ఇప్పటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పన్నెత్తు మాట అనని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా కేసీఆర్పై విరుచుకుపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో బీసీ సామాజిక వర్గంపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్పైనా.. బీఆర్ఎస్ పార్టీపైనా.. అదే సమయంలో వైసీపీ, టీడీపీలపైనా.. పవన్ విరుచుకుపడ్డారు. అంటే.. మొత్తంగా అటు తెలంగాణ, ఇటు ఏపీలకు సంబంధించి అన్ని పార్టీలనూ కలిపి ఆయన దంచేశారు.
తెలంగాణలో 26 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించడంపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని.. పవన్ ప్రశ్నించారు. ఈ దారుణ అన్యాయంపై బీఆర్ఎస్ అధినేతగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ వివరణ ఇవ్వాలని పవన్ నిలదీశారు. బీసీ కులాల తొలగింపుపై వైసీపీ, టీడీపీ కూడా స్పందించాలన్నారు. బీసీలకు జనసేన అండగా ఉంటుందని తెలిపారు. చట్టసభల్లో సంఖ్యా బలం లేని బీసీలకు ఏం చేయగలం అనే దానిపై ఆలోచిస్తానన్నారు.
“మీ ఓట్లే మీకు పడవు అని బీసీలను హేళన చేస్తున్నారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు అందరూ ఏకతాటిపైకి రావాలి. నన్ను ఒక కులానికి పరిమితం చేసి బీసీ నాయకులతో తిట్టిస్తున్నారు. నన్ను బీసీలతో తిట్టిస్తే రెండు వర్గాల వారు గ్రామస్థాయిలో ఘర్షణకు దిగుతారు. నేను ఒక కులానికి మాత్రమే నాయకుడిని కాదు. ప్రజలందరికీ నాయకుడిగా ఉండాలనుకుంటు న్నా” అని పవన్ కల్యాణ్ తెలిపారు.
బీసీలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్యాయం జరుగుతోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు రాజ్యాధికారం అర్థించటం కాదు.. సాధించుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. అన్ని బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదని చెప్పారు. ఇన్నేళ్లుగా బీసీల సమైక్యత ఎందుకు సాధ్యం కాలేదో అర్థం కావట్లేదన్నారు. గతంలో 93 ఉన్న బీసీ కులాలు ఇప్పుడు 140కి ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. దీనిపై బీఆర్ఎస్, వైసీపీలు సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు.
This post was last modified on March 12, 2023 7:29 am
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…