Political News

అమరావతి భూములు అమ్మేస్తోందా ?

రాజధానిగా అమరావతి పనికి రాదు కానీ అమ్మకానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భూములు మాత్రం కావాలా ? ఇపుడిదే ప్రశ్న అమరావతి ప్రాంతం రైతుల నుండి ఎదురువుతోంది. వివిధ అవసరాల కోసం అమరావతి ప్రాంతంలోని 14 ఎకరాలను అమ్మేందుకు ప్రభుత్వం ఫైల్ సిద్ధం చేసింది. అమరావతి ప్రాంతంలోని రెండు గ్రామాల్లో 14 ఎకరాలను ఈ వేలం పద్దతిలో అమ్మేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ వేలం ద్వారా సుమారు రు. 75 కోట్ల వస్తుందని ఆశిస్తోంది.

కాజ-గుండుగొలను బైపాస్ రోడ్డుకు ఆనుకునే ఉన్న నవులూరు గ్రామంలో 10 ఎకరాలను అమ్మేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇక్కడ ఎకరా రు. 5.94 కోట్లున్నట్లు ప్రభుత్వం రేటు ఫిక్స్ చేసింది. అలాగే సీడ్ యాక్సిస్ రోడ్డుకు దగ్గరలో ఉన్న పిచ్చుకలపాలెం గ్రామంలో మరో 4 ఎకరాలను అమ్మకానికి సిద్ధం అయ్యింది. ఇక్కడ ఎకరా ధర రు. 5.4 కోట్లుగా లెక్కకట్టింది. బేసిక్ ధరలను ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి అంతకుమించిన ధరే వస్తుందని అంచనా వేస్తోంది. మరీ డబ్బును ప్రభుత్వం దేనికి వాడుతుందో తెలీటం లేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అమరావతి రాజధాని అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. జగన్ ఏమో రాజధానిని విశాఖలో ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నారు. టీడీపీ, రైతులేమో అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావటంతో సుప్రింకోర్టులో రివిజన్ పిటిషన్ వేసింది.

కోర్టులో విచారణ జరుగుతోందంటేనే సదరు అంశం వివాదాస్పదమని అందరికీ తెలిసిందే. రాజధాని అమరావతి అంశం వివాదాస్పదమంటే భూములు కూడా కలిపే అనర్ధం. మరి విదాదంలో ఉన్న భూములను ప్రభుత్వం అమ్మకానికి ఎలా పెడుతోంది ? కోర్టులో ఈ వివాదం తేలేంత వరకు ప్రభుత్వం భూముల విషయంలో వేలు పెట్టేందుకు లేదు. గతంలో కూడా ఒకసారి ఈ వేలం ద్వారా అమ్మకానికి భూములను రెడీ చేసి మళ్ళీ ఎందుకనో వెనక్కు తగ్గింది. మళ్ళీ రెండోసారి భూములను అమ్మకానికి రెడీ చేస్తున్న ప్రభుత్వం ఈసారి ఏమి చేస్తుందో చూడాలి.

This post was last modified on March 9, 2023 10:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్షమాపణలు చెప్పిన నాయుడు గారి అబ్బాయి

తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్‌కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…

3 hours ago

తెలుగు అభిమానులకు దురంధర్ స్ట్రోక్

భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…

4 hours ago

ట్రెండింగ్ మొదలుపెట్టిన భగత్ సింగ్

ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…

6 hours ago

దురంధర్ 2 ప్రీమియర్లు…..వాటి మీదే అందరి కళ్ళు

మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…

6 hours ago

బీఆర్ఎస్ టాక్‌: రోహిత్‌రెడ్డిపై ఇంత‌క‌న్నా చేయ‌లేం

'మొయినాబాద్ డ్ర‌గ్స్ పార్టీ' కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత‌, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్‌రెడ్డి విష‌యం మాజీ…

6 hours ago

జ‌గ‌న్‌ను చిక్కుల్లో పెట్టేశారుగా!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయ‌న‌కు పెద్ద చిక్కు వ‌చ్చింది.…

6 hours ago