తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి మధ్య లింకు ఉందనే విషయం గత మూడు మాసాలుగా నాను తున్నప్పటికీ.. ఎన్నడూ నోరు విప్పని సీఎం కేసీఆర్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ విచారణ తర్వాత కవితను అరెస్ట్ చేయొచ్చని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అరెస్ట్ చేసుకుంటే చేసుకోనీ.. అందర్నీ వేధిస్తున్నారని అన్నారు.
‘కవితను మహా అయితే ఏం చేస్తారు.. జైలుకు పంపుతారు’ అంతేకదా..?” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఎవరికీ భయపడేది లేదని.. పోరాటం అస్సలు ఆపే ప్రసక్తే లేదన్నారు. ఇదిలావుంటే.. మంత్రి, కవిత సోదరుడు కేటీఆర్ కూడా ఢిల్లీకి వెళ్లారు. కేసీఆర్ వ్యాఖ్యల తర్వాత.. చోటు చేసుకున్న ఈ పరిణామంతో కవిత అరెస్టు తప్పదనే సంకేతాలకు బలం చేకూరినట్టు అయింది. ఇక, కవిత శనివారం ఈడీ ఎదుట హాజరుకానున్నారు.
దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠం నెలకొంది. ఇప్పటికే ఢిల్లీలో కవితతో పాటు మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లు ఉన్నారు. ఇక, బీఆర్ఎస్ లీగల్ సెల్కు చెందిన న్యాయవాదులు వెళ్లారు. ఇలా వరుసగా బీఆర్ఎస్ పెద్దలంతా ఢిల్లీకి పయనం అవుతుండడం మరింత ఉత్కంఠకు దారితీసింది.
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…