ఏపీ సీఎం జగన్ చిన్నాన్న.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నేటికి 4 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇదే రోజున 2019 తెలతెల వారుతుండగా.. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వివేకా మరణంపై ఉలిక్కిపడ్డాయి. తొలుత రెండు మూడు గంటల పాటు అసలు ఏం జరిగిందనే విషయంపై ఒక ప్రత్యేక సందిగ్ధావస్థ నెలకొంది. ఓ వర్గం టీవీ.. గుండెపోటు అని ప్రచారం చేసింది. కానీ, రెండు గంటలు గడిచిన తర్వాత.. మాత్రమే అది దారుణ హత్య అని తేలింది.
సరే.. వివేకా 4వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుమార్తె, ప్రముఖ వైద్యురాలు సునీత ఆయన సమాధి వద్ద ఘన నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను తన తండ్రి హత్యపై ఎందుకు పోరాటం చేస్తున్నదీ వివరించారు. తన తండ్రి హత్య జరిగితే.. సొంత కుటుంబ సభ్యులే(పేరు చెప్పలేదు) తేలికగా తీసుకున్నారని.. కనీసం జాలి కూడా చూపించలేదన్నారు. అంతేకాదు.. ఇవన్నీ రాయలసీమలో కామనే! అని వ్యాఖ్యానించినట్టు చెప్పారు.
ఇదే తనలో పౌరుషం పెంచిందన్నారు. ఇది కామన్ కాదు.. పక్కా వ్యూహంతోనే జరిగిందని భావించి.. అనేక రూపాల్లో విచారణకు ప్రయత్నించానని.. కానీ, చివరకు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. ఇక, ఏపీ ప్రభుత్వం ఈ విచారణలో జోక్యం చేసుకోవద్దని ఆమె మరోసారి విన్నవించారు. ఈ హత్య వెనుక నిజానిజాలు తెలియాల్సి ఉందని.. నిగ్గు తేలితే తప్ప.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండవని చెప్పారు.
తనకు ఉన్న అన్ని సందేహాలను అఫిడవిట్ రూపంలో కోర్టుకు వివరించినట్టు తెలిపారు. అదేవిధంగా సీబీఐ కి కూడా సహకరిస్తున్నట్టు చెప్పారు. “నా సొంత కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు చేశాను. ఇది నాకు కూడా బాధగానే ఉంది. కానీ, వారు మానాన్న ను అత్యంత కిరాతకంగా చంపేశారు. అందుకే నిజాలు తెలియాలి.. మాపై ఉన్న ఆరోపణలు పోవాలనే ఉద్దేశంతో నే న్యాయపోరాటానికి దిగాను” అని సునీత అన్నారు.
This post was last modified on March 15, 2023 11:43 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…