Political News

జూలైలో షిఫ్ట్‌.. విశాఖ నుంచే ఏపీ పాల‌న‌.. తేల్చేసిన జ‌గ‌న్‌

ఎవ‌రు ఏమంటే అనుకోని.. ఏది ఏమైపోతే.. పోనీ.. అనుకున్న‌దే సాధించాల‌ని అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు ఏపీ సీఎం జ‌గ‌న్‌. తాను ప‌ట్టిన కుందేటికి మూడే కాళ్ల‌న్న‌ట్టుగా ఉన్నారు. విశాఖ‌కు త‌ర‌లిపోయే విష‌యం.. రాజ‌ధానిగా మార్చే విష‌యం.. ఒక‌వైపు న్యాయ‌స్థానంలో ఉండ‌గానే ఆయ‌న మాత్రం విశాఖ కు వెళ్లిపోయేందుకే మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు.. నిన్న మొన్న‌టి వ‌రకు కేవ‌లం కామెంట్ల‌కే ప‌రిమిత‌మైన జ‌గ‌న్ ఇప్పుడు ముహూర్తం కూడా రెడీ చేసుకున్నారు

తాజాగా జ‌రుగుతున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమాశాల నేపథ్యంలో సీఎం జ‌గ‌న్ విశాఖపై మ‌రో సారి వ్యాఖ్యానించారు. ఈ సారి తేల్చి చెప్పేశారు. మ‌న‌సులో ఏమీ దాచుకోలేదు. కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూలైలో విశాఖపట్నానికి వెళ్తున్నామని మంత్రులకు చెప్పేశారు. దీంతో.. అక్కడి నుంచి ప్రభుత్వ పాలనకు దాదాపుగా ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది.

విశాఖ పాలనా రాజధాని అని గతంలో ఢిల్లీలోనూ. త‌ర్వాత పెట్టుబ‌డుల స‌ద‌స్సు సంద‌ర్భంగా విశాఖ‌లోనూ సీఎం జగన్ సంచ‌న‌ల ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. త్వ‌ర‌లోనే తానూ విశాఖకు షిఫ్ట్‌ అవుతానని ఢిల్లీలో ఆయన ప్రకటించారు కూడా. దీంతో ఎప్పటి నుంచి విశాఖ నుంచి పాలన కొనసాగిస్తారనే ఆసక్తి నెలకొంది. అయితే.. మంగళవారం కేబినెట్‌ భేటీలో సీఎం జగన్‌.. విశాఖ నుంచి పాలనపై మంత్రుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

జూలైలో విశాఖకు వెళ్తామని సీఎం జగన్‌ వాళ్లతో స్పష్టం చేశారు. అలాగే.. ఎమ్మెల్సీ ఎన్నికలపైనా కేబినెట్‌లో చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో టికెట్ ద‌క్కించుకున్న‌ ఎమ్మెల్సీ అభ్య‌ర్థ‌ల‌ను గెలిపించే బాధ్యత మంత్రులకు అప్పగించారు. అంతేకాదు.. మంత్రులు సక్రమంగా పని చేయించకపోతే పదవులకు ముప్పు వస్తుందని హెచ్చరించిన‌ట్టు స‌మాచారం.

This post was last modified on March 14, 2023 10:03 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

5 hours ago