Political News

మూడు లేన‌ట్టే.. ఇక రాన‌ట్టే.. వైసీపీలో గుస‌గుస‌…!


మూడు రాజ‌ధానుల‌పై ఆశ‌లు పెట్టుకున్న వైసీపీకి ఆ ఆశ‌లు ఇప్ప‌ట్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. ఉగాది సంద‌ర్భంగా పాల‌నా రాజ‌ధానిని విశాఖ‌కు త‌ర‌లించాల‌ని.. వైసీపీ అధిష్టానం సంక‌ల్పం చెప్పుకొంది. ఆ రోజు నుంచి జ‌గ‌న్‌కు మంచి రోజులు మొద‌ల‌వుతాయ‌ని.. విశాఖ శార‌దాపీఠం నుంచి కూడా సంకేతాలు వ‌చ్చిన ద‌రిమిలా.. రాజ‌ధాని మార్పుపై సీఎం జ‌గ‌న్ స‌హా ప్ర‌భుత్వం ఉత్సాహం చూపించింది. అయితే.. దీనిపై కేసులు న‌మోదై ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టులో త్వ‌ర‌గా విచార‌ణ పూర్తి చేయించాల‌ని కూడా నిర్ణ‌యించారు. ప‌దే ప‌దే కోర్టును కూడా కోరారు. కానీ, సుప్రీంకోర్టు మాత్రం దీనికి అంగీక‌రించ‌లేదు. షెడ్యూల్ ప్ర‌కార‌మే కేసును విచా రిస్తామ‌ని.. దీనికి జూన్ జూలై వ‌ర‌కు కూడా స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చ‌ని తేల్చి చెప్పింది. దీంతో ఎటూ వెళ్ల‌లేని ప‌రిస్థితి వైసీపీని ఇబ్బంది పెడుతోంది. పాల‌నా రాజ‌ధానిని క‌నుక విశాఖ‌కు త‌ర‌లిస్తే.. మూడు ప్రాంతాల ను అభివృద్ధి చేసేందుకు తాము ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని ప్ర‌జ‌ల‌కు చెప్పుకొనేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్నారు.

త‌ద్వారా.. టీడీపీకి కంచుకోట‌లుగా ఉన్న ఉత్త‌రాంధ్ర జిల్లాల‌పై ప‌ట్టు బిగించిన‌ట్టు అవుతుంద‌నికూడా.. వైసీపీ భావించింది. అయితే.. వైసీపీకి ఉన్న తొంద‌ర‌కు.. న్యాయ‌వ్య‌వ‌స్థ బ్రేకులు వేస్తూ వ‌చ్చింది. దీంతో ఈ ఉగాదికి రాజ‌ధాని త‌ర‌లింపు ప్ర‌క్రియ ముందుకు సాగే అవ‌కాశం లేదు. అదే స‌మ‌యంలో జూన్ జూలై నాటికి వైసీపీకి అనుకూలంగా ఏదైనా తీర్పు వ‌చ్చినా.. రాజ‌ధానిరైతులు.. మ‌రోసారి రివ్యూ పిటిష‌న్ వేస్తే.. ఆగిపోయే అవ‌కాశం ఉంటుంది.

అంటే.. మొత్తంగా.. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా.. రాజ‌ధాని అంశం అలానే ఉంటుంద‌నేది ప‌రిశీల‌కులు వేస్తున్న అంచ‌నాగా ఉంది. దీంతో ఎన్నిక‌ల్లో మూడు రాజ‌ధానుల అజెండాను వైసీపీ చేర్చే అవ‌కాశం ఉంది. మ‌రి దీనికి ప్ర‌జ‌లు అంగీక‌రిస్తారా? అనేది చూడాలి. ఏదైనా తేడా వ‌స్తే.. అమ‌రావ‌తి కే ప్ర‌జ‌లు జై కొడితే.. అప్పుడు వైసీపీ వ్యూహం మొత్తానికి విఫ‌లం కావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on March 11, 2023 9:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

OTT రూటు… ఇది కరెక్టు పాయింటు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళకు చెందిన నాలుగు నిర్మాతల మండళ్లు ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. రాబోయే రోజుల్లో…

15 minutes ago

బడ్జెట్ 10 కోట్లు… వసూళ్లు 200 కోట్లు

మన దగ్గర మిడ్ రేంజ్ హీరోల మీద వంద కోట్ల బడ్జెట్లు పెట్టేస్తున్నారు నిర్మాతలు. తీరా చూస్తే తెర మీద…

50 minutes ago

నవ్వుల నాగ‌బాబు… జ‌బ‌ర్ద‌స్త్‌ను లేప‌గ‌ల‌డా?

తెలుగు టీవీ చ‌రిత్ర‌లోనే అత్యంత విజ‌య‌వంత‌మైన షోగా జ‌బ‌ర్ద‌స్త్‌ను చెప్పొచ్చు. అందులో డ‌బుల్ మీనింగ్‌లు, బాడీ షేమింగ్‌ల గురించి అభ్యంత‌రాలు…

1 hour ago

ప్రొడ్యూసర్ కిరణ్ సక్సెస్ అయినట్టేనా

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాను నటించకుండా నిర్మించిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. సుమారు నలభైకి పైగా కొత్తవాళ్లను పరిచయం…

4 hours ago

ఆదిత్య ధర్ స్టోరీలు అమ్మేసుకున్న ఫ్రెండు

ఆదిత్య ధర్.. గత నాలుగు నెలలుగా దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. దురంధర్, దురంధర్-2 చిత్రాలతో అతను రేపిన సంచలనం అంతా…

4 hours ago

కేరళలో వివాదం చేసి తెలుగులో స్పందించిన నటుడు

ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి…

5 hours ago