Political News

కవితకు ఈడీ నోటీసులు

అనుకున్నట్లే జరుగుతోంది. కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గతంలో సీబీఐ ఆమెను ప్రశ్నిస్తే ఇప్పుడు ఈడీ ఆమె వెంట పడుతోంది. గురువారం ఢిల్లీలో విచారణకు రావాలని ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేశారు.

లిక్కర్ స్కాంలో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్టు తర్వాత కవితకు సమన్లు ఖాయమని భావించారు. ఇప్పుడు అదే జరిగింది. కవితకు తాను బినామీనని పిళ్లై అంగీకరించిన నేపథ్యంలో కవితకు ఈడీ సమన్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కవితను,పిళ్లైను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే కవిత మరిన్ని కష్టాల్లో చిక్కుకోవడం ఖాయమనిపిస్తోంది. పిళ్లై దాదాపుగా అప్రూవర్ గా మారినట్లేనని భావిస్తున్నారు..

నిజానికి పదే తేదీన ఢిల్లీలో కవిత ఒక ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహిళా బిల్లుకు పార్లమెంటులో మోక్షం లభించాలని కోరుతూ ఆమె ఉద్యమించబోతున్నారు. అంతకు ముందే గురువారం ఆమెను ఈడీ విచారణకు పిలిచింది.

కవిత అరెస్టు ఖాయమన్న వార్తలు కూడా చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. నిజానికి ఢిల్లీ లిక్కర్ స్కాంను ఈడీ, సీబీఐ విచారిస్తున్నాయి.. అందులో ఏ సంస్థ కవిత అరెస్టును ముందుగా చూపిస్తుందో ఇప్పుడే చెప్పలేం. గురువారమే ఆమెను ఈడీ అరెస్టు చేసిన పక్షంలో తర్వాత సీబీఐ కస్టడీ కూడా కోరే అవకాశం ఉండొచ్చు.

టైమ్ అడుగుతున్న కవిత

గురువారం హాజరు కాలేనని ఈడీకి కవిత లేఖ పంపినట్లు సమాచారం. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున రాలేనని మరో రోజున వస్తానని చెప్పారట. మహిళా బిల్లుపై 10న ఢిల్లీ ధర్నా ఉన్నందున ఆ తర్వాత ఎప్పుడైనా వస్తానని కవిత చెప్పారని అంటున్నారు…

This post was last modified on March 8, 2023 10:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

38 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

58 minutes ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

4 hours ago