గతానికి భిన్నమైన పరిస్థితులు కొన్ని వర్తమానంలో చోటు చేసుకుంటున్నాయి. గతంలో రాజకీయం.. పాలనా వ్యవస్థలు రెండు రెండు దారులుగా ఉండటం తెలిసిందే. ఈ రెండు రంగాలకు చెందిన వారు పెళ్లాడటం అన్నది చాలా చాలా అరుదుగా చోటు చేసుకునే పరిస్థితి. దీనికి భిన్నంగా ఇటీవల కాలంలో ఇలాంటి కాంబనేషన్లో కూడా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి పంజాబ్ లో చోటు చేసుకుందని చెబుతున్నారు.
పంజాబ్ రాష్ట్ర విద్యా శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్నారు హర్ జోత్ బెయిన్స్. ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆనంద్ పుర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ నేతగా విజయం సాధించారు. అనంతరం భగవంత్ మాన్ ప్రభుత్వంలో ఆయనకు విద్యా శాఖా మంత్రిగా అవకాశం దక్కింది. ఇదిలా ఉండగా.. ఆయన ఐపీఎస్ అధికారిణి ప్రేమలో పడినట్లుగా చెబుతున్నారు.
2019 బ్యాచ్ కు చెందిన జ్యోతి యాదవ్ ప్రస్తుతం మాన్సా జిల్లా ఎస్పీగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి ఈ ఇద్దరికి మధ్య ప్రేమ చిగురించటం.. చివరకు ఇద్దరు పెళ్లాడాలని డిసైడ్ కావటం జరిగిపోయాయి. ఈ మధ్యనే వీరిద్దరికి నిశ్చితార్థం జరిగినట్లుగా చెబుతున్నారు. వీరి పెళ్లి ఈ నెలలో జరుగుతుందని.. దీనికి ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.. పంజాబ్ ముఖ్యమంత్రులతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు.. పార్టీ నేతలు.. ఇతర పార్టీలకు చెందిన వారు హాజరవుతారని చెబుతున్నారు. ఇక.. అమ్మాయి తరపున ఐపీఎస్ లు.. ఐఏఎస్ లు.. ఇలా పలువురు అధికారులు కూడా హాజరు కానుండటంతో.. ఈ పెళ్లి వేడుక కొత్త వాతావరణం చోటు చేసుకుంటుందని చెప్పక తప్పదు.
This post was last modified on March 14, 2023 12:30 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…