Political News

అమరావతి భూములు అమ్మేస్తోందా ?

రాజధానిగా అమరావతి పనికి రాదు కానీ అమ్మకానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భూములు మాత్రం కావాలా ? ఇపుడిదే ప్రశ్న అమరావతి ప్రాంతం రైతుల నుండి ఎదురువుతోంది. వివిధ అవసరాల కోసం అమరావతి ప్రాంతంలోని 14 ఎకరాలను అమ్మేందుకు ప్రభుత్వం ఫైల్ సిద్ధం చేసింది. అమరావతి ప్రాంతంలోని రెండు గ్రామాల్లో 14 ఎకరాలను ఈ వేలం పద్దతిలో అమ్మేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ వేలం ద్వారా సుమారు రు. 75 కోట్ల వస్తుందని ఆశిస్తోంది.

కాజ-గుండుగొలను బైపాస్ రోడ్డుకు ఆనుకునే ఉన్న నవులూరు గ్రామంలో 10 ఎకరాలను అమ్మేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇక్కడ ఎకరా రు. 5.94 కోట్లున్నట్లు ప్రభుత్వం రేటు ఫిక్స్ చేసింది. అలాగే సీడ్ యాక్సిస్ రోడ్డుకు దగ్గరలో ఉన్న పిచ్చుకలపాలెం గ్రామంలో మరో 4 ఎకరాలను అమ్మకానికి సిద్ధం అయ్యింది. ఇక్కడ ఎకరా ధర రు. 5.4 కోట్లుగా లెక్కకట్టింది. బేసిక్ ధరలను ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి అంతకుమించిన ధరే వస్తుందని అంచనా వేస్తోంది. మరీ డబ్బును ప్రభుత్వం దేనికి వాడుతుందో తెలీటం లేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అమరావతి రాజధాని అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. జగన్ ఏమో రాజధానిని విశాఖలో ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నారు. టీడీపీ, రైతులేమో అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావటంతో సుప్రింకోర్టులో రివిజన్ పిటిషన్ వేసింది.

కోర్టులో విచారణ జరుగుతోందంటేనే సదరు అంశం వివాదాస్పదమని అందరికీ తెలిసిందే. రాజధాని అమరావతి అంశం వివాదాస్పదమంటే భూములు కూడా కలిపే అనర్ధం. మరి విదాదంలో ఉన్న భూములను ప్రభుత్వం అమ్మకానికి ఎలా పెడుతోంది ? కోర్టులో ఈ వివాదం తేలేంత వరకు ప్రభుత్వం భూముల విషయంలో వేలు పెట్టేందుకు లేదు. గతంలో కూడా ఒకసారి ఈ వేలం ద్వారా అమ్మకానికి భూములను రెడీ చేసి మళ్ళీ ఎందుకనో వెనక్కు తగ్గింది. మళ్ళీ రెండోసారి భూములను అమ్మకానికి రెడీ చేస్తున్న ప్రభుత్వం ఈసారి ఏమి చేస్తుందో చూడాలి.

Satya

Recent Posts

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

2 hours ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

2 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

3 hours ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

4 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

4 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

4 hours ago