ప్రత్యేక తెలంగాణా ఉద్యమసారధి ఎవరు ? సమైక్య రాష్ట్రం రెండుగా విడిపోవటానికి కారణం ఎవరు ? ఈ ప్రశ్నలను ఎవరిని అడిగినా వెంటనే కేసీయార్ అనే సమాధానమిస్తారు. కానీ ఈమధ్యనే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకున్న తోట చంద్రశేఖర్ మాత్రం విచిత్రమైన విషయం చెప్పారు. తోట చెప్పిన తాజా విషయంతో కేసీయార్ గాలి తీసేసినట్లయ్యింది. బీఆర్ఎస్ లోకి కొందరు నేతలు జాయిన్ అయ్యారు.
ఆ సందర్భంగా తోట మాట్లాడుతు రాష్ట్రం విడిపోవటానికి అందరు అనుకునేట్లుగా కేసీయార్ చేసిన ఉద్యమాలు కాదట. కాంగ్రెస్ చేసిన కుట్ర రాజకీయాలకు బీజేపీ సహకరించటం వల్లే సమైక్య రాష్ట్రం రెండుగా విడిపోయిందట. కాంగ్రెస్-బీజేపీ పార్టీలు కలిసే రాష్ట్రాన్ని విడగొట్టాయని తోట స్పష్టంగా ప్రకటించారు. మరింత కాలం చావునోట్లో తలపెట్టి నిరాహారదీక్షలు చేసి ప్రత్యేక తెలంగాణాను సాధించానని కేసీయార్ చేసుకుంటున్నదంతా ఉత్త బిల్డప్పులు మాత్రమే అని తేలిపోయింది.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో కానీ రాష్ట్రం విడిపోవటానికి అందరు అనుకుంటున్న కారణాలు తోటకు మాత్రం భిన్నంగా ఎందుకు కనిపించింది ? రాష్ట్రం విడిపోవటానికి కేసీయార్ కారణం కాదని తోట ఎందుకు చెబుతున్నారు ? నిర్భయంగా తోట ఇంత అబద్ధాలు చెపుబుతున్నారంటేనే విషయం అర్ధమైపోతోంది. కేసీయార్ మీద ఏపీ జనాలు బాగా మండుతున్న విషయం తోటకు అర్ధమయ్యుంటుంది. జనాల్లోని ఆ మంటను తగ్గించటం కోసమే రాష్ట్ర విభజనకు కేసీయార్ కు సంబంధంలేదని, ఆ పాపమంతా కాంగ్రెస్, బీజేపీదే అని తప్పుడు మాటలు చెప్పగలుగుతున్నారు.
రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీఆర్ఎస్ ఏదో చేసేస్తుందని కేసీయార్ అనుకుంటున్నట్లున్నారు. కేసీయార్ ఆలోచనలు నిజం కావాలంటే తోటే పూర్తి బాధ్యత తీసుకోవాలి. కానీ తోటకు అంత సీన్ లేదు. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా అపాయింట్ అయ్యేంతవరకు తోట ఎవరో చాలామందికి తెలీదు. అందుకనే జనాల దృష్టిని ఆకర్షించేందుకు, నలుగురి నోళ్ళల్లో నానేందుకు తోట ఇలాంటి అబద్ధాలను మొదలుపెట్టారు. తాను అబద్ధాలు చెప్పటం ఏమిటో తెలీదుకానీ కేసీయార్ గాలి తీసేస్తున్నట్లు గ్రహించలేకపోయారు.
This post was last modified on March 17, 2023 10:37 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…