Political News

‘మూడు’కు మాడు ప‌గిలిన‌ట్టేనా?

వ‌చ్చే ఎన్నిక‌లలోపు.. మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేయాల‌ని..ముఖ్యంగా విశాఖ‌ను పాల‌నా రాజ‌ధానిని చేయాల‌ని భావిస్తున్న వైసీపీ.. ఉత్త‌రాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. బ‌లమైన సామాజిక వ‌ర్గానికి చెందిన సీతంరాజు సుధాక‌ర్‌ను ఇక్క‌డ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది. ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్క‌డం ద్వారా.. విశాఖ‌ను పాల‌న రాజ‌ధాని చేస్తామ‌న్న‌.. త‌మ‌కు ఇక్క‌డి ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలిపార నే వాద‌న‌ను వినిపించాల‌ని భావించింది.

ఒక‌వైపు న్యాయ‌స్థానాల ప‌రిధిలో ఉన్న రాజ‌ధాని విష‌యాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాలు కూడా వైసీపీ పాల‌కులు చేశారు. గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల త‌ర్వాత‌.. మూడు రాజ‌ధానుల‌ను ఎదిరించేవారు .. విమ‌ర్శించేవారి నోళ్ల‌కు తాళాలు ప‌డ‌తాయి! అని వైసీపీ నాయ‌కులు ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించారు. ఇక‌, దీనికి తోడు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌లోభాల‌కు తెర‌దీశార‌నే వాద‌న ఉండ‌నే ఉంది.

గ్రాడ్యుయేట్ ఓట‌ర్ల‌కు వెండి నాణేలు పంచ‌డం.. ఓటుకు రూ.5 వేల‌ నుంచి రూ.10 వేల‌వ‌ర‌కు పంచ‌డం కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. ఎన్నిక‌ల‌ను వైసీపీ కీల‌క నాయ‌కుడు వైవీ స‌బ్బారెడ్డి త‌న భుజాల‌పై వేసుకున్నారు. ఎట్టి ప‌రిస్తితిలోనూ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకోవాలని.. త‌ద్వారా.. పాల‌నా రాజ‌ధానికి ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్నార‌నే సంకేతాలు ఇవ్వాల‌ని ఆయ‌న అనుకున్నారు.

అయితే.. అనూహ్యంగా ఇక్క‌డ భారీ ఓట్ల తేడాతో వైసీపీ ఘోర‌ప‌రాజ‌యం పాలైంది. టీడీపీ అభ్య‌ర్థి చిరంజీవిరావు విజ‌యం ద‌క్కించుకున్నారు. కాదు.. కాదు.. గ్రాడ్యుయేట్లు గుండుగుత్త‌గా.. ఇక్క‌డ ఆయ‌న‌కే ఓటు వేయ‌డం ద్వారా.. వైసీపీ వ్యూహాన్ని వారు చిత్తు చేశార‌ని అంటున్నారుప‌రిశీల‌కులు. మూడు రాజ‌ధానుల తో విశాఖ‌లో అడుగులు వేయాల‌ని భావించి.. వైసీపీకి ఇది భారీ షాక్ కావ‌డం గ‌మ‌నార్హం.

దీనిని బ‌ట్టి.. విశాఖ పాల‌నా రాజ‌ధానిగా త‌మ‌కు అవ‌స‌రం లేద‌నే సంకేతాలు ఇక్క‌డి గ్రాడ్యుయేట్లు స్ప‌ష్టం చేసిన‌ట్టు అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ ఫ‌లితం త‌ర్వాతైనా.. వైసీపీ ప్ర‌భుత్వం మూడు జపం మాపేసి.. ప్ర‌జ‌ల నాడి ప్ర‌కారం రాజ‌ధాని విష‌యంలో న‌డుచుకుంటుంద‌నే భావ‌న ప్ర‌జాస్వామ్య వాదుల నుంచి వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

రణబాలి… చెప్పిన టైముకి రావాలి

ప్రేమికుల నుంచి నిజ జీవిత భార్యాభర్తలుగా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ప్యాన్ ఇండియా మూవీ…

1 hour ago

పెద్దికి రేట్లు లేకపోతేనే మంచిదా?

సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్‌లో మళ్లీ కళ తెచ్చే సినిమా అవుతుందని అందరూ ‘పెద్ది’ మీదే ఆశలు పెట్టుకున్నారు.…

8 hours ago

ప్రేమలు 2 ఆపేయడం మంచిదే

మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించిన మూవీ ప్రేమలు. దీంట్లో జంటగా నటించిన నస్లెన్, మమిత బైజు ఎంత…

9 hours ago

కంటెంట్ ఉంటే చాలు కోట్లలో కనకవర్షం

కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్ పట్టించుకోరని ప్రతి భాషలో రుజువవుతూనే ఉంది. మన దగ్గర బలగం,…

9 hours ago

పట్టపగలే కారు చీకట్లోకి బికనీర్!

సాంకేతికంగా మనిషి ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. వాటిని తన జీవన విధానంలో భాగం చేసుకున్నాడు. సుఖమయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే…

12 hours ago

వైసీపీ నేతలకు షాకిచ్చిన లేడీ ఆఫీసర్

ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…

13 hours ago