Political News

అన్ని పార్టీల‌నూ క‌లిపి దంచేసిన ప‌వ‌న్‌

ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప‌న్నెత్తు మాట అన‌ని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తాజాగా కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో బీసీ సామాజిక వ‌ర్గంపై ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌పైనా.. బీఆర్ఎస్ పార్టీపైనా.. అదే స‌మ‌యంలో వైసీపీ, టీడీపీల‌పైనా.. ప‌వ‌న్‌ విరుచుకుప‌డ్డారు. అంటే.. మొత్తంగా అటు తెలంగాణ‌, ఇటు ఏపీల‌కు సంబంధించి అన్ని పార్టీల‌నూ క‌లిపి ఆయ‌న దంచేశారు.

తెలంగాణలో 26 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించడంపై కేసీఆర్ ఎందుకు స్పందించ‌డం లేద‌ని.. ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. ఈ దారుణ అన్యాయంపై బీఆర్ఎస్ అధినేత‌గా, ముఖ్య‌మంత్రిగా కేసీఆర్‌ వివరణ ఇవ్వాలని ప‌వ‌న్ నిల‌దీశారు. బీసీ కులాల తొలగింపుపై వైసీపీ, టీడీపీ కూడా స్పందించాలన్నారు. బీసీలకు జనసేన అండగా ఉంటుందని తెలిపారు. చట్టసభల్లో సంఖ్యా బలం లేని బీసీలకు ఏం చేయగలం అనే దానిపై ఆలోచిస్తాన‌న్నారు.

“మీ ఓట్లే మీకు పడవు అని బీసీలను హేళన చేస్తున్నారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు అందరూ ఏకతాటిపైకి రావాలి. నన్ను ఒక కులానికి పరిమితం చేసి బీసీ నాయకులతో తిట్టిస్తున్నారు. నన్ను బీసీలతో తిట్టిస్తే రెండు వర్గాల వారు గ్రామస్థాయిలో ఘర్షణకు దిగుతారు. నేను ఒక కులానికి మాత్రమే నాయకుడిని కాదు. ప్రజలందరికీ నాయకుడిగా ఉండాలనుకుంటు న్నా” అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

బీసీల‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్యాయం జ‌రుగుతోంద‌ని ప‌వ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బీసీలు రాజ్యాధికారం అర్థించటం కాదు.. సాధించుకోవాలని పవన్‌ కల్యాణ్ సూచించారు. అన్ని బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదని చెప్పారు. ఇన్నేళ్లుగా బీసీల సమైక్యత ఎందుకు సాధ్యం కాలేదో అర్థం కావట్లేదన్నారు. గతంలో 93 ఉన్న బీసీ కులాలు ఇప్పుడు 140కి ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. దీనిపై బీఆర్ఎస్‌, వైసీపీలు స‌మాధానం చెప్పాల్సిందేన‌ని అన్నారు.

Satya

Recent Posts

స్పందించిన బన్నీ… సర్దుకుంటాయా అన్నీ

మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…

1 hour ago

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

2 hours ago

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

2 hours ago

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

4 hours ago

AA23 విలన్ పైనే అందరి కన్ను!

అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…

4 hours ago

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…

5 hours ago