దిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో తలపడుతున్నారు. ఈ రోజు(మార్చ్ 16) ఆమె ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా తన తరఫున తన ప్రతినిధిగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ను పంపించారు. అనారోగ్య కారణాల వల్ల రాలేకపోతున్నానని.. మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానం ఇదే అంటూ తన ప్రతినిధితో ఈడీ అధికారులకు లేఖ పంపారు. సుప్రీంకోర్టులో పిటీషన్ పెండింగ్ లో ఉందని.. కోర్టు నిర్ణయం తర్వాత హాజరవుతానని లేఖలో స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే… కవిత లేఖపై స్పందించిన ఈడీ విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఉత్కంఠ ఏర్పడింది.
దిల్లీలోనే ఉన్న కవిత బుధవారం సాయంత్రం వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకే ఈడీ అధికారుల ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే… గురువారం ఉదయం నుంచే ఆమె తన న్యాయవాదులతో సుదీర్ఘంగా చర్చించారు.అనంతరం ఈడీ ప్రశ్నలకు సమాధానాలను లేఖ ద్వారా పంపించాలని నిర్ణయించారు.
కాగా… కవితకు మద్దతుగా బీఆర్ఎస్ మంత్రులు అయిదుగురు దిల్లీలోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు లాయర్లతో వారు చర్చలు జరుపుతున్నారు. కవిత పంపిన లేఖపై ఈడీ అధికారుల స్పందనేంటనేది చూడాలి. కాగా దిల్లీలోని కవిత నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి 10 నిమిషాలలో చేరుకోవచ్చు.. కానీ, ఆమె తన తరఫున ప్రతినిధిని పంపించడంతో.. ఈడీతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది.
This post was last modified on March 16, 2023 1:39 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…