ఏపీ సీఎం జగన్ చిన్నాన్న.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నేటికి 4 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇదే రోజున 2019 తెలతెల వారుతుండగా.. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వివేకా మరణంపై ఉలిక్కిపడ్డాయి. తొలుత రెండు మూడు గంటల పాటు అసలు ఏం జరిగిందనే విషయంపై ఒక ప్రత్యేక సందిగ్ధావస్థ నెలకొంది. ఓ వర్గం టీవీ.. గుండెపోటు అని ప్రచారం చేసింది. కానీ, రెండు గంటలు గడిచిన తర్వాత.. మాత్రమే అది దారుణ హత్య అని తేలింది.
సరే.. వివేకా 4వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుమార్తె, ప్రముఖ వైద్యురాలు సునీత ఆయన సమాధి వద్ద ఘన నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను తన తండ్రి హత్యపై ఎందుకు పోరాటం చేస్తున్నదీ వివరించారు. తన తండ్రి హత్య జరిగితే.. సొంత కుటుంబ సభ్యులే(పేరు చెప్పలేదు) తేలికగా తీసుకున్నారని.. కనీసం జాలి కూడా చూపించలేదన్నారు. అంతేకాదు.. ఇవన్నీ రాయలసీమలో కామనే! అని వ్యాఖ్యానించినట్టు చెప్పారు.
ఇదే తనలో పౌరుషం పెంచిందన్నారు. ఇది కామన్ కాదు.. పక్కా వ్యూహంతోనే జరిగిందని భావించి.. అనేక రూపాల్లో విచారణకు ప్రయత్నించానని.. కానీ, చివరకు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. ఇక, ఏపీ ప్రభుత్వం ఈ విచారణలో జోక్యం చేసుకోవద్దని ఆమె మరోసారి విన్నవించారు. ఈ హత్య వెనుక నిజానిజాలు తెలియాల్సి ఉందని.. నిగ్గు తేలితే తప్ప.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండవని చెప్పారు.
తనకు ఉన్న అన్ని సందేహాలను అఫిడవిట్ రూపంలో కోర్టుకు వివరించినట్టు తెలిపారు. అదేవిధంగా సీబీఐ కి కూడా సహకరిస్తున్నట్టు చెప్పారు. “నా సొంత కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు చేశాను. ఇది నాకు కూడా బాధగానే ఉంది. కానీ, వారు మానాన్న ను అత్యంత కిరాతకంగా చంపేశారు. అందుకే నిజాలు తెలియాలి.. మాపై ఉన్న ఆరోపణలు పోవాలనే ఉద్దేశంతో నే న్యాయపోరాటానికి దిగాను” అని సునీత అన్నారు.
ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…
పెద్ది ప్రీమియర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ వచ్చేసింది. రాత్రి 8…
దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేసింది. కేవలం పది రోజుల్లోపే ఈ ఫీట్ సాధించడం అనూహ్యం.…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాలకు కొత్తే. సినిమా నటుడిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్…