Political News

సిగ్నల్ ఇచ్చిన జగన్.. ముగ్గురు మంత్రులు అవుట్?

ఏపీ కేబినెట్ సమావేశం తరువాత సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో మంత్రులలో దడ మొదలైంది. ఎలక్షన్లకు ఏడాది ముందు తమ పదవులు ఊడితే జనాలకు ముఖం ఎలా చూపించాలా అని ఆందోళన చెందుతున్నారు.

బడ్జెట్ సమావేశాలకు ముందు నిర్వహించిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా సీఎం జగన్ తన మంత్రులలో కొందరిని గట్టిగా హెచ్చరించారు. పనితీరు బాగులేదంటూ ఆయన ఆగ్రహించారు. నాలుగేళ్లలో మనం ఏ చేశామో చెప్పడమే కాదు ప్రతిపక్షాల విమర్శలను బలంగా తిప్పికొట్టాలని.. ఆ పనిచేయలేని మంత్రులకు తన కేబినెట్లో స్థానం ఉండదని జగన్ అన్నట్లు చెప్తున్నారు. శాఖాపరమైన పనితీరు, పార్టీకి ఉపయోగపడుతున్న తీరు రెండూ బేరీజు వేసుకుని మంత్రివర్గంలో ఉంచాలో వద్దో నిర్ణయిస్తామని జగన్ అన్నారట.

దీంతో జగన్ కేబినెట్ నుంచి ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులకు ఎసరు తప్పదని వైసీపీలో వినిపిస్తోంది. ప్రధానంగా రెండు పేర్లు వైసీపీ వర్గాలలో వినిపిస్తున్నాయి. రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌లకు ఉద్వాసన తప్పదని వైసీసీ నేతలు చెప్తున్నారు.

అయితే… వీరి స్థానంలో ఎవరు వస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాడిశెట్టి రాజా స్థానంలో తోట త్రిమూర్తులను, వేణుగోపాల్ స్థానంలో కవురు శ్రీనివాస్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఇకపోతే మర్రి రాజశేఖర్‌కు కూడా మంత్రి పదవి ఇవ్వాలని జగన్ అనుకుంటుండడంతో ఆయన్ను కూడా తీసుకుంటారని చెప్తున్నారు. మర్రి రాజశేఖర్‌కు కేబినెట్లో స్థానం కల్పించేందుకు గాను విడదల రజినిని తప్పిస్తారని తెలుస్తోంది. ఇద్దరూ ఒకే ప్రాంతానికిచెందిన నేతలు కావడంతో రజినిని డ్రాప్ చేసి మర్రిని తీసుకుంటారని తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో కులాల లెక్కల ప్రకారం కూడా రజిని కంటే మర్రి సరైన ఆప్షన్ అని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు.

This post was last modified on March 15, 2023 11:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

1 hour ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

5 hours ago