ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో కొత్త రూటు వెదుక్కుంటున్నారు. ఆయన కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా ఆయన సమక్షంలో కిరణ్ కాషాయ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం..
కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరిన తర్వాత కిరణ్ రాజకీయాల్లో అంతగా క్రియాశీలంగా లేరు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. గిడుగు రుద్రరాజుకు పీసీసీ అధ్యక్ష పదవిని అప్పగించిన నేపథ్యంలో కిరణ్ బాగా నొచ్చుకున్నారని చెబుతున్నారు. దానితో ఆయన కాంగ్రెస్ కు దూరంగా జరిగి ఊరుకున్నారన్న చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీకి పేరున్న నాయకుడు అవసరం. కన్నా లక్ష్మీ నారాయణ వెళ్లిపోయిన తర్వాత పార్టీకి ఛరిస్మా ఉన్న నేత కావాలని బీజేపీ భావించింది. సోము వీర్రాజు నాయకత్వంలో పార్టీ ముందుకు సాగడం లేదు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవకపోయినా ఓట్ షేర్ పెరగాలంటే బలమైన నాయకత్వం అవసరమని గుర్తించారు.
చాలా రోజులుగా కిరణ్ కు గాలం వేస్తున్న కమలనాథులు ఈ సారి సీరియస్ గానే ఆయనపై దృష్టి పెట్టారు. ప్రస్తుతానికి ఖాళీగా ఉండటంతో కిరణ్ కూడా బీజేపీ ఆఫర్ ను తిరస్కరించలేకపోయారు. పార్టీలోకి వచ్చినందుకు ఆయన హోదాకు తగిన పదవి ఇస్తామని బీజేపీ హామీ ఇవ్వడంతో కిరణ్ అందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు.
This post was last modified on March 11, 2023 10:16 am
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…