Political News

యువ‌గ‌ళంలో వంగ‌వీటి రాధా

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర జోరుగా సాగుతోంది. ప్ర‌స్తుతం ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతున్న ఈ పాద‌యాత్ర‌కు టీడీపీ నేత‌ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. యువ నాయ‌కులు అంద‌రూ నారా లోకేష్‌తో క‌లిసి అడుగులు వేస్తున్నారు. తాజాగా విజ‌య‌వాడ‌కు చెందిన యువ నాయ‌కుడు, టీడీపీ నేత వంగ‌వీటి రాధా కృష్ణ కూడా నారా లోకేష్‌తో పాదాలు క‌లిపారు.

గ‌త జ‌న‌వ‌రి 27న ప్రారంభ‌మైన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌.. జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో పూర్తి చేసుకుం ది. అయితే.. నెల రోజులు దాటిపోయినప్ప‌టికీ.. ఇత‌ర జిల్లాల‌కు చెందిన యువ నాయ‌కులు పెద్ద‌గా క‌ని పించ‌లేదు. త‌మ త‌మ జిల్లాల్లో ఈ యాత్ర జ‌రిగిన‌ప్పుడు.. మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని భావించిన‌ట్టు ఆయా నేత‌లు ప్ర‌క‌టించారు. దీంతో యాత్ర జ‌రుగుతున్న జిల్లాల నుంచి మాత్ర‌మే నాయ‌కులు వ‌చ్చారు.

కానీ, తాజాగా వంగ‌వీటి రాధా పీలేరుకు చేరుకుని.. నారా లోకేష్ పాద‌యాత్ర‌కు సంఘీభావం ప్ర‌క‌టించ‌డం తోపాటు.. ఆయ‌న‌తో క‌లిసి అడుగులు వేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. 36 రోజులుగా సాగుతున్న యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తున్న‌ట్టు టీడీపీ నేత‌లు చెబుతున్నారు. వివిధ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారు నారా లోకేష్‌ను క‌లిసి.. స‌మ‌స్య‌లు చెప్పుకొంటున్నారు.

This post was last modified on March 7, 2023 2:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

1 minute ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

45 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago