రాష్ట్రంలో మొత్తం 9 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో నాలుగు స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ విజయం దక్కించుకుంది. అయితే.. స్థానిక సంస్థలు అన్నీ కూడా గుండు గుత్తగా వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి.. ఇక, అదే సమయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండు స్థానాలు కూడా వైసీపీ ఖాతాలో పడ్డాయి. అయితే.. ఇది కూడా గాలికి కొట్టుకుపోయింది.
దీనికి కారణం.. ఉపాధ్యాయ సంఘాల్లో ఐక్యత లేకపోవడం.. కొందరు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించడంతో వైసీపీ విజయం దక్కించుకుందని ఒక వాదన తెర మీదికి వచ్చింది. ఇక, అత్యంత కీలకమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జరిగిన 3 నియోజకవర్గాల్లోనూ వైసీపీ బోల్తా పడింది. ఇదే ఇప్పుడు వైసీపీని ఆత్మరక్షణలో పడేసింది. ఇలా ఎందుకు జరిగింది? అని నాయకులు తల పట్టుకున్నారు.
ఎందుకంటే.. తాము అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి గ్రాడ్యుయేట్లకు 4 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చామని.. వలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి.. ఉద్యోగాలు కల్పించామని.. అలాంటప్పుడు ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందని వైసీపీ భావిస్తోంది. అంతేకాదు… గ్రాడ్యుయేట్లుగా ఉన్నవారి కుటుంబాల్లోనూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని..వారు అందుకుంటున్నారని.. అయినా.. ఇంత వ్యతిరేకత ఎందుకు అనేది వైసీపీ మాట.
కానీ.. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని గమనిస్తే.. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు కూడా వైసీపీని రక్షిం చలేక పోయాయనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. ఈ ఉద్యోగులుకూడా వేతనాలు.. పనిభావం వంటి సమస్యలనుఎదుర్కొంటున్నారు.వీటిని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందనే వాదన ఉంది. ఈ క్రమంలోనే తాజా రిజల్ట్ వచ్చిందని మరికొందరు వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఎలా చూసినా.. ఇప్పుడు వ్యవస్థలపై నా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
This post was last modified on March 19, 2023 6:21 pm
రాజకీయంగా చైతన్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ. అటు క్రికెట్ అయినా.. ఇటు రాజకీయాలైనా.. తెలంగాణ లో హాట్ టాపిక్కే. ఇక్కడ…
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చేసిన రెండు సినిమాలతోనే చాలా ప్రామిసింగ్గా అనిపించిన వారసుల్లో ధ్రువ్ విక్రమ్ ఒకడు. అర్జున్…
సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసే సినిమాలో.. ఓ పెద్ద హీరో నటించినపుడు చిన్న సన్నివేశమైనా సరే సుక్కునే తీయాల్సి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే కమెడియన్లతో ఆమెకు మంచి…
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…