Political News

కవితకు ఈడీ నోటీసులు

అనుకున్నట్లే జరుగుతోంది. కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గతంలో సీబీఐ ఆమెను ప్రశ్నిస్తే ఇప్పుడు ఈడీ ఆమె వెంట పడుతోంది. గురువారం ఢిల్లీలో విచారణకు రావాలని ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేశారు.

లిక్కర్ స్కాంలో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్టు తర్వాత కవితకు సమన్లు ఖాయమని భావించారు. ఇప్పుడు అదే జరిగింది. కవితకు తాను బినామీనని పిళ్లై అంగీకరించిన నేపథ్యంలో కవితకు ఈడీ సమన్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కవితను,పిళ్లైను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే కవిత మరిన్ని కష్టాల్లో చిక్కుకోవడం ఖాయమనిపిస్తోంది. పిళ్లై దాదాపుగా అప్రూవర్ గా మారినట్లేనని భావిస్తున్నారు..

నిజానికి పదే తేదీన ఢిల్లీలో కవిత ఒక ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహిళా బిల్లుకు పార్లమెంటులో మోక్షం లభించాలని కోరుతూ ఆమె ఉద్యమించబోతున్నారు. అంతకు ముందే గురువారం ఆమెను ఈడీ విచారణకు పిలిచింది.

కవిత అరెస్టు ఖాయమన్న వార్తలు కూడా చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. నిజానికి ఢిల్లీ లిక్కర్ స్కాంను ఈడీ, సీబీఐ విచారిస్తున్నాయి.. అందులో ఏ సంస్థ కవిత అరెస్టును ముందుగా చూపిస్తుందో ఇప్పుడే చెప్పలేం. గురువారమే ఆమెను ఈడీ అరెస్టు చేసిన పక్షంలో తర్వాత సీబీఐ కస్టడీ కూడా కోరే అవకాశం ఉండొచ్చు.

టైమ్ అడుగుతున్న కవిత

గురువారం హాజరు కాలేనని ఈడీకి కవిత లేఖ పంపినట్లు సమాచారం. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున రాలేనని మరో రోజున వస్తానని చెప్పారట. మహిళా బిల్లుపై 10న ఢిల్లీ ధర్నా ఉన్నందున ఆ తర్వాత ఎప్పుడైనా వస్తానని కవిత చెప్పారని అంటున్నారు…

This post was last modified on March 8, 2023 10:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

24 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

1 hour ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

1 hour ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago