలు.. పనిభావం వంటి సమస్యలనుఎదుర్కొంటున్నారు.వీటిని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందనే వాదన ఉంది. ఈ క్రమంలోనే తాజా రిజల్ట్ వచ్చిందని మరికొందరు వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఎలా చూసినా.. ఇప్పుడు వ్యవస్థలపై నా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
This post was last modified on March 19, 2023 6:21 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…