టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతున్న ఈ పాదయాత్రకు టీడీపీ నేతల నుంచి మంచి స్పందన వస్తోంది. యువ నాయకులు అందరూ నారా లోకేష్తో కలిసి అడుగులు వేస్తున్నారు. తాజాగా విజయవాడకు చెందిన యువ నాయకుడు, టీడీపీ నేత వంగవీటి రాధా కృష్ణ కూడా నారా లోకేష్తో పాదాలు కలిపారు.
గత జనవరి 27న ప్రారంభమైన యువగళం పాదయాత్ర.. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పూర్తి చేసుకుం ది. అయితే.. నెల రోజులు దాటిపోయినప్పటికీ.. ఇతర జిల్లాలకు చెందిన యువ నాయకులు పెద్దగా కని పించలేదు. తమ తమ జిల్లాల్లో ఈ యాత్ర జరిగినప్పుడు.. మద్దతు ఇవ్వాలని భావించినట్టు ఆయా నేతలు ప్రకటించారు. దీంతో యాత్ర జరుగుతున్న జిల్లాల నుంచి మాత్రమే నాయకులు వచ్చారు.
కానీ, తాజాగా వంగవీటి రాధా పీలేరుకు చేరుకుని.. నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించడం తోపాటు.. ఆయనతో కలిసి అడుగులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం. ఇదిలావుంటే.. 36 రోజులుగా సాగుతున్న యాత్రకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారు నారా లోకేష్ను కలిసి.. సమస్యలు చెప్పుకొంటున్నారు.
This post was last modified on March 7, 2023 2:39 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…