అనుకున్నట్లే జరుగుతోంది. కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గతంలో సీబీఐ ఆమెను ప్రశ్నిస్తే ఇప్పుడు ఈడీ ఆమె వెంట పడుతోంది. గురువారం ఢిల్లీలో విచారణకు రావాలని ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేశారు.
లిక్కర్ స్కాంలో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్టు తర్వాత కవితకు సమన్లు ఖాయమని భావించారు. ఇప్పుడు అదే జరిగింది. కవితకు తాను బినామీనని పిళ్లై అంగీకరించిన నేపథ్యంలో కవితకు ఈడీ సమన్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కవితను,పిళ్లైను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే కవిత మరిన్ని కష్టాల్లో చిక్కుకోవడం ఖాయమనిపిస్తోంది. పిళ్లై దాదాపుగా అప్రూవర్ గా మారినట్లేనని భావిస్తున్నారు..
నిజానికి పదే తేదీన ఢిల్లీలో కవిత ఒక ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహిళా బిల్లుకు పార్లమెంటులో మోక్షం లభించాలని కోరుతూ ఆమె ఉద్యమించబోతున్నారు. అంతకు ముందే గురువారం ఆమెను ఈడీ విచారణకు పిలిచింది.
కవిత అరెస్టు ఖాయమన్న వార్తలు కూడా చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. నిజానికి ఢిల్లీ లిక్కర్ స్కాంను ఈడీ, సీబీఐ విచారిస్తున్నాయి.. అందులో ఏ సంస్థ కవిత అరెస్టును ముందుగా చూపిస్తుందో ఇప్పుడే చెప్పలేం. గురువారమే ఆమెను ఈడీ అరెస్టు చేసిన పక్షంలో తర్వాత సీబీఐ కస్టడీ కూడా కోరే అవకాశం ఉండొచ్చు.
టైమ్ అడుగుతున్న కవిత
గురువారం హాజరు కాలేనని ఈడీకి కవిత లేఖ పంపినట్లు సమాచారం. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున రాలేనని మరో రోజున వస్తానని చెప్పారట. మహిళా బిల్లుపై 10న ఢిల్లీ ధర్నా ఉన్నందున ఆ తర్వాత ఎప్పుడైనా వస్తానని కవిత చెప్పారని అంటున్నారు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…