Political News

మూడు లేన‌ట్టే.. ఇక రాన‌ట్టే.. వైసీపీలో గుస‌గుస‌…!


మూడు రాజ‌ధానుల‌పై ఆశ‌లు పెట్టుకున్న వైసీపీకి ఆ ఆశ‌లు ఇప్ప‌ట్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. ఉగాది సంద‌ర్భంగా పాల‌నా రాజ‌ధానిని విశాఖ‌కు త‌ర‌లించాల‌ని.. వైసీపీ అధిష్టానం సంక‌ల్పం చెప్పుకొంది. ఆ రోజు నుంచి జ‌గ‌న్‌కు మంచి రోజులు మొద‌ల‌వుతాయ‌ని.. విశాఖ శార‌దాపీఠం నుంచి కూడా సంకేతాలు వ‌చ్చిన ద‌రిమిలా.. రాజ‌ధాని మార్పుపై సీఎం జ‌గ‌న్ స‌హా ప్ర‌భుత్వం ఉత్సాహం చూపించింది. అయితే.. దీనిపై కేసులు న‌మోదై ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టులో త్వ‌ర‌గా విచార‌ణ పూర్తి చేయించాల‌ని కూడా నిర్ణ‌యించారు. ప‌దే ప‌దే కోర్టును కూడా కోరారు. కానీ, సుప్రీంకోర్టు మాత్రం దీనికి అంగీక‌రించ‌లేదు. షెడ్యూల్ ప్ర‌కార‌మే కేసును విచా రిస్తామ‌ని.. దీనికి జూన్ జూలై వ‌ర‌కు కూడా స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చ‌ని తేల్చి చెప్పింది. దీంతో ఎటూ వెళ్ల‌లేని ప‌రిస్థితి వైసీపీని ఇబ్బంది పెడుతోంది. పాల‌నా రాజ‌ధానిని క‌నుక విశాఖ‌కు త‌ర‌లిస్తే.. మూడు ప్రాంతాల ను అభివృద్ధి చేసేందుకు తాము ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని ప్ర‌జ‌ల‌కు చెప్పుకొనేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్నారు.

త‌ద్వారా.. టీడీపీకి కంచుకోట‌లుగా ఉన్న ఉత్త‌రాంధ్ర జిల్లాల‌పై ప‌ట్టు బిగించిన‌ట్టు అవుతుంద‌నికూడా.. వైసీపీ భావించింది. అయితే.. వైసీపీకి ఉన్న తొంద‌ర‌కు.. న్యాయ‌వ్య‌వ‌స్థ బ్రేకులు వేస్తూ వ‌చ్చింది. దీంతో ఈ ఉగాదికి రాజ‌ధాని త‌ర‌లింపు ప్ర‌క్రియ ముందుకు సాగే అవ‌కాశం లేదు. అదే స‌మ‌యంలో జూన్ జూలై నాటికి వైసీపీకి అనుకూలంగా ఏదైనా తీర్పు వ‌చ్చినా.. రాజ‌ధానిరైతులు.. మ‌రోసారి రివ్యూ పిటిష‌న్ వేస్తే.. ఆగిపోయే అవ‌కాశం ఉంటుంది.

అంటే.. మొత్తంగా.. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా.. రాజ‌ధాని అంశం అలానే ఉంటుంద‌నేది ప‌రిశీల‌కులు వేస్తున్న అంచ‌నాగా ఉంది. దీంతో ఎన్నిక‌ల్లో మూడు రాజ‌ధానుల అజెండాను వైసీపీ చేర్చే అవ‌కాశం ఉంది. మ‌రి దీనికి ప్ర‌జ‌లు అంగీక‌రిస్తారా? అనేది చూడాలి. ఏదైనా తేడా వ‌స్తే.. అమ‌రావ‌తి కే ప్ర‌జ‌లు జై కొడితే.. అప్పుడు వైసీపీ వ్యూహం మొత్తానికి విఫ‌లం కావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on March 11, 2023 9:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

1 hour ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

2 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

4 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

6 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

11 hours ago

మోడీపై సీనియర్ నటుడి ఊహించ‌ని ఎలివేషన్

సినిమా వాళ్ల‌కు రాజ‌కీయ ఆస‌క్తులు, అభిమానాలు ఉండ‌డం కొత్త కాదు. అందులో త‌ప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజ‌కీయాల…

11 hours ago