వైసీపీలో విజయసాయిరెడ్డి హవా తగ్గి మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి మాటే చెల్లుబాటు అవుతున్నట్లుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీలో జరుగుతున్న పరిణామాలూ అలాగే కనిపించాయి. విశాఖపట్నం ప్రాంత బాధ్యతలు సాయిరెడ్డి నుంచి తప్పించడం.. సోషల్ మీడియా బాధ్యతలు సాయిరెడ్డి నుంచి తప్పించి సజ్జల కొడుక్కు అప్పగించడం వంటివన్నీ దీనికి ఉదాహరణలుగా చెప్తారు. అంతకుముందులా సాయిరెడ్డి కూడా నిత్యం జగన్ వెంట కనిపించడం లేదు. దీంతో సాయిరెడ్డిని జగన్ దూరం పెట్టారని.. సజ్జలదే వన్ మ్యాన్ షో నడుస్తుందని పార్టీ వర్గాల నుంచి కూడా వినిపించింది.
అయితే.. సజ్జల ఎంతగా పవర్ సెంటర్లా మారినా కూడా ఆయన రాష్ట్రం వరకు.. పార్టీ వరకు మాత్రమేనని.. పార్టీకి వెలుపల రాజకీయం నడపాలన్నా, రాష్ట్రం బయట వ్యవహారం చేయాలన్నా ఆయన వల్ల సాధ్యం కాదని జగన్కు కూడా తెలుసంటారు. అందుకే… కీలకమైన పనులలో ఇప్పటికీ సాయిరెడ్డిపైనే జగన్ ఆధారపడుతున్నారట.
తాజాగా దిల్లీ పర్యటనకు వచ్చిన జగన్ పూర్తిగా విజయసాయిరెడ్డిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. పేరుకు పెద్దసంఖ్యలో ఎంపీలున్నప్పటికీ వారిలో ఎవరూ కూడా సాయిరెడ్డిలా కేంద్రంలోని బీజేపీ పెద్దల వద్ద యాక్సెస్ ఉన్నవారు లేరు. అంతెందుకు మీడియా సంబంధాలు కూడా వారికి అంతంతమాత్రమే. వైసీపీ ఎంపీల్లో 90 శాతం మందికి పార్లమెంటులో తమ పక్క సీటులో కూర్చున్నవారు తప్ప వేరేవారితో పరిచయమే లేదు. కేంద్ర మంత్రులను కలిసిన అనుభవమే లేదు. కారణమేదైనా జగన్ హఠాత్తుగా దిల్లీ వచ్చి ప్రధాని నుంచి కేంద్ర మంత్రుల వరకు వేర్వేరు నేతలను కలిసే పని పెట్టుకోగా సాయిరెడ్డి ఆఘమేఘాలమీద అన్ని ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు.
జగన్ దిల్లీ నుంచి వెళ్లిపోయాక కూడా జగన్ ఎవరెవరితో భేటీ అయ్యారో.. ఏమేం పనులకోసం వచ్చారో అదంతా ఫాలో అప్ చేసుకునే బాధ్యతా సాయిరెడ్డిదే. అంతెందుకు ఏపీకి డబ్బుల కోసం రాష్ట్ర అర్ధిక మంత్రి బుగ్గన దిల్లీకి వచ్చినా కూడా సాయిరెడ్డి సపోర్టు లేకుండా ఆయన ఏమీ సాధించలేని పరిస్థితి. అందుకే సాయిరెడ్డి ఇప్పటికీ వైసీపీకి మోస్ట్ డిపెండబుల్ అంటున్నారు ఆయన వర్గం నేతలు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…