ఏపీ సహా దేశంలో సైతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆదివారం కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ విచారించాల్సి ఉంది. ఈ కేసులో తీవ్ర దూకు డు ప్రదర్శిస్తున్న సీబీఐ.. అవినాష్తో పాటు ఆయన తండ్రిని కూడా అరెస్టు చేస్తామని.. ఇటీవల తెలంగాణ కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా భాస్కరరెడ్డి విచారణ అంశం.. పతాక స్థాయిలో చర్చకు వచ్చింది. ఏం జరుగుతుందనే ఉత్కంఠ కూడా రేపింది.
అయితే.. అనూహ్యంగా సీబీఐ ఈ విచారణను వాయిదా వేసింది. భాస్కర్ రెడ్డిని ఏడాది కిందట వరసగా రెండు రోజుల పాటు పులివెందులలో సీబీఐ విచారించింది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఆదివారం విచారణకు పిలిచారు. గత నెల 23నే విచారణకు రావాలని భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు అందించినా.. వ్యక్తిగత కారణాలతో గడువు కోరారు. ఈ నెల 5వ తేదీన మరోసారి నోటీసులు అందజేసిన సీబీఐ అధికారులు.. ఈ నెల 12న కడపలో విచారణకు రావాలని సీఆర్పీసీ 160 కింద నోటీసులిచ్చారు.
దీంతో భాస్కర్రెడ్డి కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో ఈరోజు సీబీఐ విచారణకు హాజరయ్యారు. అక్కడ అధికారులెవరూ లేకపోవడంతో ఆయన వెళ్లిపోయారు. అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చి పిలిస్తే.. వస్తానని భాస్కర్ రెడ్డి తెలిపారు. అంతేకాదు.. సీబీఐ అరెస్టు సహా ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని.. చెప్పారు. విచారణ కోసం కడప సెంట్రల్ జైలుకు వచ్చిన ఆయన.. అధికారులు లేకపోవడంతో వెనుదిరిగారు.
విచారణ తేదీ మళ్లీ చెబుతామన్నారని.. మరోసారి నోటీసు ఇస్తే సీబీఐ ముందుకు వస్తానని భాస్కర్రెడ్డి తెలిపారు. హత్యా స్థలంలో దొరికిన లేఖపై సీబీఐ ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. భాస్కరరెడ్డి వెంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా కడప సెంట్రల్ జైలు వద్దకు తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
This post was last modified on March 12, 2023 12:21 pm
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…