ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో కొత్త రూటు వెదుక్కుంటున్నారు. ఆయన కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా ఆయన సమక్షంలో కిరణ్ కాషాయ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం..
కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరిన తర్వాత కిరణ్ రాజకీయాల్లో అంతగా క్రియాశీలంగా లేరు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. గిడుగు రుద్రరాజుకు పీసీసీ అధ్యక్ష పదవిని అప్పగించిన నేపథ్యంలో కిరణ్ బాగా నొచ్చుకున్నారని చెబుతున్నారు. దానితో ఆయన కాంగ్రెస్ కు దూరంగా జరిగి ఊరుకున్నారన్న చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీకి పేరున్న నాయకుడు అవసరం. కన్నా లక్ష్మీ నారాయణ వెళ్లిపోయిన తర్వాత పార్టీకి ఛరిస్మా ఉన్న నేత కావాలని బీజేపీ భావించింది. సోము వీర్రాజు నాయకత్వంలో పార్టీ ముందుకు సాగడం లేదు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవకపోయినా ఓట్ షేర్ పెరగాలంటే బలమైన నాయకత్వం అవసరమని గుర్తించారు.
చాలా రోజులుగా కిరణ్ కు గాలం వేస్తున్న కమలనాథులు ఈ సారి సీరియస్ గానే ఆయనపై దృష్టి పెట్టారు. ప్రస్తుతానికి ఖాళీగా ఉండటంతో కిరణ్ కూడా బీజేపీ ఆఫర్ ను తిరస్కరించలేకపోయారు. పార్టీలోకి వచ్చినందుకు ఆయన హోదాకు తగిన పదవి ఇస్తామని బీజేపీ హామీ ఇవ్వడంతో కిరణ్ అందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు.
This post was last modified on March 11, 2023 10:16 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…