ఎవరు ఏమంటే అనుకోని.. ఏది ఏమైపోతే.. పోనీ.. అనుకున్నదే సాధించాలని అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఏపీ సీఎం జగన్. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్టుగా ఉన్నారు. విశాఖకు తరలిపోయే విషయం.. రాజధానిగా మార్చే విషయం.. ఒకవైపు న్యాయస్థానంలో ఉండగానే ఆయన మాత్రం విశాఖ కు వెళ్లిపోయేందుకే మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు.. నిన్న మొన్నటి వరకు కేవలం కామెంట్లకే పరిమితమైన జగన్ ఇప్పుడు ముహూర్తం కూడా రెడీ చేసుకున్నారు
తాజాగా జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమాశాల నేపథ్యంలో సీఎం జగన్ విశాఖపై మరో సారి వ్యాఖ్యానించారు. ఈ సారి తేల్చి చెప్పేశారు. మనసులో ఏమీ దాచుకోలేదు. కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూలైలో విశాఖపట్నానికి వెళ్తున్నామని మంత్రులకు చెప్పేశారు. దీంతో.. అక్కడి నుంచి ప్రభుత్వ పాలనకు దాదాపుగా ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది.
విశాఖ పాలనా రాజధాని అని గతంలో ఢిల్లీలోనూ. తర్వాత పెట్టుబడుల సదస్సు సందర్భంగా విశాఖలోనూ సీఎం జగన్ సంచనల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. త్వరలోనే తానూ విశాఖకు షిఫ్ట్ అవుతానని ఢిల్లీలో ఆయన ప్రకటించారు కూడా. దీంతో ఎప్పటి నుంచి విశాఖ నుంచి పాలన కొనసాగిస్తారనే ఆసక్తి నెలకొంది. అయితే.. మంగళవారం కేబినెట్ భేటీలో సీఎం జగన్.. విశాఖ నుంచి పాలనపై మంత్రుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
జూలైలో విశాఖకు వెళ్తామని సీఎం జగన్ వాళ్లతో స్పష్టం చేశారు. అలాగే.. ఎమ్మెల్సీ ఎన్నికలపైనా కేబినెట్లో చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో టికెట్ దక్కించుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థలను గెలిపించే బాధ్యత మంత్రులకు అప్పగించారు. అంతేకాదు.. మంత్రులు సక్రమంగా పని చేయించకపోతే పదవులకు ముప్పు వస్తుందని హెచ్చరించినట్టు సమాచారం.
This post was last modified on March 14, 2023 10:03 pm
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…
ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…
నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…