Political News

రెబ‌ల్ ఎంపీ గ్రాఫ్ పెరిగిందా?  త‌రిగిందా?

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు గ్రాఫ్ పెరిగిందా?  త‌రిగిందా? ఏం జ‌రుగుతోంది? ఇదీ.. ఇప్పుడు ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న కీల‌క‌ చ‌ర్చ‌. దీనికి కార‌ణం .. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు ఉన్నాయి. ఆయ‌న టీడీపీ త‌ర‌ఫున పోటీ చేస్తార‌ని తెలుస్తోంది. జ‌న‌సేన‌-టీడీపీ పొత్తు ఉన్న‌ప్ప‌టికీ.. న‌ర‌సాపురం టికెట్‌ను మాత్రం టీడీపీకే కేటాయిస్తార‌ని స‌మాచారం.

టీడీపీ త‌ర‌ఫున తాను పోటీచేయ‌నున్న‌ట్టు చూచాయ‌గా స‌ద‌రు ఎంపీ చెబుతున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు ఇప్పుడు ఎంపీ ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న పోటీకి దిగితే నిలిచి గెలిచే ప‌రిస్థితి ఉందా? అనేది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో ఎంపీని అస‌లు రాష్ట్రంలోకే అడుగు పెట్ట‌కుండా.. వైసీపీ అధినాయ‌క‌త్వం ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని.. స‌ద‌రు ఎంపీనే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

త‌నను హైద‌రాబాద్ వ‌స్తేనే వెంటాడుతున్నార‌ని ర‌ఘురామ చెబుతున్నారు. స‌రే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న ఏ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసినా ప్రచారం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై నే అనేక సందేహాలు వ‌స్తున్నాయి. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం క్ష‌త్రియ సామాజిక వ‌ర్గంలో ర‌ఘురామ‌పై సానుభూతి ఉంది. ఆయ‌న ప‌ట్ల వారు సానుకూలంగానే ఉన్నారు.

అయితే, ఎన్నిక‌ల నాటికి క్ష‌త్రియుల‌ను కూడా ఓటు బ్యాంకు రూపంలో చీల్చే ప్ర‌య‌త్నాలు జోరుగా సాగుతుండ‌డం.. ఇక్క‌డ వైసీపీకి అనుకూలంగా పావులు క‌దుపుతుండ‌డం ఎంపీ విష‌యంపై చ‌ర్చ‌కు దారితీస్తోంది. పైగా.. గ‌తంలో టీడీపీ ఇక్క‌డ గెలిచిన ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు ర‌ఘురామ టీడీపీ త‌ర‌ఫున పోటీకి దిగితే.. సానుకూల ప‌వ‌నాలు ఏమేర‌కు ఉంటాయ‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్టీ త‌ర‌ఫున  కాకుండా.. ఆయ‌న ఒంట‌రిగానే బ‌రిలోకి దిగితే.. సానుభూతి వ‌స్తుందని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

2 hours ago

AI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిది

తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…

2 hours ago

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…

3 hours ago

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

4 hours ago

‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…

4 hours ago

ప్రధాని మోదీ పొరపాటును సరిచేసిన ప్రతిపక్ష ఎంపీ

పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…

5 hours ago