ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలలో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన్ను పలకరించగా ఆయన కూడా వారితో సరదాగా మాట్లాడారు. మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీ లాబీల్లో బాలయ్యను చూసి వచ్చి పలకరించారు. ఏం హీరోగారూ అంటూ బాలకృష్ణను మంత్రి బొత్స అభివాదం చేశారు.
మరోవైపు మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ కూడా బాలయ్య వద్దకు వచ్చి పలకరించి వెళ్లారు. ఈ సందర్భంగా బాలకృష్ణ గుడివాడ అమర్నాథ్తో సరదాగా సెటైర్లు వేశారు. ‘ఈరోజు కోటు వేసుకుని రాలేదా?’ అంటూ అమర్నాథ్తో అనగా ఆయన కూడా స్పోర్టివ్గా తీసుకుని సరదాగా నవ్వేశారు.
అంబటి రాంబాబు, బాలయ్య సరదాగా నవ్వుకుంటూ కాసేపు మాట్లాడడం కనిపించింది. అంబటి రాంబాబే స్వయంగా బాలయ్య వద్దకు రాగా ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. వైసీపీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు బాలయ్య వద్దకు వచ్చి మర్యాదపూర్వకంగా పలకరించి వెళ్లారు.
అదే సమయంలో తాజా రాజకీయాలు, రోడ్ల పరిస్థితి పైన ఆయన ఆరా తీశారు. అసెంబ్లీకి వెళ్లే రహదారిని పరిశీలించారు. అమరావతిలో దెబ్బతిన్న రోడ్లను చూస్తుంటే బాధగా ఉందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. వీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు.
మరోవైపు బడ్జెట్ సమావేశాలలో ఈ రోజ మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్, కుతూహలమ్మ, పాకలపాటి సర్రాజు, మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల మృతికి సభ సంతాపం తెలిపింది. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు.
This post was last modified on March 16, 2023 2:13 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…