Political News

‘మూడు’కు మాడు ప‌గిలిన‌ట్టేనా?

వ‌చ్చే ఎన్నిక‌లలోపు.. మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేయాల‌ని..ముఖ్యంగా విశాఖ‌ను పాల‌నా రాజ‌ధానిని చేయాల‌ని భావిస్తున్న వైసీపీ.. ఉత్త‌రాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. బ‌లమైన సామాజిక వ‌ర్గానికి చెందిన సీతంరాజు సుధాక‌ర్‌ను ఇక్క‌డ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది. ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్క‌డం ద్వారా.. విశాఖ‌ను పాల‌న రాజ‌ధాని చేస్తామ‌న్న‌.. త‌మ‌కు ఇక్క‌డి ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలిపార నే వాద‌న‌ను వినిపించాల‌ని భావించింది.

ఒక‌వైపు న్యాయ‌స్థానాల ప‌రిధిలో ఉన్న రాజ‌ధాని విష‌యాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాలు కూడా వైసీపీ పాల‌కులు చేశారు. గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల త‌ర్వాత‌.. మూడు రాజ‌ధానుల‌ను ఎదిరించేవారు .. విమ‌ర్శించేవారి నోళ్ల‌కు తాళాలు ప‌డ‌తాయి! అని వైసీపీ నాయ‌కులు ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించారు. ఇక‌, దీనికి తోడు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌లోభాల‌కు తెర‌దీశార‌నే వాద‌న ఉండ‌నే ఉంది.

గ్రాడ్యుయేట్ ఓట‌ర్ల‌కు వెండి నాణేలు పంచ‌డం.. ఓటుకు రూ.5 వేల‌ నుంచి రూ.10 వేల‌వ‌ర‌కు పంచ‌డం కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. ఎన్నిక‌ల‌ను వైసీపీ కీల‌క నాయ‌కుడు వైవీ స‌బ్బారెడ్డి త‌న భుజాల‌పై వేసుకున్నారు. ఎట్టి ప‌రిస్తితిలోనూ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకోవాలని.. త‌ద్వారా.. పాల‌నా రాజ‌ధానికి ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్నార‌నే సంకేతాలు ఇవ్వాల‌ని ఆయ‌న అనుకున్నారు.

అయితే.. అనూహ్యంగా ఇక్క‌డ భారీ ఓట్ల తేడాతో వైసీపీ ఘోర‌ప‌రాజ‌యం పాలైంది. టీడీపీ అభ్య‌ర్థి చిరంజీవిరావు విజ‌యం ద‌క్కించుకున్నారు. కాదు.. కాదు.. గ్రాడ్యుయేట్లు గుండుగుత్త‌గా.. ఇక్క‌డ ఆయ‌న‌కే ఓటు వేయ‌డం ద్వారా.. వైసీపీ వ్యూహాన్ని వారు చిత్తు చేశార‌ని అంటున్నారుప‌రిశీల‌కులు. మూడు రాజ‌ధానుల తో విశాఖ‌లో అడుగులు వేయాల‌ని భావించి.. వైసీపీకి ఇది భారీ షాక్ కావ‌డం గ‌మ‌నార్హం.

దీనిని బ‌ట్టి.. విశాఖ పాల‌నా రాజ‌ధానిగా త‌మ‌కు అవ‌స‌రం లేద‌నే సంకేతాలు ఇక్క‌డి గ్రాడ్యుయేట్లు స్ప‌ష్టం చేసిన‌ట్టు అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ ఫ‌లితం త‌ర్వాతైనా.. వైసీపీ ప్ర‌భుత్వం మూడు జపం మాపేసి.. ప్ర‌జ‌ల నాడి ప్ర‌కారం రాజ‌ధాని విష‌యంలో న‌డుచుకుంటుంద‌నే భావ‌న ప్ర‌జాస్వామ్య వాదుల నుంచి వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 18, 2023 7:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

4 minutes ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

3 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

4 hours ago

అమరావతిపై జగన్‌కు 5 ప్రశ్నలు..!

అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…

6 hours ago

జ‌గ‌న్ రోడ్డున ప‌డేస్తే.. కూట‌మి ఆదుకుంది!

వైసీపీ అధినేత జ‌గ‌న్ హ‌యాంలో ఓ కుటుంబం రోడ్డున ప‌డింది. కేవ‌లం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించి…

6 hours ago

కోనసీమకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…

6 hours ago