Political News

నో ఫ్యామిలీ ప్యాకేజీ

వచ్చే ఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాకేజీలకు నో చెప్పాలని కేసీయార్ గట్టి నిర్ణయం తీసుకున్నారట. నియోజకవర్గాల్లో పట్టుందన్న కారణంగా ఒకే కుటుంబంలో రెండు టికెట్లు అడుగుతున్న చాలామంది సీనియర్లకు తన తాజా నిర్ణయంతో కేసీయార్ చెక్ పెట్టినట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. ఈ ఫ్యామిలీ ప్యాకేజీ విషయంలో అగ్రకులాలకు చెందిన సీనియర్ నేతలు ఎక్కవ ఒత్తిడి పెడుతున్నారట. ఒక నేతకు రెండు టికెట్లిస్తే మిగిలిన నేతలు కూడా అదే పద్దతిలో ఒత్తిడి పెట్టడం ఖాయమని కేసీయార్ భావించారని సమాచారం.

అందుకనే అసలు ఏ కుటుంబానికి కూడా రెండు టికెట్లు ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించారట. తొందరలో జరగబోయే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు కూడా సర్వేల్లో వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ఉండబోతోందని ఇప్పటికే హింగ్ ఇచ్చేశారట. పార్లమెటు ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి చూపే చాలామంది సీనియర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒకదానిలో తమ కుటుంబంలోని వాళ్ళకి టికెట్ ఇవ్వాలని ఇప్పటికే కేసీయార్ కు దరఖాస్తు చేసుకున్నారట. రాబోయే ఎన్నికలు వ్యక్తిగతంగా కేసీయార్ కు పార్టీపరంగా బీర్ఎస్ కు ఎంతో కీలకమైనది.

కాబట్టి టికెట్ల కేటాయింపు చాలా జాగ్రత్తగా చేయాలని లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదనే విషయం ఇప్పటికే సర్వేల్లో బయటపడింది. సీరియర్లలో చాలామంది కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళకి రెండో టికెట్ కావాలని పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మల్కాజ్ గిరి ఎంఎల్ఏ మైనంపల్లి హన్మంతరావు తన కొడుకు రోహిత్ కు కూడా టికెట్ ఇవ్వాలని అడిగారట. అలాగే మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, డిప్యుటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మాజీమంత్రి కడియం శ్రీహరి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి లాంటి చాలామంది సీనియర్లు రెండు టికెట్లు అడుగుతున్నట్లు ప్రచారంలో ఉంది.

రెండు టికెట్లు కాదు అసలు చాలామంది సీనియర్లకు కేసీయార్ టికెట్లు ఇస్తారా అనేదే డౌటుగా ఉందట. ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా సర్వే రిపోర్టుల్లో మంచి ఫీడ్ బ్యాక్ వస్తేనే అనేది కీలక పాయింట్ గా పెట్టుకున్నారు కేసీయార్. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

Satya

Recent Posts

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

9 minutes ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

1 hour ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

2 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

2 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

2 hours ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

3 hours ago