వినటానికే విచిత్రంగా ఉంది ఈ విషయం. 2018లో విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి దాడి కేసులో కత్తే కీలకమైన సాక్ష్యం. అలాంటిది విచారణలో అసలు కత్తే కనిపించలేదని కోర్టు గుర్తించటం మరింత ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంతకీ విషయం ఏమింటే జగన్ పై కోడికత్తితో జరిగిన దాడి కేసు విచారణ మంగళవారం జరిగింది. ఈ కేసును ఎన్ఐఏ విచారిస్తోంది. విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో విచారణ మొదలైనపుడు దాడికి సంబందించి నిందితుడు శ్రీనివాస్ దగ్గర స్వాధీనం చేసుకున్న వస్తువులన్నింటినీ కోర్టులో ప్రజెంట్ చేయాలి.
అప్పట్లో నిందితుడి దగ్గర నుండి ఎయిర్ పోర్టు సెక్యూరిటి అయిన సీఐఎస్ఎఫ్ అధికారులు కోడికత్తి, సెల్ ఫోన్, పెన్ను, పర్సుతో పాటు జగన్ వేసుకున్న చొక్కాను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్ఐఏ దర్యాప్తు మొదలైనపుడు వస్తువులన్నింటినీ దర్యాప్తు అధికారులకు అప్పగించారు. అప్పటి నుండి ఎన్ఐఏ కోర్టులో కేసు విచారణ నత్తనడక నడుస్తోందనే చెప్పాలి. అలాంటిది మంగళవారం విచారణ జరిగింది. నిందితుడితో పాటు సీఐఎస్ఎప్, ఎన్ఐఏ ఉన్నతాధికారులంతా కోర్టులో హాజరయ్యారు.
విచారణ మొదలైన తర్వాత నిందితుడు దాడికి వాడిని కోడికత్తితో పాటు అప్పట్లో స్వాధీనం చేసుకున్న వస్తువులను బయటపెట్టమని జడ్జి అడిగారు. సాక్ష్యాలుంచిన బ్యాగును అధికారులు ఓపెన్ చేసినపుడు జగన్ చొక్కా తప్ప మరింకే వస్తువులు కనబడలేదట. ముఖ్యంగా దాడిలో ఉపయోగించిన కత్తి మిస్సయినట్లు జడ్జి గుర్తించారు. కీలకమైన కత్తే మిస్సయితే ఇక విచారణ ఎలా ముందుకు వెళుతుందని జడ్జి మండిపోయారట.
మరిప్పుడేం చేయాలి ? అందుకనే కేసును ఈనెల 14వ తేదీకి వాయిదా వేసిన జడ్జి అప్పటికి మిస్సయిన వస్తువులన్నింటినీ కోర్టు ముందుంచమని గట్టిగా చెప్పారట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంతో కీలకమైన సాక్ష్యాలు ఎలా మిస్సయయో అర్ధంకావటంలేదు. కోడికత్తి తదితరాలు ఎప్పుడు మిస్సయాయి ? కోర్టు విచారణకు వచ్చేటపుడు అన్నీ సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా అని అధికారులు చూసుకోరా ? అనే ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు ? మిస్సయిన ఆధారాలను అధికారులు ఎలా సంపాదించగలరో చూడాలి.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…