Political News

లోకేశ్ పాదయాత్రలో ప్రతి 100 కిలోమీటర్లకు ఏం జరుగుతోందంటే..

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 500 కిలోమీటర్ల మైలు రాయి దాటింది. రోజుకు సగటున సుమారు 13 కిలోమీటర్లు నడుస్తున్న లోకేశ్ 39 రోజుల్లో 500 కిలోమీటర్లు పూర్తి చేశారు. ప్రస్తుతం యాత్ర అన్నమయ్య జిల్లాలో కొనసాగుతోంది. యాత్ర 500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అన్నమయ్య జిల్లా ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జిల్లాలో టమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కాగా లోకేశ్ తన యాత్రలో ప్రతి 100 కిలోమీటర్లకు ఒక కీలక హామీ ఇస్తున్నారు.

100 కిలోమీటర్లు:
2022 డిసెంబర్ నెల 27వ తేదీ కుప్పంలో మొదలైన పాదయాత్ర 8వ రోజు న 100 కిలోమీటర్ల మైలు రాయి దాటినప్పుడు గత ఫిబ్రవరి 3వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాలెం వద్ద కిడ్నీ వ్యాధి గ్రస్తులకు డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

200 కిలోమీటర్లు:
అలాగే యాత్ర 16వ రోజున 200 కిలోమీటర్లు చేరినప్పుడు గంగాధర నెల్లూరు వద్ద డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ఫిబ్రవరి 11వ తేదీన హామీ ఇచ్చారు.

300 కిలోమీటర్లు:
తరువాత ఫిబ్రవరి 21వ తేదీన 23 వ రోజున యాత్ర 300 కిలోమీటర్లు దాటినప్పుడు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండమానుపురం వద్ద 13 గ్రామాల దాహార్తి తీర్చే నీటి పధకాన్ని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు.

400 కిలోమీటర్లు:
మార్చి 1వ తేదీన 32వ రోజున యాత్ర 400 కిలోమీటర్లు చేరింది. అప్పటికి యాత్ర చంద్రగిరి నియోజకవర్గంలో సాగుతోంది. దీంతో చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నరేంద్ర పురం వద్ద ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

500 కిలోమీటర్లు:
ఇక గురువారం యాత్ర 39వ రోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం సీటీఎం వద్ద 500 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకుంది. ఆ సందర్బంగా లోకేశ్ సీటీఎం వద్ద టమోటో ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి వంద కిలోమీటర్లు పూర్తి అయిన చోట ఒక శిలాఫలాకాన్ని ఆవిష్కరించి తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపు అమలు చేస్తామనే హామీలను ఇస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలతో మమేకం అవుతున్న లోకేష్ ప్రతి వంద కిలోమీటర్ల యాత్ర పూర్తి అయిన సందర్బంగా స్థానికులకు ప్రత్యేక హామీలు ఇస్తూ గుర్తుగా శిలా ఫలకం ఏర్పాటు చేసే ఆనవాయితీ ని కొనసాగిస్తున్నారు.

This post was last modified on March 10, 2023 11:09 am

Share
Show comments
Published by
satya

Recent Posts

బీఆర్ఎస్‌కూ కావాలొక వ్యూహ‌క‌ర్త‌

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నే క‌ల‌లు గ‌న్న…

4 hours ago

అద్దం పంపిస్తా.. ముఖం చూసుకో అన్న‌య్యా..

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత‌, సొంత అన్న‌పై ఆమె తీవ్ర‌స్థాయిలో యుద్ధం…

5 hours ago

ఎన్టీఆర్ పుట్టిన రోజుకు సర్ప్రైజ్

పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్‌డేట్స్…

6 hours ago

ముద్రగడ సమాధి కట్టేసుకున్నారా?

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పరంగా అగ్రస్థానంలో ఉండే కాపు కులస్థుల కోసం ఉద్యమించిన నాయకుడిగా వంగవీటి మోహనరంగా తర్వాత ఓ మోస్తరు…

6 hours ago

ఆ చట్టం జగన్‌ మెడకు చుట్టుకుందా?

ఎన్నికలు జరగబోతున్నపుడు అనుకోకుండా కొన్ని విషయాలు కీలకంగా మారి అధికార పక్షాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అవి ఎన్నికల ఫలితాలనే…

7 hours ago

సరిపోని అల్లరితో నరేష్ ఇబ్బందులు

భారీ నమ్మకంతో రోజుల తరబడి ప్రమోషన్లు చేసిన ఆ ఒక్కటి అడక్కుకి మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. మాములుగా ఇలాంటి సినిమాలకు…

7 hours ago