Political News

రాధాకు హామీ లభించిందా ?

వంగవీటి రాధాకృష్ణకు హామీ లభించిందా ? పార్టీవర్గాల్లో ఇపుడీ విషయమీదే చర్చ జరుగుతోంది. ఈనెల 14వ తేదీన జనసేనలో చేరటానికి రాధా ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అలాంటిది హఠాత్తుగా మంగళవారం ఉదయం పాదయాత్రలో ఉన్న నారాలోకేష్ ను రాధా కలిశారు. ముందు పాదయాత్రలో పాల్గొన్న రాధా తర్వాత భోజన విరామ సమయంలో లోకేష్ తో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు.

పార్టీవర్గాల నుండి అందిన సమాచారం ఏమిటంటే టీడీపీ అధికారంలోకి రాగానే రాధాకు ఎంఎల్సీ పదవి ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారట. అందరం కలిసి కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని లోకేష్ స్పష్టంగా చెప్పారట. అనవసరంగా పక్క పార్టీలోకి వెళ్ళే ఆలోచన చేయద్దని హితవు చెప్పినట్లు తమ్ముళ్ళు చెబుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చేముందు ఇంకోపార్టీలోకి వెళ్ళే ఆలోచన మంచిదికాదన్నారట. నిజానికి రాధాకు ఉన్న బలమైన కోరిక ఏమిటంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీచేయాలని.

అయితే అందుకు అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ బలమైన నేత. బోండాను కాదని చంద్రబాబునాయుడు కొత్తగా రాధాకు టికెట్ ఇచ్చే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. అందుకనే అవకాశం లేని టికెట్ విషయంలో రాధాలో ఆశలు పెంచేకంటే ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేయటమే మేలని లోకేష్ భావించారట. అందుకనే ఎంఎల్సీ పదవిని ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు.

అలాకాదంటే వేరే నియోజకవర్గంలో పోటీచేసే ఆలోచనుంటే చెప్పమని అడిగారట. అయితే రాధా దానికి పెద్దగా సానుకూలంగా స్పందించలేదని సమాచారం. తాను చెప్పాల్సింది చెప్పానని కాబట్టి మిగిలిన విషయాలో ఆలోచించుకుని నిర్ణయం తీసుకోమని చెప్పేశారు. మరిపుడు రాధా ఏమి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. నిజానికి రాధా వల్ల పెద్దగా పార్టీకి వచ్చే ఉపయోగం ఏమీలేదు. కాకపోతే వంగవీటి రంగా కొడుకుగా రాధాకు కాస్త పేరుంది. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని చంద్రబాబు ఆలోచన. కాపుల ఓట్లు టీడీపీకి పడేట్లుగా రాధా చేయగలరని చంద్రబాబు నమ్ముతున్నారు. మరి చంద్రబాబు నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో చూడాల్సిందే.

This post was last modified on March 8, 2023 12:29 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

7 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

8 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

12 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

12 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

12 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

13 hours ago