ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ప్రతిరోజూ ఎలక్షనే అన్నట్లుగా ఆ మూడ్ క్రియేట్ అయిపోయింది. రాష్ట్ర స్థాయి నుంచి ఎటు చూసినా ఓట్ల లెక్కలు, సీట్ల లెక్కలే వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. ఎలక్షన్ ఫీవర్ ఈ రేంజ్లో ఉన్న సమయంలో కొన్ని సర్వేలూ అంచనాలు వెలువరిస్తున్నాయి. ఈ సర్వేలు టీడీపీకి అనుకూలత చూపిస్తున్నా ఆ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని మాత్రం చెప్పడం లేదు. దీంతో వచ్చే ఎన్నికలపై గంపెడాశలు పెట్టుకున్న చంద్రబాబు, లోకేశ్లలో కంగారు కనిపిస్తోంది.
నిజానికి ఉవ్వెత్తున లేచిన కెరటంలా 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడేళ్లు తిరిగే సరికి ప్రభుత్వ వ్యతిరేకతను చవిచూసింది. ఆ స్థాయిలో మెజారిటీతో అధికారం అందుకున్న పార్టీలు సాధారణంగా కళ్లు మూసుకుని పదేళ్ల పాటు పాలన సాగించగలుగుతాయి. కేంద్రంలో బీజేపీ చేస్తున్నది అదే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ను 2014లో చితక్కొట్టేసిన తరువాత అడ్డనేదే లేకుండా రెండు టర్ములుగా దూసుకుపోతోంది. కానీ,…. ఏపీలో వైసీపీ మాత్రం స్వయంకృతాపరాధాలతో దెబ్బతిని వచ్చే ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో సీట్లను కోల్పోవడానికి సిద్ధమైపోయింది. కానీ.. వైసీపీ వైఫల్యాలను తమకు అనుకూలంగా మలచుకోవడంలో టీడీపీ ఇంకా వెనుకబడే ఉంది.
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని తాజాగా ఆత్మ సాక్షి సర్వే ఆధారంగా లెక్కలు వేస్తున్నప్పటికీ ఎన్నికల నాటికి పరిస్తితులు ఎలా మారుతాయన్నది చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో గత రెండు ఎన్నికలలో టీడీపీ మెరుగుపడని నియోజకవర్గాలపై దృష్టిపెట్టడమనేది తక్షణావసరంగా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ఏపీలో ఎస్టీ రిజర్వ్ స్థానాలు 7 ఉన్నాయి. అందులో టీడీపీ 2014లో ఒకటి.. 2009లో ఒకటి మాత్రమే గెలిచింది. 2019లో ఒక్క ఎస్టీ స్థానం కూడా టీడీపీ గెలవలేకపోయింది.
ఇక ఎస్సీ రిజర్వ్ స్థానాలు 29 ఉన్నాయి. వీటిలో 11 సీట్లలో గత మూడు ఎన్నికలలోనూ వరుసగా ఓడిపోతూ వస్తోంది టీడీపీ. మొత్తంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో 50 చోట్ల వరుసగా మూడు ఎన్నికల్లోనూ ఓడిపోయింది టీడీపీ. ఇక 2019 ఎన్నికల్లో ఆ పార్టీ సాధించింది 23 సీట్లే. 2019లో రాయలసీమలోని 52 స్థానాలలో 3 మాత్రమే గెలిచింది.
అయితే… ఇప్పుడిప్పుడే వేగం పెంచుతున్న టీడీపీ ఎన్నికల నాటికి కనుక పుంజుకొంటే వైసీపీకి ఓటమి తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇందుకుగాను ఆ పార్టీ కంచుకోటలపైనే కాకుండా తమకు కొన్నాళ్లుగా అవకాశమివ్వని నియోజకవర్గాలపైనా దృష్టి పెడితే ఫలితం ఉండొచ్చు.
ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…