Political News

ఇచ్చిన వాంగ్మూలం వెన‌క్కి తీసుకుంటా: క‌విత కేసులో భారీ ట్విస్ట్‌

ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత మ‌రో 24 గంట‌ల్లో ఈడీ ముందు హాజ‌రై విచాణ‌ను ఎదుర్కొనాల్సి ఉంది. ఈ క్ర‌మంలోఅస‌లు ఏం జ‌రు గుతుంది..? ఆమె అరెస్టు అవుతారా? ఈడీ ఆమెను నిర్బంధిస్తుందా? అనే సందేహాలు.. స‌మ‌స్య‌లు.. రాజ‌కీ యంగా దుమారాలు చెలరేగాయి. అయితే.. ఇంత‌లోనే ఆక‌స్మికంగా.. సంచ‌ల‌నం చోటు చేసుకుంది.

క‌వితను విచారించేందుకు కీల‌క‌మైన‌.. ఈడీ ఆది నుంచి చెబుతున్న రామ‌చంద్ర‌పిళ్ల‌యి(క‌విత‌కు బినామీ ఈయ‌నేన‌ని ఈడీ కోర్టుకు తెలిపింది) వాంగ్మూలం విష‌యంలో సూప‌ర్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాను ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెన‌క్కి తీసుకునేందుకు అవ‌కాశం ఇవ్వాలంటూ.. పిళ్ల‌యి.. కోర్టుకు వెళ్లారు. తాజాగా ఆయ‌న రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈ మేర‌కు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై కోర్టు నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది.

ఈ పిటిష‌న్‌పై సానుకూలంగా కోర్టు నిర్ణ‌యం తీసుకుంటే.. పిళ్ల‌యి చెప్పిందంతా కూడా ‘తూచ్‌’ అవుతుంది. దీంతో మ‌రోసారి ఈడీ విచార‌ణ మొద‌టి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. నిజానికి పిళ్ల‌యి ఇచ్చిన‌స‌మాచారం ఆధారంగానే ఢిల్లీ కేసును ఈడీ విచారిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్పుడు తానిచ్చిన స‌మాచారాన్ని(వాంగ్మూలాన్ని) వెన‌క్కి తీసుకుంటాన‌ని పిళ్ల‌యి చెప్ప‌డం.. సంచ‌ల‌నంగా మారింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈడీకి చెప్పిన విష‌యాల్లో.. తను కవిత బినామీనని పిళ్ల‌యి చెప్పారు. అలాగే ఆమె చెప్పినందునే తన ఖాతాలోకి రూ.32 కోట్లు వచ్చాయని ఈడీకి తెలిపారు. కోటి రూపాయలు సైతం ఆయన సొంత అకౌంట్‌లో పడ్డాయి. వేరు వేరు అకౌంట్ల ద్వారా ఈ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు ఈడీ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్‌నకు 32.5 శాతం వాటాలున్నాయని, వీటిలో సైతం కవితకు వాటాలందాయని ఈడీ చెబుతోంది.

This post was last modified on March 10, 2023 3:01 pm

Share

Recent Posts

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

6 hours ago

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

6 hours ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

6 hours ago

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

10 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

10 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

11 hours ago