Political News

జూలైలో షిఫ్ట్‌.. విశాఖ నుంచే ఏపీ పాల‌న‌.. తేల్చేసిన జ‌గ‌న్‌

ఎవ‌రు ఏమంటే అనుకోని.. ఏది ఏమైపోతే.. పోనీ.. అనుకున్న‌దే సాధించాల‌ని అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు ఏపీ సీఎం జ‌గ‌న్‌. తాను ప‌ట్టిన కుందేటికి మూడే కాళ్ల‌న్న‌ట్టుగా ఉన్నారు. విశాఖ‌కు త‌ర‌లిపోయే విష‌యం.. రాజ‌ధానిగా మార్చే విష‌యం.. ఒక‌వైపు న్యాయ‌స్థానంలో ఉండ‌గానే ఆయ‌న మాత్రం విశాఖ కు వెళ్లిపోయేందుకే మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు.. నిన్న మొన్న‌టి వ‌రకు కేవ‌లం కామెంట్ల‌కే ప‌రిమిత‌మైన జ‌గ‌న్ ఇప్పుడు ముహూర్తం కూడా రెడీ చేసుకున్నారు

తాజాగా జ‌రుగుతున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమాశాల నేపథ్యంలో సీఎం జ‌గ‌న్ విశాఖపై మ‌రో సారి వ్యాఖ్యానించారు. ఈ సారి తేల్చి చెప్పేశారు. మ‌న‌సులో ఏమీ దాచుకోలేదు. కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూలైలో విశాఖపట్నానికి వెళ్తున్నామని మంత్రులకు చెప్పేశారు. దీంతో.. అక్కడి నుంచి ప్రభుత్వ పాలనకు దాదాపుగా ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది.

విశాఖ పాలనా రాజధాని అని గతంలో ఢిల్లీలోనూ. త‌ర్వాత పెట్టుబ‌డుల స‌ద‌స్సు సంద‌ర్భంగా విశాఖ‌లోనూ సీఎం జగన్ సంచ‌న‌ల ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. త్వ‌ర‌లోనే తానూ విశాఖకు షిఫ్ట్‌ అవుతానని ఢిల్లీలో ఆయన ప్రకటించారు కూడా. దీంతో ఎప్పటి నుంచి విశాఖ నుంచి పాలన కొనసాగిస్తారనే ఆసక్తి నెలకొంది. అయితే.. మంగళవారం కేబినెట్‌ భేటీలో సీఎం జగన్‌.. విశాఖ నుంచి పాలనపై మంత్రుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

జూలైలో విశాఖకు వెళ్తామని సీఎం జగన్‌ వాళ్లతో స్పష్టం చేశారు. అలాగే.. ఎమ్మెల్సీ ఎన్నికలపైనా కేబినెట్‌లో చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో టికెట్ ద‌క్కించుకున్న‌ ఎమ్మెల్సీ అభ్య‌ర్థ‌ల‌ను గెలిపించే బాధ్యత మంత్రులకు అప్పగించారు. అంతేకాదు.. మంత్రులు సక్రమంగా పని చేయించకపోతే పదవులకు ముప్పు వస్తుందని హెచ్చరించిన‌ట్టు స‌మాచారం.

This post was last modified on March 14, 2023 10:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

1 hour ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

5 hours ago