టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతున్న ఈ పాదయాత్రకు టీడీపీ నేతల నుంచి మంచి స్పందన వస్తోంది. యువ నాయకులు అందరూ నారా లోకేష్తో కలిసి అడుగులు వేస్తున్నారు. తాజాగా విజయవాడకు చెందిన యువ నాయకుడు, టీడీపీ నేత వంగవీటి రాధా కృష్ణ కూడా నారా లోకేష్తో పాదాలు కలిపారు.
గత జనవరి 27న ప్రారంభమైన యువగళం పాదయాత్ర.. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పూర్తి చేసుకుం ది. అయితే.. నెల రోజులు దాటిపోయినప్పటికీ.. ఇతర జిల్లాలకు చెందిన యువ నాయకులు పెద్దగా కని పించలేదు. తమ తమ జిల్లాల్లో ఈ యాత్ర జరిగినప్పుడు.. మద్దతు ఇవ్వాలని భావించినట్టు ఆయా నేతలు ప్రకటించారు. దీంతో యాత్ర జరుగుతున్న జిల్లాల నుంచి మాత్రమే నాయకులు వచ్చారు.
కానీ, తాజాగా వంగవీటి రాధా పీలేరుకు చేరుకుని.. నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించడం తోపాటు.. ఆయనతో కలిసి అడుగులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం. ఇదిలావుంటే.. 36 రోజులుగా సాగుతున్న యాత్రకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారు నారా లోకేష్ను కలిసి.. సమస్యలు చెప్పుకొంటున్నారు.
This post was last modified on March 7, 2023 2:39 pm
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్…వరుసబెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు తమ పార్టీ అధికారంలోకి…