Political News

ట్రెండింగ్‌లో ‘జస్టిస్‌ ఫర్‌ వైఎస్‌ వివేకా’

సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్టర్‌లో “జస్టిస్‌ ఫర్‌ వైఎస్‌ వివేకా” హ్యాష్‌ ట్యాగ్ భారీగా ట్రెండ్ అవుతోంది. ప్ర‌స్తుతం ఇది ట్రెండింగ్‌లో 8వ ప్లేస్‌లో ఉంది. సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురై నేటితో నాలుగు సంవత్సరాలు పూర్తవుతుండగా.. ఆయ‌న కుటుంబానికి, ముఖ్యంగా డాక్ట‌ర్ సునీత‌కు న్యాయం చేయాలని నెటిజన్లు ట్వీట్‌లు చేస్తున్నారు. జ‌స్టిస్ ఫర్ వైఎస్‌ వివేకా ట్యాగ్‌తో వేల సంఖ్యలో నెటిజెన్లు సందేశాలను పెడుతున్నారు.

మ‌రోవైపు మరోవైపు టీడీపీ నేతలు కూడా ట్వీట్ల రూపంలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే(మాజీ వైసీపీ నాయ‌కుడు) గొట్టిపాటి ర‌వి విభిన్నంగా స్పందించారు. సినిమా రిలీజ్ అవ్వకముందే కథ మొత్తం చెప్పగలిగేవాడు డైరెక్టర్ మాత్రమే కదా అంటూ వివేకా హత్యపై అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఆసక్తికర ట్వీట్‌ చేశారు.

4 ఏళ్లుగా విచారణ చేస్తున్న సీబీఐ కూడా వివేకా హత్య జరిగిన రోజు జగన్ మోహన్ రెడ్డి చెప్పినంత క్లుప్తంగా చెప్పలేకపోయిందన్నారు. కానీ హత్య జరిగిన నాడే అంత వివరంగా జగన్ ఎలా చెప్పారని ప్రశ్నించారు. వివేకా హత్య జరిగిన రోజు జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం వీడియోను గొట్టిపాటి రవి తన ట్వీట్కి జత చేశారు.

వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా చంపేసిన హంతకులే నాలుగు సంవత్సరాలుగా నాలుగు కట్టుకథలు వినిపించారని నారా లోకేష్ అన్నారు. బాబాయ్ హత్య కేసులో సీబీఐని బెదిరిస్తూ, దర్యాప్తుకి ఆటంకం కలిగిస్తున్న అసలు నిందితులైన అబ్బాయిలని అరెస్టు చేసి.. వివేకానందరెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన పాద‌యాత్ర‌లో డిమాండ్‌ చేశారు.

This post was last modified on March 15, 2023 3:07 pm

Share

Recent Posts

గవర్నర్ విందుకు హాజరు కాలేని పవన్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కాకినాడ లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయనకు తీవ్ర…

7 minutes ago

విజయ్, త్రిషల గోల మళ్లీ మొదలు!

తమిళనాడు సీఎం విజయ్, సినీ నటి త్రిషల మధ్య రిలేషన్ షిప్ గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న సంగతి…

46 minutes ago

ఓజి విలన్ రొట్టె విరిగి నేతిలో పడింది

బాలీవుడ్ ఖాన్ల ప్రభంజనంలో తనకంటూ ఒక ఉనికిని దక్కించుకున్న హీరో ఇమ్రాన్ హష్మీ. ఒకప్పుడు మంచి హిట్లతో ముద్దుల వీరుడిగా…

1 hour ago

గుంటూరుపై వైసీపీ పూర్తి పట్టు కోల్పోయినట్టేనా?

గుంటూరులోని తూర్పు, ప‌డ‌మ‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ త‌న ప్ర‌భావం, ప్రాభవం కూడా కోల్పోయింది. రెండున్న‌రేళ్ల కాలంలో పార్టీ ఘోరంగా దెబ్బ‌తింద‌న్న…

1 hour ago

‘ఫ్రీ బస్సు’లో ఎన్డీఏకు చేరువవుతున్న మహిళలు

ఏపీలోని నిర్దేశిత ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోన్న…

1 hour ago

అభిమాని ఆఖరిచూపుకు స్టార్ హీరో ఎందుకు వెళ్లలేదు

'టాక్సిక్' రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న కన్నడ స్టార్ యశ్ వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఇక రీసెంట్ ఒక…

4 hours ago