Political News

లోకేశ్ పాదయాత్రలో ప్రతి 100 కిలోమీటర్లకు ఏం జరుగుతోందంటే..

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 500 కిలోమీటర్ల మైలు రాయి దాటింది. రోజుకు సగటున సుమారు 13 కిలోమీటర్లు నడుస్తున్న లోకేశ్ 39 రోజుల్లో 500 కిలోమీటర్లు పూర్తి చేశారు. ప్రస్తుతం యాత్ర అన్నమయ్య జిల్లాలో కొనసాగుతోంది. యాత్ర 500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అన్నమయ్య జిల్లా ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జిల్లాలో టమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కాగా లోకేశ్ తన యాత్రలో ప్రతి 100 కిలోమీటర్లకు ఒక కీలక హామీ ఇస్తున్నారు.

100 కిలోమీటర్లు:
2022 డిసెంబర్ నెల 27వ తేదీ కుప్పంలో మొదలైన పాదయాత్ర 8వ రోజు న 100 కిలోమీటర్ల మైలు రాయి దాటినప్పుడు గత ఫిబ్రవరి 3వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాలెం వద్ద కిడ్నీ వ్యాధి గ్రస్తులకు డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

200 కిలోమీటర్లు:
అలాగే యాత్ర 16వ రోజున 200 కిలోమీటర్లు చేరినప్పుడు గంగాధర నెల్లూరు వద్ద డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ఫిబ్రవరి 11వ తేదీన హామీ ఇచ్చారు.

300 కిలోమీటర్లు:
తరువాత ఫిబ్రవరి 21వ తేదీన 23 వ రోజున యాత్ర 300 కిలోమీటర్లు దాటినప్పుడు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండమానుపురం వద్ద 13 గ్రామాల దాహార్తి తీర్చే నీటి పధకాన్ని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు.

400 కిలోమీటర్లు:
మార్చి 1వ తేదీన 32వ రోజున యాత్ర 400 కిలోమీటర్లు చేరింది. అప్పటికి యాత్ర చంద్రగిరి నియోజకవర్గంలో సాగుతోంది. దీంతో చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నరేంద్ర పురం వద్ద ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

500 కిలోమీటర్లు:
ఇక గురువారం యాత్ర 39వ రోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం సీటీఎం వద్ద 500 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకుంది. ఆ సందర్బంగా లోకేశ్ సీటీఎం వద్ద టమోటో ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి వంద కిలోమీటర్లు పూర్తి అయిన చోట ఒక శిలాఫలాకాన్ని ఆవిష్కరించి తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపు అమలు చేస్తామనే హామీలను ఇస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలతో మమేకం అవుతున్న లోకేష్ ప్రతి వంద కిలోమీటర్ల యాత్ర పూర్తి అయిన సందర్బంగా స్థానికులకు ప్రత్యేక హామీలు ఇస్తూ గుర్తుగా శిలా ఫలకం ఏర్పాటు చేసే ఆనవాయితీ ని కొనసాగిస్తున్నారు.

This post was last modified on March 10, 2023 11:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

3 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

4 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

5 hours ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

5 hours ago

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

7 hours ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

8 hours ago