Political News

కేసీయార్ పై ఒత్తిడి పెరిగిపోతోందా ?

సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరగబోతున్న ఎంఎల్సీ ఎన్నికలు కాబట్టి ఆశావహుల నుండి కేసీయార్ పై సహజంగానే ఒత్తిడి పెరిగిపోతోంది. ఈనెల 29వ తేదీన ఎంఎల్ఏల కోటాలో ముగ్గురు ఎంఎల్సీల పదవీకాలం ముగుస్తోంది. మూడుస్ధానాల్లోను ఇపుడు అధికార బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి భర్తీ కాబోయే స్ధానాలు కూడా అధికారపార్టీకే దక్కబోతున్నాయి. నామినేషన్ వేస్తే గెలిచిపోతారు కాబట్టే ఈ మూడుస్ధానాలను దక్కించుకునేందుకు నేతల మధ్య పోటీ బాగా పెరిగిపోతోంది.

నవీన్ కుమార్, గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం నెలాఖరుకు ముగియబోతోంది. ఈ మూడుస్ధానాలను భర్తీ చేయాలంటే కేసీయార్ కుల సమీకరణలు, ఆర్ధిక పరిస్ధితి, అభ్యర్ధుల వ్యక్తిగత సామర్ధ్యం లాంటి ఎన్నో సమీకరణలను చూడాల్సుంటంది. ఒకవైపు కేసీయార్ పాలనపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం. మరోవైపు ఎంఎల్ఏలు, నేతల మధ్య పెరిగిపోతున్న వివాదాలు. ఇంకోవైపు అధికారం తమదే అని జబ్బలు చరుచుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.

ఇలా అన్నీవైపుల నుండి కేసీయార్ పై ఒత్తిళ్ళు బాగా పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది చివరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇపుడు ఎంఎల్సీలుగా ఎంపిక చేయబోయే నేతలు, వాళ్ళ సామాజికవర్గాలు సహకరించాలని సహజంగానే ముఖ్యమంత్రి ఆశిస్తారు. మరంతటి స్ధాయి ఉన్న నేతలు ఎవరున్నారు ? ఉద్యమకాలం నుండి కష్టపడుతున్న తమకు కేసీయార్ ఇప్పటివరకు అవకాశాలు ఇవ్వలేదని చాలామంది మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఎంఎల్సీ పదవుల్లో తమను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

గతంలో ఎంఎల్సీ పదవులు ఇస్తానని కేసీయార్ దగ్గర హామీలు పొందిన సీనియర్ నేతలు బూడిద భిక్షమయ్యగౌడ్, చల్లా వెంట్రామరెడ్డి పేర్లు గట్టిగా వినబడుతున్నాయి. అలాగే నవీన్ కుమార్ కు రెన్యువల్ ఉంటుందని కూడా ప్రచారంలో ఉంది. వీళ్ళు కాకుండా అరికల నర్సారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, చకిలం అనీల్ కుమార్, చాడ కిషన్ రెడ్డి, చింతల వెంకటేశ్వరరెడ్డి లాంటి అనేకమంది పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలాగున్నా ఇపుడు ఎంఎల్సీలు అవబోయే వాళ్ళు హ్యాపీగా ఆరేళ్ళు పదవుల్లో ఉంటారు. మరి చివరకు ఆ లక్కీ నేతలెవరో చూడాల్సిందే.

This post was last modified on March 6, 2023 1:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

27 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago