ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం రాజకీయాల్లో మామూలు విషయమే. నువ్వు ఐరన్ లెగ్.. అంటే నువ్వు ఐరెన్ లెగ్ అని తిట్టుకోవడం ఇప్పుడు కొత్త ట్రెండ్. ఎవరికి వాళ్లు తాము గోల్డెన్ హ్యాండ్ అని.. పక్కనోడు ఐరెన్ లెగ్ అని చెప్పుకుంటుంటారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత ఎమ్మెల్యేలంతా బయటకు వచ్చి సరదాగా గడుపుతున్నారు. అసెంబ్లీ లాబీలో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని, టీడీపీ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎదురుపడ్డారు. బాగున్నారా అంటే బాగున్నారా అని పలుకరించుకున్నారు. చూసిన వాళ్లంతా అబ్బా ఎంత మంచి స్నేహితులు అని ముక్కున వేలేసుకున్నారు. కాకపోతే అక్కడే ఒక ట్విస్ట్ జరిగింది..
2024 ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ మళ్లీ గెలవాలని పేర్ని నాని ఆకాంక్షించారు. ఇంకేముంది అబ్బ ఎంత పెద్ద మనసు అని కూడా అందరూ మెచ్చుకున్నారు. అంతలోనే నాని అసలు సంగతి చెప్పారు. పయ్యావుల కేశవ్ ప్రస్తుతం ఉరవకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తుచేశారు. ఉరవకొండలో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ ఓడిపోతుందని సెంటిమెంటు రగిల్చారు. అంటే పయ్యావుల గెలవాలి, చంద్రబాబు ఓడిపోవాలని ఆయన పరోక్షంగా అనేశారు. ప్రస్తుతం పయ్యావుల ఉరవకొండకు ప్రాతినిధ్యం వహిస్తుంటే..ఆయన పార్టీ టీడీపీ మాత్రం ప్రతిపక్షంలో కూర్చుంది..
కాస్త ఖంగు తిన్న పయ్యావుల తర్వాత కౌంటరిచ్చారు. ఈ సారి అలాంటి సెంటిమెంట్ పనిచేయదన్నారు. 1994లో ఉరవకొండలోనూ, రాష్ట్రంలోనూ టీడీపీ గెలిచిందని, 2024లో అదే జరగబోతోందని పయ్యావుల అన్నారు. వైసీపీ నేతలు ఎలాంటి ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. అందరూ సరదాగా నవ్వుకుంటూ ఎటు వాళ్లు అటు వెళ్లిపోయారనుకోండి. అదీ ఉరవకొండ సెంటిమెంట్…
This post was last modified on March 14, 2023 2:17 pm
ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి…
వైసీపీ అధినేత జగన్ను అధికారంలోకి రాకుండా చేస్తానని.. అవసరమైతే.. చంద్రబాబు ఓకే అంటే.. తాను కూడా పాదయాత్రకు రెడీ అంటూ..…
హీరో తిరువీర్ కథల ఎంపిక పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. మాసూద లాంటి హారర్ మూవీ, ది గ్రేట్…
ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీమిండియా మాజీ కెప్టెన్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…