Political News

IPS ఆఫీసర్ ప్రేమలో మంత్రిగారు !

గతానికి భిన్నమైన పరిస్థితులు కొన్ని వర్తమానంలో చోటు చేసుకుంటున్నాయి. గతంలో రాజకీయం.. పాలనా వ్యవస్థలు రెండు రెండు దారులుగా ఉండటం తెలిసిందే. ఈ రెండు రంగాలకు చెందిన వారు పెళ్లాడటం అన్నది చాలా చాలా అరుదుగా చోటు చేసుకునే పరిస్థితి. దీనికి భిన్నంగా ఇటీవల కాలంలో ఇలాంటి కాంబనేషన్లో కూడా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి పంజాబ్ లో చోటు చేసుకుందని చెబుతున్నారు.

పంజాబ్ రాష్ట్ర విద్యా శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్నారు హర్ జోత్ బెయిన్స్. ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆనంద్ పుర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ నేతగా విజయం సాధించారు. అనంతరం భగవంత్ మాన్ ప్రభుత్వంలో ఆయనకు విద్యా శాఖా మంత్రిగా అవకాశం దక్కింది. ఇదిలా ఉండగా.. ఆయన ఐపీఎస్ అధికారిణి ప్రేమలో పడినట్లుగా చెబుతున్నారు.

2019 బ్యాచ్ కు చెందిన జ్యోతి యాదవ్ ప్రస్తుతం మాన్సా జిల్లా ఎస్పీగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి ఈ ఇద్దరికి మధ్య ప్రేమ చిగురించటం.. చివరకు ఇద్దరు పెళ్లాడాలని డిసైడ్ కావటం జరిగిపోయాయి. ఈ మధ్యనే వీరిద్దరికి నిశ్చితార్థం జరిగినట్లుగా చెబుతున్నారు. వీరి పెళ్లి ఈ నెలలో జరుగుతుందని.. దీనికి ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.. పంజాబ్ ముఖ్యమంత్రులతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు.. పార్టీ నేతలు.. ఇతర పార్టీలకు చెందిన వారు హాజరవుతారని చెబుతున్నారు. ఇక.. అమ్మాయి తరపున ఐపీఎస్ లు.. ఐఏఎస్ లు.. ఇలా పలువురు అధికారులు కూడా హాజరు కానుండటంతో.. ఈ పెళ్లి వేడుక కొత్త వాతావరణం చోటు చేసుకుంటుందని చెప్పక తప్పదు.

This post was last modified on March 14, 2023 12:30 pm

Share

Recent Posts

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

15 minutes ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

52 minutes ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

1 hour ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

4 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

5 hours ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

13 hours ago