Political News

‘టీడీపీ – బీజేపీ – ఇండిపెండెంట్‌’

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు గ్రాఫ్ పెరిగిందా? త‌రిగిందా? ఏం జ‌రుగుతోంది? ఇదీ.. ఇప్పుడు ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న కీల‌క‌ చ‌ర్చ‌. దీనికి కార‌ణం .. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు ఉన్నాయి. ఆయ‌న టీడీపీ త‌ర‌ఫున పోటీ చేస్తార‌ని తెలుస్తోంది. జ‌న‌సేన‌-టీడీపీ పొత్తు ఉన్న‌ప్ప‌టికీ.. న‌ర‌సాపురం టికెట్‌ను మాత్రం టీడీపీకే కేటాయిస్తార‌ని స‌మాచారం.

టీడీపీ త‌ర‌ఫున తాను పోటీచేయ‌నున్న‌ట్టు చూచాయ‌గా స‌ద‌రు ఎంపీ చెబుతున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు ఇప్పుడు ఎంపీ ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న పోటీకి దిగితే నిలిచి గెలిచే ప‌రిస్థితి ఉందా? అనేది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో ఎంపీని అస‌లు రాష్ట్రంలోకే అడుగు పెట్ట‌కుండా.. వైసీపీ అధినాయ‌క‌త్వం ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని.. స‌ద‌రు ఎంపీనే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

త‌నను హైద‌రాబాద్ వ‌స్తేనే వెంటాడుతున్నార‌ని ర‌ఘురామ చెబుతున్నారు. స‌రే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న ఏ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసినా ప్రచారం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై నే అనేక సందేహాలు వ‌స్తున్నాయి. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం క్ష‌త్రియ సామాజిక వ‌ర్గంలో ర‌ఘురామ‌పై సానుభూతి ఉంది. ఆయ‌న ప‌ట్ల వారు సానుకూలంగానే ఉన్నారు.

అయితే, ఎన్నిక‌ల నాటికి క్ష‌త్రియుల‌ను కూడా ఓటు బ్యాంకు రూపంలో చీల్చే ప్ర‌య‌త్నాలు జోరుగా సాగుతుండ‌డం.. ఇక్క‌డ వైసీపీకి అనుకూలంగా పావులు క‌దుపుతుండ‌డం ఎంపీ విష‌యంపై చ‌ర్చ‌కు దారితీస్తోంది. పైగా.. గ‌తంలో టీడీపీ ఇక్క‌డ గెలిచిన ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు ర‌ఘురామ టీడీపీ త‌ర‌ఫున పోటీకి దిగితే.. సానుకూల ప‌వ‌నాలు ఏమేర‌కు ఉంటాయ‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్టీ త‌ర‌ఫున కాకుండా.. ఆయ‌న ఒంట‌రిగానే బ‌రిలోకి దిగితే.. సానుభూతి వ‌స్తుందని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

9 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

15 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

29 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago