గత కొన్ని నెలలుగా.. తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు కూడా వస్తున్నా యి. కీలకమైన దళితబంధు పథకాన్ని వారు దారిమళ్లిస్తున్నారని.. ఈ పథకంలో లబ్ది పొందాలంటే.. చేతులు తడపక తప్పనిపరిస్థితి వస్తోందని.. ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల తీరుపై ఇటీవల కాలంలో అనేక మీడియా సంస్థలు వార్తలు రాస్తూనే ఉన్నాయి.
కొందరు అధికారులతో కుమ్మక్కయితే.. మరికొందరు ఎమ్మెల్యేలు..నేరుగానే ఈ పథకంలో నిధులు బొక్కు తున్నారని కూడా ఆరోపణలు వినిపించాయి. మరోసారి అధికారంలోకి తెచ్చిపెట్టే కీలకమైన పథకంగా భావిస్తున్న దళితబంధు ఆరోపణలను ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నారు. అయితే.. ఏయే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారనే వివరాలు సీఎం కేసీఆర్కు చేరిపోయాయి. దీంతో ఆయన నేరుగానే వారిని హెచ్చరించారు.
దళితబంధు అమలు తీరుపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. దళితబంధు కోసం కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటున్న వైనాన్ని ఆయన కళ్లకు కట్టారు. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలలో కొందరు డబ్బులు వసూలు చేశారని.. ఆ వివరాలు.. అన్నీ తన దగ్గర ఉన్నాయని కేసీఆర్ కుండబద్దలు కొట్టడంతో ఎమ్మెల్యేలు గుడ్లు తేలేశారు. అయితే.. ఈ సమయంలో కేసీఆర్ వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు కానీ, వార్నింగ్ అయితే ఇచ్చారు.
మళ్లీ ఇలాంటి నొక్కుళ్లు రిపీట్ అయితే..ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను కేసీఆర్ హెచ్చరించారు. “దళిత బంధు.. మనల్ని కాపాడే పథకం. ఏమనుకుంటున్నరు? ” అని ఎమ్మెల్యేలను సీఎం నిగ్గదీసినట్టు సమాచారం. మరి ఇప్పటికైనా ఎమ్మెల్యేలు తమ దారి మార్చుకుంటారో లేదో చూడాలి. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో అత్యంత రహస్యంగా చేసిన ఈ హెచ్చరికలు తాజాగా లీక్ అయ్యాయి.
This post was last modified on March 12, 2023 7:16 am
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…
ఫార్చునర్ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ…
నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగా నిలవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్.. పరిశ్రమలో ఒక స్థాయి అందుకున్న దగ్గర్నుంచి తాను పని చేసే ఇండస్ట్రీలోనే…
రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…