ఏపీ సహా దేశంలో సైతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆదివారం కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ విచారించాల్సి ఉంది. ఈ కేసులో తీవ్ర దూకు డు ప్రదర్శిస్తున్న సీబీఐ.. అవినాష్తో పాటు ఆయన తండ్రిని కూడా అరెస్టు చేస్తామని.. ఇటీవల తెలంగాణ కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా భాస్కరరెడ్డి విచారణ అంశం.. పతాక స్థాయిలో చర్చకు వచ్చింది. ఏం జరుగుతుందనే ఉత్కంఠ కూడా రేపింది.
అయితే.. అనూహ్యంగా సీబీఐ ఈ విచారణను వాయిదా వేసింది. భాస్కర్ రెడ్డిని ఏడాది కిందట వరసగా రెండు రోజుల పాటు పులివెందులలో సీబీఐ విచారించింది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఆదివారం విచారణకు పిలిచారు. గత నెల 23నే విచారణకు రావాలని భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు అందించినా.. వ్యక్తిగత కారణాలతో గడువు కోరారు. ఈ నెల 5వ తేదీన మరోసారి నోటీసులు అందజేసిన సీబీఐ అధికారులు.. ఈ నెల 12న కడపలో విచారణకు రావాలని సీఆర్పీసీ 160 కింద నోటీసులిచ్చారు.
దీంతో భాస్కర్రెడ్డి కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో ఈరోజు సీబీఐ విచారణకు హాజరయ్యారు. అక్కడ అధికారులెవరూ లేకపోవడంతో ఆయన వెళ్లిపోయారు. అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చి పిలిస్తే.. వస్తానని భాస్కర్ రెడ్డి తెలిపారు. అంతేకాదు.. సీబీఐ అరెస్టు సహా ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని.. చెప్పారు. విచారణ కోసం కడప సెంట్రల్ జైలుకు వచ్చిన ఆయన.. అధికారులు లేకపోవడంతో వెనుదిరిగారు.
విచారణ తేదీ మళ్లీ చెబుతామన్నారని.. మరోసారి నోటీసు ఇస్తే సీబీఐ ముందుకు వస్తానని భాస్కర్రెడ్డి తెలిపారు. హత్యా స్థలంలో దొరికిన లేఖపై సీబీఐ ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. భాస్కరరెడ్డి వెంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా కడప సెంట్రల్ జైలు వద్దకు తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
This post was last modified on March 12, 2023 12:21 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…