Political News

మా నాన్న హ‌త్య‌ను.. ‘కామ‌న్’ అన్నారు: సునీత

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య జ‌రిగి నేటికి 4 సంవ‌త్స‌రాలు పూర్తయ్యాయి. ఇదే రోజున 2019 తెల‌తెల వారుతుండ‌గా.. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వివేకా మ‌ర‌ణంపై ఉలిక్కిప‌డ్డాయి. తొలుత రెండు మూడు గంట‌ల పాటు అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యంపై ఒక ప్ర‌త్యేక సందిగ్ధావ‌స్థ నెల‌కొంది. ఓ వ‌ర్గం టీవీ.. గుండెపోటు అని ప్ర‌చారం చేసింది. కానీ, రెండు గంట‌లు గడిచిన త‌ర్వాత‌.. మాత్రమే అది దారుణ హ‌త్య అని తేలింది.

స‌రే.. వివేకా 4వ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న కుమార్తె, ప్ర‌ముఖ వైద్యురాలు సునీత ఆయ‌న స‌మాధి వ‌ద్ద ఘ‌న నివాళుల‌ర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను త‌న తండ్రి హ‌త్య‌పై ఎందుకు పోరాటం చేస్తున్న‌దీ వివ‌రించారు. త‌న తండ్రి హ‌త్య జ‌రిగితే.. సొంత కుటుంబ స‌భ్యులే(పేరు చెప్ప‌లేదు) తేలికగా తీసుకున్నార‌ని.. క‌నీసం జాలి కూడా చూపించ‌లేద‌న్నారు. అంతేకాదు.. ఇవ‌న్నీ రాయ‌లసీమ‌లో కామ‌నే! అని వ్యాఖ్యానించిన‌ట్టు చెప్పారు.

ఇదే త‌న‌లో పౌరుషం పెంచింద‌న్నారు. ఇది కామ‌న్ కాదు.. ప‌క్కా వ్యూహంతోనే జ‌రిగింద‌ని భావించి.. అనేక రూపాల్లో విచార‌ణకు ప్ర‌య‌త్నించాన‌ని.. కానీ, చివ‌ర‌కు కోర్టును ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు. ఇక‌, ఏపీ ప్ర‌భుత్వం ఈ విచార‌ణ‌లో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని ఆమె మ‌రోసారి విన్న‌వించారు. ఈ హ‌త్య వెనుక నిజానిజాలు తెలియాల్సి ఉంద‌ని.. నిగ్గు తేలితే త‌ప్ప‌.. భవిష్య‌త్తులో ఇలాంటివి జ‌ర‌గ‌కుండా ఉండ‌వ‌ని చెప్పారు.

త‌న‌కు ఉన్న అన్ని సందేహాల‌ను అఫిడ‌విట్ రూపంలో కోర్టుకు వివ‌రించిన‌ట్టు తెలిపారు. అదేవిధంగా సీబీఐ కి కూడా స‌హ‌క‌రిస్తున్న‌ట్టు చెప్పారు. “నా సొంత కుటుంబ స‌భ్యుల‌పైనే ఆరోప‌ణ‌లు చేశాను. ఇది నాకు కూడా బాధ‌గానే ఉంది. కానీ, వారు మానాన్న ను అత్యంత కిరాత‌కంగా చంపేశారు. అందుకే నిజాలు తెలియాలి.. మాపై ఉన్న ఆరోప‌ణ‌లు పోవాల‌నే ఉద్దేశంతో నే న్యాయ‌పోరాటానికి దిగాను” అని సునీత అన్నారు.

This post was last modified on March 15, 2023 11:43 am

Share
Show comments
Published by
satya

Recent Posts

తమన్నా రాశిఖన్నా ‘బాక్’ రిపోర్ట్

ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు కొన్ని బాగానే వర్కౌట్ చేసుకున్న నేపథ్యంలో బాక్ అరణ్‌మనై 4 మీద కాస్తో కూస్తో…

6 mins ago

వరలక్ష్మి ‘శబరి’ ఎలా ఉంది

తమిళ నటే అయినప్పటికీ తెలుగులోనూ పలు బ్లాక్ బస్టర్లలో పాలు పంచుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు మంచి ఫాలోయింగ్…

32 mins ago

గెలిస్తే ఎంపీ .. ఓడితే గవర్నర్ !

ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి…

36 mins ago

ఆ పార్టీలో అందరూ కాబోయే మంత్రులే !

భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అబ్ కీ బార్ .. చార్ సౌ పార్ నినాదంతో దేశంలో ఎన్నికల…

2 hours ago

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

13 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

14 hours ago