Political News

‘మూడు’కు మాడు ప‌గిలిన‌ట్టేనా?

వ‌చ్చే ఎన్నిక‌లలోపు.. మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేయాల‌ని..ముఖ్యంగా విశాఖ‌ను పాల‌నా రాజ‌ధానిని చేయాల‌ని భావిస్తున్న వైసీపీ.. ఉత్త‌రాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. బ‌లమైన సామాజిక వ‌ర్గానికి చెందిన సీతంరాజు సుధాక‌ర్‌ను ఇక్క‌డ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది. ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్క‌డం ద్వారా.. విశాఖ‌ను పాల‌న రాజ‌ధాని చేస్తామ‌న్న‌.. త‌మ‌కు ఇక్క‌డి ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలిపార నే వాద‌న‌ను వినిపించాల‌ని భావించింది.

ఒక‌వైపు న్యాయ‌స్థానాల ప‌రిధిలో ఉన్న రాజ‌ధాని విష‌యాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాలు కూడా వైసీపీ పాల‌కులు చేశారు. గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల త‌ర్వాత‌.. మూడు రాజ‌ధానుల‌ను ఎదిరించేవారు .. విమ‌ర్శించేవారి నోళ్ల‌కు తాళాలు ప‌డ‌తాయి! అని వైసీపీ నాయ‌కులు ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించారు. ఇక‌, దీనికి తోడు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌లోభాల‌కు తెర‌దీశార‌నే వాద‌న ఉండ‌నే ఉంది.

గ్రాడ్యుయేట్ ఓట‌ర్ల‌కు వెండి నాణేలు పంచ‌డం.. ఓటుకు రూ.5 వేల‌ నుంచి రూ.10 వేల‌వ‌ర‌కు పంచ‌డం కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. ఎన్నిక‌ల‌ను వైసీపీ కీల‌క నాయ‌కుడు వైవీ స‌బ్బారెడ్డి త‌న భుజాల‌పై వేసుకున్నారు. ఎట్టి ప‌రిస్తితిలోనూ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకోవాలని.. త‌ద్వారా.. పాల‌నా రాజ‌ధానికి ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్నార‌నే సంకేతాలు ఇవ్వాల‌ని ఆయ‌న అనుకున్నారు.

అయితే.. అనూహ్యంగా ఇక్క‌డ భారీ ఓట్ల తేడాతో వైసీపీ ఘోర‌ప‌రాజ‌యం పాలైంది. టీడీపీ అభ్య‌ర్థి చిరంజీవిరావు విజ‌యం ద‌క్కించుకున్నారు. కాదు.. కాదు.. గ్రాడ్యుయేట్లు గుండుగుత్త‌గా.. ఇక్క‌డ ఆయ‌న‌కే ఓటు వేయ‌డం ద్వారా.. వైసీపీ వ్యూహాన్ని వారు చిత్తు చేశార‌ని అంటున్నారుప‌రిశీల‌కులు. మూడు రాజ‌ధానుల తో విశాఖ‌లో అడుగులు వేయాల‌ని భావించి.. వైసీపీకి ఇది భారీ షాక్ కావ‌డం గ‌మ‌నార్హం.

దీనిని బ‌ట్టి.. విశాఖ పాల‌నా రాజ‌ధానిగా త‌మ‌కు అవ‌స‌రం లేద‌నే సంకేతాలు ఇక్క‌డి గ్రాడ్యుయేట్లు స్ప‌ష్టం చేసిన‌ట్టు అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ ఫ‌లితం త‌ర్వాతైనా.. వైసీపీ ప్ర‌భుత్వం మూడు జపం మాపేసి.. ప్ర‌జ‌ల నాడి ప్ర‌కారం రాజ‌ధాని విష‌యంలో న‌డుచుకుంటుంద‌నే భావ‌న ప్ర‌జాస్వామ్య వాదుల నుంచి వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 18, 2023 7:02 pm

Share

Recent Posts

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

49 minutes ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

51 minutes ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

2 hours ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

3 hours ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

3 hours ago

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

4 hours ago