టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతున్న ఈ పాదయాత్రకు టీడీపీ నేతల నుంచి మంచి స్పందన వస్తోంది. యువ నాయకులు అందరూ నారా లోకేష్తో కలిసి అడుగులు వేస్తున్నారు. తాజాగా విజయవాడకు చెందిన యువ నాయకుడు, టీడీపీ నేత వంగవీటి రాధా కృష్ణ కూడా నారా లోకేష్తో పాదాలు కలిపారు.
గత జనవరి 27న ప్రారంభమైన యువగళం పాదయాత్ర.. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పూర్తి చేసుకుం ది. అయితే.. నెల రోజులు దాటిపోయినప్పటికీ.. ఇతర జిల్లాలకు చెందిన యువ నాయకులు పెద్దగా కని పించలేదు. తమ తమ జిల్లాల్లో ఈ యాత్ర జరిగినప్పుడు.. మద్దతు ఇవ్వాలని భావించినట్టు ఆయా నేతలు ప్రకటించారు. దీంతో యాత్ర జరుగుతున్న జిల్లాల నుంచి మాత్రమే నాయకులు వచ్చారు.
కానీ, తాజాగా వంగవీటి రాధా పీలేరుకు చేరుకుని.. నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించడం తోపాటు.. ఆయనతో కలిసి అడుగులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం. ఇదిలావుంటే.. 36 రోజులుగా సాగుతున్న యాత్రకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారు నారా లోకేష్ను కలిసి.. సమస్యలు చెప్పుకొంటున్నారు.
This post was last modified on March 7, 2023 2:39 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…