Political News

మూడు లేన‌ట్టే.. ఇక రాన‌ట్టే.. వైసీపీలో గుస‌గుస‌…!


మూడు రాజ‌ధానుల‌పై ఆశ‌లు పెట్టుకున్న వైసీపీకి ఆ ఆశ‌లు ఇప్ప‌ట్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. ఉగాది సంద‌ర్భంగా పాల‌నా రాజ‌ధానిని విశాఖ‌కు త‌ర‌లించాల‌ని.. వైసీపీ అధిష్టానం సంక‌ల్పం చెప్పుకొంది. ఆ రోజు నుంచి జ‌గ‌న్‌కు మంచి రోజులు మొద‌ల‌వుతాయ‌ని.. విశాఖ శార‌దాపీఠం నుంచి కూడా సంకేతాలు వ‌చ్చిన ద‌రిమిలా.. రాజ‌ధాని మార్పుపై సీఎం జ‌గ‌న్ స‌హా ప్ర‌భుత్వం ఉత్సాహం చూపించింది. అయితే.. దీనిపై కేసులు న‌మోదై ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టులో త్వ‌ర‌గా విచార‌ణ పూర్తి చేయించాల‌ని కూడా నిర్ణ‌యించారు. ప‌దే ప‌దే కోర్టును కూడా కోరారు. కానీ, సుప్రీంకోర్టు మాత్రం దీనికి అంగీక‌రించ‌లేదు. షెడ్యూల్ ప్ర‌కార‌మే కేసును విచా రిస్తామ‌ని.. దీనికి జూన్ జూలై వ‌ర‌కు కూడా స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చ‌ని తేల్చి చెప్పింది. దీంతో ఎటూ వెళ్ల‌లేని ప‌రిస్థితి వైసీపీని ఇబ్బంది పెడుతోంది. పాల‌నా రాజ‌ధానిని క‌నుక విశాఖ‌కు త‌ర‌లిస్తే.. మూడు ప్రాంతాల ను అభివృద్ధి చేసేందుకు తాము ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని ప్ర‌జ‌ల‌కు చెప్పుకొనేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్నారు.

త‌ద్వారా.. టీడీపీకి కంచుకోట‌లుగా ఉన్న ఉత్త‌రాంధ్ర జిల్లాల‌పై ప‌ట్టు బిగించిన‌ట్టు అవుతుంద‌నికూడా.. వైసీపీ భావించింది. అయితే.. వైసీపీకి ఉన్న తొంద‌ర‌కు.. న్యాయ‌వ్య‌వ‌స్థ బ్రేకులు వేస్తూ వ‌చ్చింది. దీంతో ఈ ఉగాదికి రాజ‌ధాని త‌ర‌లింపు ప్ర‌క్రియ ముందుకు సాగే అవ‌కాశం లేదు. అదే స‌మ‌యంలో జూన్ జూలై నాటికి వైసీపీకి అనుకూలంగా ఏదైనా తీర్పు వ‌చ్చినా.. రాజ‌ధానిరైతులు.. మ‌రోసారి రివ్యూ పిటిష‌న్ వేస్తే.. ఆగిపోయే అవ‌కాశం ఉంటుంది.

అంటే.. మొత్తంగా.. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా.. రాజ‌ధాని అంశం అలానే ఉంటుంద‌నేది ప‌రిశీల‌కులు వేస్తున్న అంచ‌నాగా ఉంది. దీంతో ఎన్నిక‌ల్లో మూడు రాజ‌ధానుల అజెండాను వైసీపీ చేర్చే అవ‌కాశం ఉంది. మ‌రి దీనికి ప్ర‌జ‌లు అంగీక‌రిస్తారా? అనేది చూడాలి. ఏదైనా తేడా వ‌స్తే.. అమ‌రావ‌తి కే ప్ర‌జ‌లు జై కొడితే.. అప్పుడు వైసీపీ వ్యూహం మొత్తానికి విఫ‌లం కావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on March 11, 2023 9:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago