ఏపీ సీఎం జగన్ను టీడీపీ అధినేత చంద్రబాబు దుమ్ము దులిపేశారు. మాజీ మంత్రి జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నాలుఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన ఆయన జగన్పై విరుచుకుపడ్డారు. “జస్టిస్ ఫర్ వివేకా” అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. వివేకా హత్య జగనాసుర రక్త చరిత్ర అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలుసని నిప్పులు చెరిగారు.
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రంలో ఒక్క పనీ చేయలేక పోయారని… చివరకు సొంత బాబాయ్ హత్య కేసులో నిజమైన నిందితులను శిక్షించడంతో సహా అంటూ ఎద్దేవా చేశారు. వివేకా హత్య జగనాసుర రక్త చరిత్రే అని పులివెందుల పూల అంగళ్ల సెంటర్ నుంచి రాష్ట్రంలో ప్రతి ఇంటా తెలుసని… అది ఆ ఇంట జరిగిన కుట్రే అని అన్నారు.
“తండ్రి శవం పక్కన ఉండగానే పదవి కోసం సంతకాలు సేకరించిన వ్యక్తి… బాబాయ్ హత్యతో రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి…. ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా?” అంటూ వివేకా హత్య పరిణామాలపై చంద్రబాబు ట్వీట్ చేశారు. తాజాగా వివేకా కుమార్తె సునీత తన కుటుంబసభ్యులే తనకు న్యాయం చేయడం లేదంటూ.. మీడియా ముందు వాపోయారు. తనకు కుటుంబ సభ్యులంటే ఎంతో ప్రేమ ఉందని.. కానీ.. వారి వల్ల తన ప్రాణమైన తండ్రిని పోగొట్టుకున్నానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే చంద్రబాబు జగన్పై విరుచుకుపడడం గమనార్హం.
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…