Political News

జూలైలో షిఫ్ట్‌.. విశాఖ నుంచే ఏపీ పాల‌న‌.. తేల్చేసిన జ‌గ‌న్‌

ఎవ‌రు ఏమంటే అనుకోని.. ఏది ఏమైపోతే.. పోనీ.. అనుకున్న‌దే సాధించాల‌ని అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు ఏపీ సీఎం జ‌గ‌న్‌. తాను ప‌ట్టిన కుందేటికి మూడే కాళ్ల‌న్న‌ట్టుగా ఉన్నారు. విశాఖ‌కు త‌ర‌లిపోయే విష‌యం.. రాజ‌ధానిగా మార్చే విష‌యం.. ఒక‌వైపు న్యాయ‌స్థానంలో ఉండ‌గానే ఆయ‌న మాత్రం విశాఖ కు వెళ్లిపోయేందుకే మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు.. నిన్న మొన్న‌టి వ‌రకు కేవ‌లం కామెంట్ల‌కే ప‌రిమిత‌మైన జ‌గ‌న్ ఇప్పుడు ముహూర్తం కూడా రెడీ చేసుకున్నారు

తాజాగా జ‌రుగుతున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమాశాల నేపథ్యంలో సీఎం జ‌గ‌న్ విశాఖపై మ‌రో సారి వ్యాఖ్యానించారు. ఈ సారి తేల్చి చెప్పేశారు. మ‌న‌సులో ఏమీ దాచుకోలేదు. కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూలైలో విశాఖపట్నానికి వెళ్తున్నామని మంత్రులకు చెప్పేశారు. దీంతో.. అక్కడి నుంచి ప్రభుత్వ పాలనకు దాదాపుగా ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది.

విశాఖ పాలనా రాజధాని అని గతంలో ఢిల్లీలోనూ. త‌ర్వాత పెట్టుబ‌డుల స‌ద‌స్సు సంద‌ర్భంగా విశాఖ‌లోనూ సీఎం జగన్ సంచ‌న‌ల ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. త్వ‌ర‌లోనే తానూ విశాఖకు షిఫ్ట్‌ అవుతానని ఢిల్లీలో ఆయన ప్రకటించారు కూడా. దీంతో ఎప్పటి నుంచి విశాఖ నుంచి పాలన కొనసాగిస్తారనే ఆసక్తి నెలకొంది. అయితే.. మంగళవారం కేబినెట్‌ భేటీలో సీఎం జగన్‌.. విశాఖ నుంచి పాలనపై మంత్రుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

జూలైలో విశాఖకు వెళ్తామని సీఎం జగన్‌ వాళ్లతో స్పష్టం చేశారు. అలాగే.. ఎమ్మెల్సీ ఎన్నికలపైనా కేబినెట్‌లో చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో టికెట్ ద‌క్కించుకున్న‌ ఎమ్మెల్సీ అభ్య‌ర్థ‌ల‌ను గెలిపించే బాధ్యత మంత్రులకు అప్పగించారు. అంతేకాదు.. మంత్రులు సక్రమంగా పని చేయించకపోతే పదవులకు ముప్పు వస్తుందని హెచ్చరించిన‌ట్టు స‌మాచారం.

This post was last modified on March 14, 2023 10:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

2 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

2 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

5 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago