Political News

ఏపీకి అప్పులు ఇవ్వొద్దు.. ఇచ్చినా జాగ్ర‌త్త‌: కాగ్ హెచ్చ‌రిక‌లు

ఏపీ ప‌రువు మంట‌గ‌లిసిపోయింది. దేశంలో ఏ రాష్ట్రానికీ.. ప‌ట్ట‌ని దుస్థితి ప‌ట్టింది. ఏపీకి అప్పులు ఇవ్వొద్ద‌ని.. ఇచ్చినా.. ఇవ్వాల‌ని అనుకున్నా..ఒక‌టికి ప‌ది సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్లాల‌ని.. ఆ త‌ర్వాత మీ కొంప‌లే మునిగిపోయినా.. ఎవ‌రూ కాపాడ‌లేర‌ని కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్‌(కాగ్‌) తాజాగా కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. 2021 మార్చి నెల చివరి వరకు ఏపీ ఆర్థిక వ్యవస్థను విశ్లేషించింది.

అంటే, 2019-21 మ‌ధ్య రెండేళ్ల నాటి పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రిజర్వు బ్యాంకు కూడా అనేక అంశాలను తప్పుబట్టింది. ఏపీకి అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వివిధ బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించింది. రుణాలను భరించే సామర్థ్యం ఏపీకి లేదని.. రుణం తీసుకుని పాత అప్పులు తీరుస్తున్నారని కాగ్‌ ఆక్షేపించింది.

తీసుకున్న రుణాలను ఆస్తుల సృష్టికి, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించాలని.. రుణాలపై వడ్డీలు చెల్లించేందుకు, రోజు గడిచేందుకు అప్పు తీసుకోవడం ఆర్థిక అస్థిరతకు దారితీస్తుందని హెచ్చరించిం ది. 2020-21 ఆర్థిక సంవత్సరం చివరికి మొత్తం బకాయిలు జీఎస్డీపీలో 35 శాతానికి మించకూడదని ఎఫ్ఆర్బీఎమ్ చట్టం చెబుతున్నా.. ఏపీ అప్పులు మాత్రం 35.30శాతం ఉన్నాయని తేల్చింది.

బడ్జెట్‌లో చూపించకుండా బయటి నుంచి తీసుకునే రుణాలనూ పరిగణిస్తే ఇది 44.04 శాతం అవుతుందని స్పష్టం చేసింది. 2021 మార్చి 31 నాటికి ఉన్న పరిస్థితుల ప్రకారం రాబోయే ఏడు సంవత్సరాలలో 45.74 శాతం అంటే.. లక్షా 23వేల 640 కోట్ల రూపాయల అప్పులు తీర్చాలని స్పష్టం చేసింది. దీనికి సరైన వ్యూహం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తగ్గిపోతాయని రాష్ట్రాన్ని కాగ్‌ హెచ్చరించింది.

ప్రతి సంవత్సరం రాష్ట్ర అప్పులు పెరుగుతూనే ఉన్నాయని కాగ్ హెచ్చ‌రించింది. రెవెన్యూ వ్యయాన్ని భరించేందుకు రుణాల మొత్తాన్ని ప్రభుత్వం వాడుకుంటోందని విశ్లేషించింది. తీసుకున్న రుణాల్లో 81శాతం రెవెన్యూ ఖర్చులకే వాడుతోంద‌ని, దీంతో ఆదాయం కొర‌వ‌డుతోంద‌ని హెచ్చ‌రించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు వ్య‌వ‌హ‌రించాల‌ని తేల్చి చెప్పింది.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

6 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

7 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

8 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

8 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

9 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

9 hours ago