Political News

‘టీడీపీ – బీజేపీ – ఇండిపెండెంట్‌’

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు గ్రాఫ్ పెరిగిందా? త‌రిగిందా? ఏం జ‌రుగుతోంది? ఇదీ.. ఇప్పుడు ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న కీల‌క‌ చ‌ర్చ‌. దీనికి కార‌ణం .. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు ఉన్నాయి. ఆయ‌న టీడీపీ త‌ర‌ఫున పోటీ చేస్తార‌ని తెలుస్తోంది. జ‌న‌సేన‌-టీడీపీ పొత్తు ఉన్న‌ప్ప‌టికీ.. న‌ర‌సాపురం టికెట్‌ను మాత్రం టీడీపీకే కేటాయిస్తార‌ని స‌మాచారం.

టీడీపీ త‌ర‌ఫున తాను పోటీచేయ‌నున్న‌ట్టు చూచాయ‌గా స‌ద‌రు ఎంపీ చెబుతున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు ఇప్పుడు ఎంపీ ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న పోటీకి దిగితే నిలిచి గెలిచే ప‌రిస్థితి ఉందా? అనేది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో ఎంపీని అస‌లు రాష్ట్రంలోకే అడుగు పెట్ట‌కుండా.. వైసీపీ అధినాయ‌క‌త్వం ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని.. స‌ద‌రు ఎంపీనే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

త‌నను హైద‌రాబాద్ వ‌స్తేనే వెంటాడుతున్నార‌ని ర‌ఘురామ చెబుతున్నారు. స‌రే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న ఏ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసినా ప్రచారం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై నే అనేక సందేహాలు వ‌స్తున్నాయి. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం క్ష‌త్రియ సామాజిక వ‌ర్గంలో ర‌ఘురామ‌పై సానుభూతి ఉంది. ఆయ‌న ప‌ట్ల వారు సానుకూలంగానే ఉన్నారు.

అయితే, ఎన్నిక‌ల నాటికి క్ష‌త్రియుల‌ను కూడా ఓటు బ్యాంకు రూపంలో చీల్చే ప్ర‌య‌త్నాలు జోరుగా సాగుతుండ‌డం.. ఇక్క‌డ వైసీపీకి అనుకూలంగా పావులు క‌దుపుతుండ‌డం ఎంపీ విష‌యంపై చ‌ర్చ‌కు దారితీస్తోంది. పైగా.. గ‌తంలో టీడీపీ ఇక్క‌డ గెలిచిన ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు ర‌ఘురామ టీడీపీ త‌ర‌ఫున పోటీకి దిగితే.. సానుకూల ప‌వ‌నాలు ఏమేర‌కు ఉంటాయ‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్టీ త‌ర‌ఫున కాకుండా.. ఆయ‌న ఒంట‌రిగానే బ‌రిలోకి దిగితే.. సానుభూతి వ‌స్తుందని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on March 16, 2023 1:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

12 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

56 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago