Political News

మూడు లేన‌ట్టే.. ఇక రాన‌ట్టే.. వైసీపీలో గుస‌గుస‌…!


మూడు రాజ‌ధానుల‌పై ఆశ‌లు పెట్టుకున్న వైసీపీకి ఆ ఆశ‌లు ఇప్ప‌ట్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. ఉగాది సంద‌ర్భంగా పాల‌నా రాజ‌ధానిని విశాఖ‌కు త‌ర‌లించాల‌ని.. వైసీపీ అధిష్టానం సంక‌ల్పం చెప్పుకొంది. ఆ రోజు నుంచి జ‌గ‌న్‌కు మంచి రోజులు మొద‌ల‌వుతాయ‌ని.. విశాఖ శార‌దాపీఠం నుంచి కూడా సంకేతాలు వ‌చ్చిన ద‌రిమిలా.. రాజ‌ధాని మార్పుపై సీఎం జ‌గ‌న్ స‌హా ప్ర‌భుత్వం ఉత్సాహం చూపించింది. అయితే.. దీనిపై కేసులు న‌మోదై ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టులో త్వ‌ర‌గా విచార‌ణ పూర్తి చేయించాల‌ని కూడా నిర్ణ‌యించారు. ప‌దే ప‌దే కోర్టును కూడా కోరారు. కానీ, సుప్రీంకోర్టు మాత్రం దీనికి అంగీక‌రించ‌లేదు. షెడ్యూల్ ప్ర‌కార‌మే కేసును విచా రిస్తామ‌ని.. దీనికి జూన్ జూలై వ‌ర‌కు కూడా స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చ‌ని తేల్చి చెప్పింది. దీంతో ఎటూ వెళ్ల‌లేని ప‌రిస్థితి వైసీపీని ఇబ్బంది పెడుతోంది. పాల‌నా రాజ‌ధానిని క‌నుక విశాఖ‌కు త‌ర‌లిస్తే.. మూడు ప్రాంతాల ను అభివృద్ధి చేసేందుకు తాము ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని ప్ర‌జ‌ల‌కు చెప్పుకొనేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్నారు.

త‌ద్వారా.. టీడీపీకి కంచుకోట‌లుగా ఉన్న ఉత్త‌రాంధ్ర జిల్లాల‌పై ప‌ట్టు బిగించిన‌ట్టు అవుతుంద‌నికూడా.. వైసీపీ భావించింది. అయితే.. వైసీపీకి ఉన్న తొంద‌ర‌కు.. న్యాయ‌వ్య‌వ‌స్థ బ్రేకులు వేస్తూ వ‌చ్చింది. దీంతో ఈ ఉగాదికి రాజ‌ధాని త‌ర‌లింపు ప్ర‌క్రియ ముందుకు సాగే అవ‌కాశం లేదు. అదే స‌మ‌యంలో జూన్ జూలై నాటికి వైసీపీకి అనుకూలంగా ఏదైనా తీర్పు వ‌చ్చినా.. రాజ‌ధానిరైతులు.. మ‌రోసారి రివ్యూ పిటిష‌న్ వేస్తే.. ఆగిపోయే అవ‌కాశం ఉంటుంది.

అంటే.. మొత్తంగా.. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా.. రాజ‌ధాని అంశం అలానే ఉంటుంద‌నేది ప‌రిశీల‌కులు వేస్తున్న అంచ‌నాగా ఉంది. దీంతో ఎన్నిక‌ల్లో మూడు రాజ‌ధానుల అజెండాను వైసీపీ చేర్చే అవ‌కాశం ఉంది. మ‌రి దీనికి ప్ర‌జ‌లు అంగీక‌రిస్తారా? అనేది చూడాలి. ఏదైనా తేడా వ‌స్తే.. అమ‌రావ‌తి కే ప్ర‌జ‌లు జై కొడితే.. అప్పుడు వైసీపీ వ్యూహం మొత్తానికి విఫ‌లం కావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

2 hours ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

2 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

3 hours ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

3 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

4 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

4 hours ago